8,741 మంది డిశ్చార్జ్‌ | Sakshi
Sakshi News home page

8,741 మంది డిశ్చార్జ్‌

Published Tue, Aug 25 2020 4:11 AM

Coronavirus: 8601 Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: గడిచిన 24 గంటల్లో 8,741 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,68,828కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు మొత్తం 54,463 మందికి పరీక్షలు నిర్వహించగా 8,601 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 3,61,712కి చేరాయి. ఇప్పటి వరకూ 32,92,501 మందికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా 76 మంది మృతితో మొత్తం మరణాలు 3,368కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 89,516 ఉన్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు 61,657 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Advertisement
Advertisement