Sakshi News home page

ఓరుగల్లు తేజాలు

Published Wed, Apr 17 2024 1:20 AM

- - Sakshi

యూపీఎస్సీలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసులు మెరిశారు. మొదటి ప్రయత్నంలోనే జనగామకు చెందిన కౌశిక్‌ 82వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో జిల్లాకు గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చారు. గతేడాది 217వ ర్యాంకు సాధించిన హనుమకొండకు చెందిన జయసింహారెడ్డి.. ఐఏఎస్‌ లక్ష్యంతో నాలుగో ప్రయత్నంలో గతంలో కంటే మెరుగ్గా 104వ ర్యాంకు సాధించారు. గీసుకొండ మండలం అనంతారంలో రైతు కుటుంబానికి చెందిన సయింపు కిరణ్‌కు 568వ ర్యాంకు వచ్చింది. వరంగల్‌ నగరం శివనగర్‌కు చెందిన కొటె అనిల్‌కుమార్‌ 743వ ర్యాంక్‌ సా ధించారు. అయితే.. వీరిద్దరు ఇప్పటికే ఇతర ఉద్యోగాలు చేస్తూనే.. సివిల్స్‌కు ప్రిపేరై ర్యాంకులు సాధించారు. ముఖ్యంగా సయింపు కిరణ్‌కు ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉండగా.. కొటె అనిల్‌ కుమార్‌కు ఐఆర్‌ఎస్‌ వచ్చే చాన్స్‌ ఉంది. అయితే కోటె అనిల్‌ కుమార్‌కు ఐపీఎస్‌ కావాలనే కల ఉండడంతో చివరి అవకాశం ఆరోసారి సివిల్స్‌ రాసి ప్రయత్నిస్తారని అతడి తల్లిదండ్రులు అంటున్నారు.

Advertisement
Advertisement