హనుమాన్జంక్షన్రూరల్: ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు సమష్టిగా కనీస అమ్మకం ధరను నిర్ణయించుకుని చేపలు విక్రయించాలని ఆక్వా రైతు సంఘం నాయకుడు కె.ఉమాశంకర్ రెడ్డి తెలిపారు. బాపులపాడు మండలం కానుమోలులోని యూఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో బుధవారం ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఫంగస్ చేపలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా ఉండేందుకు కనీస అమ్మకం ధరలను సమావేశంలో నిర్ణయించారు. చేపల ఫీడ్ ధరలు, చెరువు లీజు రేట్లు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో చేపల అమ్మకం ధరలను పెంచక తప్పటం లేదని తెలిపారు. 1200 గ్రాముల బరువు కలిగిన ఫంగస్ చేపల కిలో ధర రూ.83 గానూ, 1500 గ్రాముల బరువు కలిగిన ఫంగస్ చేపల కిలో ధర రూ.85గా విక్రయించాలని ఆక్వా రైతులు ఏకగ్రీవంగా సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ఆక్వా ట్రేడర్లు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేజీ ఫంగస్ చేపల ధర రూ.65–71 మధ్య ఉండటంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, కేజీ చేప పెంపకానికి కనీస ఖర్చు రూ.85 అవుతుందని చెప్పారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటు చేయదల్చినట్లు తెలిపారు. ఆక్వా రైతు నాయకులు పెద్దిరెడ్డి రాము, కేశవరావు, ఎలకపల్లి రవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చేపల కనీస అమ్మకం ధరలపై తీర్మానం
Published Thu, Dec 21 2023 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement