ఏపీలో ఇప్పటి వరకు 73,00,460 మందికి వ్యాక్సిన్‌ | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇప్పటి వరకు 73,00,460 మందికి వ్యాక్సిన్‌

Published Mon, May 10 2021 8:44 PM

7300460 People Vaccinated In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇప్పటివరకు  73,00,460 మందికి వ్యాక్సిన్‌ వేయటం జరిగింది. 73,49,960 కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులు ఏపీకి అందాయి. తొలి డోస్‌ కింద 53,23,098 మందికి.. రెండో డోస్‌ కింద 19,77,362 మందికి వ్యాక్సిన్ వేయటం జరిగింది. 45 ఏళ్లకు పైబడిన వారు మొత్తంగా 1,33,07,889 మంది వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకున్నారు. కేంద్రం మే నెల మొదటి 15 రోజులకు సంబంధించి.. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి 9,17,850 డోసులు ఇస్తామంది. ఇప్పటివరకు 7,65,360 డోసులు పంపిణీ చేసింది. ఇంకా 1,52,490 డోసులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే కోటా కింద, 16,85,630 డోసులు కేంద్రం కేటాయించింది. ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లు 4,93,930కాగా, రావాల్సినవి 11,91,700 ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement