Sakshi News home page

టీడీపీ ఎన్నికల ప్రచారంలో జీఎంసీ ఉద్యోగి

Published Fri, Mar 29 2024 2:20 AM

- - Sakshi

పట్నంబజారు: ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా నగర పాలక సంస్థ ఉద్యోగి ఒకరు టీడీపీ నేతలతో కలసి ప్రచారం నిర్వహిస్తున్నాడు. మొహమ్మద్‌ వసీం అలీ 2010 సంవత్సరం ముందుగానే జీఎంసీలో అటెండర్‌గా చేరారు. ప్రస్తుతం రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తన తండ్రి మరణించిన తర్వాత కారుణ్య నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. మాయాబజారు సమీపంలోని టీడీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎండీ నసీర్‌ అహ్మద్‌ నివాసానికి సమీపంలో ఉండే వసీం టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, అసెంబ్లీ అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌తో కలసి నిత్యం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌, జీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని అధికారులు

Advertisement

What’s your opinion

Advertisement