Sakshi News home page

ఆటిజంపై అవగాహన అవసరం

Published Wed, Nov 15 2023 4:38 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరుణంలో సామాజికంగా ఆటిజం అనే సమస్య విపరీతంగా పెరిగిపోతున్నదని, దీనికి తల్లిదండ్రుల జీవనశైలి కూడా కారణమేనని సినీనటి, బిగ్‌బాస్‌ ఫేం హిమజ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం డా.ఏఎం.రెడ్డి ఆటిజం సెంటర్‌ ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఆటిజం పిల్లల్లో ఎదుగుదలను క్షీణింపజేస్తుందని, ఈ విషయంలో కుటుంబ సభ్యులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని అన్నారు. చిన్నారులకు అతిగా వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్‌లు వాడటం వలన మానసికంగా, శారీరకంగా సమస్యలు వస్తాయని డా.ఏఎం.రెడ్డి వివరించారు. దీనిని అరికట్టడం సామాజిక బాధ్యతని, హోమియోపతి ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకుండా ఆటిజం సమస్యను నిర్మూలించవచ్చన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement