-
గొప్ప సంఘ సంస్కర్త.. బసవేశ్వరుడు
భానుపురి (సూర్యాపేట): కుల మతాలకు అతీతంగా దేశంలో మొదటి మతాంతర వివాహం జరిపించిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని లింగాయత్ లింగబలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లె శేఖర్ అన్నారు. బసవేశ్వరుడి 891వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని మినీట్యాంక్ బండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో లింగాయత్ లింగబలిజ సంఘ భవనం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ లింగ బలిజ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వల్లెం ఉమామహేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి సంకుర్ణుశెట్టి పరమేష్, కోశాధికారి అల్లం వీరయ్య, మహిళా అధ్యక్షురాలు సూర సోమేశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలు తొగరు ఉప్పమ్మ, కోశాధికారి దొడ్డి రాధిక, దొడ్డ నాగలక్ష్మి, శెట్టి శోభ, జిల్లా మీడియా ఇన్చార్జి బత్తుల మల్లికార్జున్, వల్లెం శంకరప్రసాద్, దొడ్డి ఈశ్వరయ్య, బాల్గాని కోటయ్య పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బందికి ఉచిత రవాణా సౌకర్యం
సూర్యాపేట: పోలింగ్ విధుల అనంతరం పీఓలు, ఏపీఓలు వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సూర్యాపేట కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో స్పెషల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశాం లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ లోక్సభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్.ప్రియాంక, బీఎస్ లతలో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో డీపీఆర్వో రమేష్కుమార్ ఉన్నారు. ఆ 48 గంటలు కీలకం భానుపురి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ముందు 48 గంటలు చాలా కీలకమని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వెంకటరావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ఫ కలెక్టర్ వెంకటరావు -
పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 8,314 మంది
భానుపురి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 3, 4 తేదీలతోపాటు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలో 7,851 మందికి 7,052 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. హుజూర్నగర్లో 1,916 మందికి 1,707 మంది, కోదాడలో 2,629 గాను 2,274 మంది, సూర్యాపేటలో 3,306 మందికి 3,071 మంది వినియోగించుకున్నారని పేర్కొన్నారు. అలాగే భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో 1,558 మందికి 1,262 మంది ఓటేసినట్టు తెలిపారు. మొత్తంగా రెండు లోక్సభ స్థానాల పరిధిలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 9,409 మందికి 8,314 మంది ఉద్యోగులు ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటేశారని, దీంతో జిల్లాలో 88.36 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు
సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, నలగొండ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో మాకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందనే బీఆర్ఎస్ గెలుపునకు నిదర్శనమని సూచించారు. తమ ఓటమి ఖాయం అయిందని భావించే కాంగ్రెస్ నాయకులు. పోలీసులను ఉపయోగించి బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నారన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే నరకం చూశామని ప్రజలే మాకు స్వయంగా చెబుతున్నారన్నారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతుబంధు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను రైతాంగం గ్రహించారన్నారు. తెలంగానలో సబ్బండ వర్గాలు కేసీఆర్తోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
‘కార్పొరేట్’లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట): 2024–25 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గిరిజన వసతిగృహం/ ఆశ్రమ పాఠశాలలో వసతి పొంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన గిరిజన విద్యార్థులు, కేజీబీవీ, ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, జనహర్ నవోదయ విద్యాలయం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యనభ్యసించి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 7.0 జీపీఏ నుంచి 10 జీపీఏ సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు telanganaepass.gov.in ఆన్లైన్ ద్వారా ఈనెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించని కుటుంబాలకు చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు కోదాడ: జిల్లా యత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయడంతోనే జిల్లాలో ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) అశోక్ అన్నారు. శుక్రవారం కోదాడలోని కేటీఎస్ పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాలల యాజమాన్యాలు, 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యాసంవత్సరం సూర్యాపేట జిల్లాను పది ఫలితాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. అనంతరం 10 జీపీఏ సాధించిన 161 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, శ్రీనయ్య, శ్రావణ్, జనార్దన్, ప్రతాప్, చత్రునాయక్, బాణాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్షయ తృతీయ సందడి భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట పట్టణంలో అక్షయ తృతీయ సందడి నెలకొంది. