Sakshi News home page

ఘనంగా మహాశాంతి హోమం

Published Sat, Nov 11 2023 2:42 AM

స్వామి వారి చక్రస్నానంలో భక్తుల కోలాహలం  - Sakshi

కోలాహలంగా చక్రస్నానం

వాడపల్లిలో ముగిసిన వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

ఆత్రేయపురం: వాడపల్లి దివ్యక్షేత్రంలో శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 2న ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన శుక్రవారం ఉదయం స్వామి వారికి తీర్థపు బిందె, సుప్రభాత సేవ, నిత్యహోమాలు, ప్రత్యేక పూజలు, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మహా శాంతి హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, అవభృధ స్నానం, ధ్వజారోహణ.. సాయంత్రం మహదాశీర్వచనం, ఏకాంత సేవ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు దంపతులు పట్టు వస్త్రాలు అందజేశారు. కుటుంబ సమేతంగా హోమం పూర్ణాహుతిలో పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహోత్సవ క్రతువులను ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యాన వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, రంగురంగుల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారికి భక్తులు ఆర్జిత సేవలు నిర్వహించుకున్నారు.

8X5 OBT

Advertisement

What’s your opinion

Advertisement