ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో 7లక్షలకు పైగా కోలుకున్నారు

Published Sun, Oct 11 2020 7:45 PM

7 Lakhs Above Recovered Fron Coronavirus In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 75,517 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,210 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. కోవిడ్‌ బాధితుల్లో కొత్తగా 5509 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,03,208. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,295 . వైరస్‌ బాధితుల్లో కొత్తగా 30 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 6224 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 65,69,616 మందికి కరోనా సాంపిల్స్‌ పరీక్షించారు.

Advertisement
Advertisement