మనస్థాపంతోయువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మనస్థాపంతోయువకుడి ఆత్మహత్య

Published Fri, Nov 17 2023 1:34 AM

-

డుంబ్రిగుడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లడంతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోల్లాపుట్టు పంచాయతీ బుసిపుట్టు గ్రామానికి చెందిన యువకుడు కొర్రా శ్రీను(18), అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ పింపలగుడ గ్రామానికి చెందిన వంతల లోకనాథ్‌ కుమార్తె జ్యోతి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురు వివాహం చేసుకుని సోమవారం స్వగ్రామం బుసిపుట్టు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి జ్యోతి కుటుంబసభ్యులు అదేరోజు అక్కడికి వెళ్లి గొడవకు దిగారు. మంగళ, బుధవారాల్లో కూడా తగాదాకు దిగడమే కాకుండా మారణాయుధాలతో బెదిరించి యువతి జ్యోతిని తీసుకువెళ్లిపోయారని శ్రీను కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువకుడు శ్రీను బుధవారం రాత్రి గ్రామ సమీపంలోని పనస చెట్టుకు ఉరేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై సర్పంచ్‌ రామ్మూర్తి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement