ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ వాంఖడే వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. తమ సొంత గ్రౌండ్లో మరోసారి సత్తాచాటాలని ముంబై జట్టు ఊవ్విళ్లరూతోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం హార్దిక్ సేన అన్నివిధాల సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్, ముంబై స్టార్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డును ఊరిస్తోంది.
ఈ మ్యాచ్లో రోహిత్ మరో మూడు సిక్సర్లు బాదితే టీ20 క్రికెట్లో 500 సిక్స్ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా రికార్డులకెక్కుతాడు. అదేవిధంగా ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్గా కూడా హిట్మ్యాన్ నిలవనున్నాడు.
కాగా ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, కీరన్ పొలార్డ్ (860), ఆండ్రీ రస్సెల్ (678), కొలిన్ మున్రో (548) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్(597) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.