ఒంగోలు సబర్బన్: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు(అడ్మిన్) పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, డీపీఓ ఏఓ ఎం.సులోచన, డీసీఆర్బీ సీఐ బీమానాయక్, ఆర్ఐ శ్రీహరిరెడ్డి, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో..
స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో(పీటీసీ) అమరజీవి చిత్రపటానికి ప్రిన్సిపాల్ ఏఆర్ ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారని కీర్తించారు. ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణతోపాటు భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి పొట్టిశ్రీరాములు ఆధ్యుడయ్యారని గుర్తు చేశారు. ఆయన జీవితాన్ని ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్స్పాల్ డి.లక్ష్మణ్కుమార్, ఆర్ఐ సీహెచ్ సుబ్బారావు, సీఐలు, ఎస్సైలు, పీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.