ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోండి | Sakshi
Sakshi News home page

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోండి

Published Mon, Nov 20 2023 2:00 AM

రిటైర్డు డిఎంఈ డాక్టర్‌ శశిప్రభతో ప్రసూతి,  గైనకాలజిస్టులు  - Sakshi

మహారాణిపేట: వృత్తి పరంగా వైద్య రంగంలో వచ్చే అధునాతన వైద్య ప్రక్రియలు, విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవాలని విశ్రాంత డీఎంఈ డాక్టర్‌ ఆర్‌.శశిప్రభ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం అబ్‌స్ట్రాక్ట్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ విశాఖపట్నం 56వ వార్షిక నిరంతర వైద్య విద్యా(సీఎంఈ) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ శశిప్రభ మాట్లాడుతూ ప్రసూతిలో అనేక నూతన, అధునాతన వైద్య పోకడలు వస్తున్నాయని, వాటి పట్ల ప్రసూతి వైద్యులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ వి.సీతారామరాజు మాట్లాడుతూ నూతన పద్ధతుల మీద అవగాహన కలిగించేందుకు సీఎంఈ తరచూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ అల్లూ నిహారిక ఈ ఏడాది చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రాక్ట్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీ(ఎఫ్‌వోజీఎస్‌ఐ) దక్షిణ విభాగ ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ సంపత్‌ కుమారి, కేజీహెచ్‌ క్యాన్సర్‌ విభాగాధిపతి డాక్టర్‌ శిల్ప, పలువురు ప్రసూతి వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement