Sakshi News home page

పార్వతీ పరమేశ్వరుల కల్యాణం

Published Fri, Mar 29 2024 1:25 AM

కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు  - Sakshi

నవాబుపేట: ఆదిబసవేశ్వర ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌, సరస్వతి దంపతులు పట్టు వస్త్రాలు, మాంగళ్యం, తలంబ్రాలతో వేడుకను చేపట్టారు. అనంతరం అమ్మవారికి వడిబియ్యం పోీశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చేపట్టిన మహామంగళ హారతితో వేడుకలు ముగిశాయి. కాగా తెల్లవారుజామున వీరశైవ సమాజం ఆధ్వర్యంలో అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. పూజారి శ్రీశైలం, రాజలింగం, జంగయ్య, సత్యం, లింగం, వెంకటయ్య, రాంచెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement