బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Published Thu, Apr 18 2024 9:55 AM

అఖండ శ్రీనివాసమూర్తి, యడియూరప్పను  గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు  - Sakshi

శివాజీనగర: మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్‌.యడియూరప్ప సమక్షంలో కుమారుడు రేవంత్‌తో కలిసి బీజేపీలో చేరారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ అభ్యర్థి శోభాకరంద్లాజె, రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీ.సునీల్‌కుమార్‌, జిల్లాధ్యక్షుడు హరీశ్‌లు అఖండ శ్రీనివాసమూర్తికి పార్టీ జెండాను అందజేసి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అఖండ శ్రీనివాసమూర్తి చేరికతో పార్టీకి పెద్ద శక్తి వచ్చిందని యడియూరప్ప తెలిపారు. డీ.జే.హళ్లి, కేజే హళ్లి అల్లర్ల సమయంలో అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి దుండగులు నిప్పు పెట్టారని, ఆ సమయంలో కాంగ్రెస్‌ నేతలు స్పందించలేదని, దీంతో తాము మద్దతుగా నిలిచినట్లు యడియూరప్ప గుర్తుచేశారు. అఖండ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ శ్రీరాముడి ఆశీర్వాదంతోనే తనకు బీజేపీలో చేరే అవకాశం లభించిందన్నారు. కార్యకర్తగానే పార్టీకి సేవ అందిస్తానన్నారు. రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్‌, మాజీ మంత్రి శంకరపాటిల్‌ మునేనకొప్ప, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గోవిందరాజ్‌, పులికేశీనగర మండల అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement