శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు | Sakshi
Sakshi News home page

శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

Published Tue, Nov 21 2023 12:30 AM

- - Sakshi

గుంతకల్లు: అయ్యప్ప మాలధారుల కోసం అనంతపురం జిల్లా మీదుగా కేరళలోని శబరిమలకు సికింద్రాబాద్‌–కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అఫీసర్‌ సీహెచ్‌ రాకేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు రైలు (07127) బయలుదేరి శనివారం రాత్రి 7.30 గంటలకు కొల్లం చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు (07128) కొల్లం జంక్షన్‌ నుంచి శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజూమున 4.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందని తెలిపారు. ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌తోపాటు సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ బోగీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయ్యప్ప స్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement