Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Published Wed, Apr 17 2024 1:25 AM

ఘటనాస్థలం వద్ద రోదిస్తున్న బంధువులు - Sakshi

డ్రైవర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

నిజామాబాద్‌రూరల్‌: నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మండలంలోని తిర్మన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ట్రెయినీ ఎస్‌హెచ్‌వో, ట్రెయినీ ఐపీఎస్‌ చైతన్యరెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిర్మన్‌పల్లికి చెందిన దిలారి ప్రభాకర్‌(33) హైదరాబాద్‌లోని ఓ మెడికల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల ఎల్లారెడ్డిపేట్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి కుదరగా, సోమవారం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. వారంరోజులు సెలవుపై వచ్చిన ప్రభాకర్‌ గ్రామంలోనే ఉన్నాడు. మంగళవారం ఉదయం స్నేహితులు దిలారి రవి, జె.రాజుతో కలిసి ప్రభాకర్‌ బైక్‌పై గ్రామశివారు ప్రాంతానికి మలవిసర్జనకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో జన్నేపల్లి – నిజామాబాద్‌ రోడ్డుపై బియ్యం లోడ్‌తో అతివేగంగా దూసుకువచ్చిన ఐచర్‌ వ్యాన్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, రవి, రాజుకు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండడంతో ప్రమాదాలు జరగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

క్యాసంపల్లి వద్ద..

కామారెడ్డి క్రైం: కామారెడ్డికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద సిరిసిల్లా రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పాల్వంచ మండలం భవానీపేట తండాకు చెందిన లావుడ్యా రమేశ్‌ (35) కామారెడ్డిలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రాత్రి 9 గంటలకు బైక్‌పై పాల్వంచకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటాఏస్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

నిశ్చితార్థం అయిన మరుసటిరోజు..

Advertisement
Advertisement