Sakshi News home page

మావోయిస్టు సంతోష్‌కు ఘన నివాళి

Published Tue, Apr 16 2024 1:00 AM

-

కాటారం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పూజార్‌కాంకేర్‌ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌కు సోమవారం అమరుల బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఆశ్రు నివాళులర్పించారు. కాటారం మండలం అంకుషాపూర్‌ గ్రామపంచాయతీ పరిధి దస్తరిగిరిపల్లిలోని తన నివాసంలో సంతోష్‌ స్మారక స్తూపం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్‌ విప్లవ జీవితంపై పాటలు పాడారు. కార్యక్రమంలో బంధుమిత్రుల కమిటీ అధ్యక్షురాలు అంజమ్మ, ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, ట్రెజరర్‌ శాంత, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్‌నారాయణ, విరసం నేత రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement