Sakshi News home page

లక్ష్మీదేవునిపల్లిలో సైబర్‌ మోసం

Published Wed, Nov 15 2023 12:44 AM

-

భిక్కనూరు: మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన గుండ్రాడ్డి మౌనిక సైబర్‌మోసానికి గురై రూ. 2,26,270 నగదు పోగొట్టుకున్నట్లు ఎస్సై సాయికుమార్‌ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 8న ఇన్‌స్ట్రాగామ్‌లో వచ్చిన ఓ ప్రకటనకు ఆకర్షితురాలైన మౌనిక ఆ ప్రకటనలో ఇచ్చిన విధంగా వీడియో స్క్రీన్‌ షాట్‌ చేసి పంపింది. దీంతో ఆమెకు బ్యాంకు అకౌంట్‌లో సైబర్‌ మోసాగాళ్లు రూ. 300 ప్రోత్సాహకంగా వేస్తున్నట్లు చెప్పి ఆమె ఖాతాలో జమ చేశారు. దీంతో మౌనిక సైబర్‌ మోసాగాళ్లు చెప్పిన విధంగా చేస్తూ వారు చెప్పిన యూపీఐ ఐడీలకు రూ. 2,26,270 నగదును దపాల వారిగా పంపింది. తీరా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సైబర్‌ క్రైం పోలీసులు వెంటనే రూ. 19,994 నగదును సైబర్‌ మోసాగాళ్ల ఖాతాలో జమకాకుండా ప్రీజ్‌ చేశారు. అనంతరం భిక్కనూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు సైబర్‌ మోసానికి గురికాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

Advertisement
Advertisement