Sakshi News home page

రౌడీషీటర్ల బైండోవర్‌

Published Wed, Apr 17 2024 8:20 AM

-

సాక్షి, సిటీబ్యూరో: గత ఎన్నికల సమయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లతో పాటు సస్పెక్ట్‌, హిస్టరీ షీట్లు ఉన్న వారిని ముందస్తుగానే బైండోవర్‌ చేయాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి అధికారులను ఆదేశించారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో విధిగా పర్యటిస్తూ నిఘా పెట్టాలని సూచించారు. త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. అక్రమం డబ్బు, మద్యం తరలింపు, ఉచితాలపై నిఘా పెట్టాలని, అవసరమైన చోట మరిన్ని చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. సమావేశంలో జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ జోయల్‌ డేవీస్‌, డీసీపీలు జీ వినీత్‌, నితికా పంత్‌, నారాయణరెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాస్‌, కే ప్రసాద్‌, సృజన కర్ణం, నర్సింహా కొత్తపల్లి, సాయిశ్రీ, డీవీ శ్రీనివాసరావు, డీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక్‌ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

అధికారులకు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఆదేశాలు

Advertisement
Advertisement