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా పట్టణంలోని అలంకార్ రోడ్డులోని బంగారం దుకాణాల్లో వివిధ వర్గాల ప్రజలు బంగారు నగలు కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది. గురువారం పది గ్రాముల కేడీఎం బంగారం ధర రూ.67వేలు, బిస్కట్ బంగారం రూ.73,500లు ఉండగా శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా రూ.1,500ల వరకు పెరిగి కేడీఎం రూ.68,500, బిస్కట్ రూ.75,300లకు చేరుకుంది. మట్టపల్లిలో వైభవంగా పూర్ణాహుతిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గల టీటీడీ కల్యాణ మండపంలో హైదరాబాద్కు చెందిన సుధీర్శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హోమ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం యాజ్ఞీకులు, అర్చకులు, రుత్విక్కులు వైభవంగా పూర్ణాహుతి గావించారు. అదేవిధంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనువంశక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు వియ్కుమార్, ఈఓ నవీన్కుమార్, మహదేవశర్మ, సుధీర్శర్మ, అర్చకులు, రుత్విక్కులు ఉన్నారు. -
పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్
భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం భువనగిరిలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శెగ్గెం సైదులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 11న సాయంత్రం నుంచి 13వ తేదీన పోలింగ్ పూర్తి అయ్యే వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ ఉంటాయని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా మద్యం విక్రయించినట్లు, రవాణా చేసినట్లు తెలిస్తే 87126 58939నంబర్కు సమాచారం అందించాలని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 581 కేసులు నమోదు చేసి 57మందిని అరెస్ట్ చేశామని, రూ.కోటి 97లక్షల 28వేల విలువ చేసే 1,49,318 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని, అదేవిధంగా భువనగిరి, యాదగిరిగుట్టలో రెండు గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
అవగాహన లేమి.. తగ్గుతున్న దిగుబడి!
సూర్యాపేట : రైతుల అవగాహన లేమి పంటల దిగుబడిపై ప్రభావం పడుతోంది. ప్రధానంగా ఏ భూమిలో ఏ రకమైన పంటలు సాగు చేయాలో.. ఏ భూమిలో ఏ పోషకాల స్థాయి ఎలా ఉంది.. ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు వాడాలన్నా విషయాలపై రైతులకు అవగాహన ఉండాలంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా రైతాంగానికి భూసార పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకపోగా.. క్షేత్రస్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులు సైతం ఈ దిశగా రైతాంగాన్ని చైతన్యపర్చడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 83 క్లస్టర్లు.. జిల్లావ్యాప్తంగా 83 క్లస్టర్లు ఉన్నాయి. వాటి పరిధిలో దాదాపు 6.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటాయి. జిల్లాలో 2.70లక్షల మంది రైతులు ఉన్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో వరితో పాటు పత్తి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో నేలల స్వభావం, అవసరమైన ఎరువులు, మందులు, ఏ నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందోనన్నది అవగాహన లేకుండానే ఏటా ఒకేవిధమైన పంటలను రైతాంగం సాగు చేస్తోంది. చాలామంది రైతులు ఏటా పత్తి మినహా ఇతర ఏ పంటలను సాగు చేయడం లేదు. అసలు ఆ నేల పత్తి పంటకు అనుకూలమో కాదో కూడా తెలియని పరిస్థితుల్లో సాగు చేసి నష్టపోతున్నారు. పరీక్షలు చేయించుకుంటేనే .. ప్రధానంగా రైతులు పంటల సాగుపై పెడుతున్న దృష్టి.. ఆ భూమిలో ఉన్న పోషకాల స్థాయి తెలుసుకోవడంలో చూపడం లేదు. దీంతో విచ్చలవిడిగా ఎరువులను వాడడంతో పెట్టుబడి వ్యయం పెరగడం, ఎరువులు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దిగుబడి ఆశించిన మేర రావడం లేదు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటే వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. భూసార పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకునే అవకాశముంటుంది. దీంతో ఏ పోషకాలు తక్కువగా.. ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయో వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సరిపోతోంది. నేల స్వభావాన్ని బట్టి అధికారుల సూచనల మేరకు వంగడాలను సైతం సాగు చేయొచ్చని, దీంతో దిగుబడి పెరగుతుందని అంటున్నారు.ఫ భూసార పరీక్షలు చేయించుకోవడంలో రైతులు వెనుకంజ ఫ ఇష్టానుసారంగా ఒకేరకమైన పంటల సాగు ఫ మొక్కుబడిగానే అధికారుల సూచనలు -
సూర్యాపేట
పెరుగుతున్న మూసీ నీటిమట్టం మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.1ప్రమాదంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. శుక్రవారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2024- 4లోగరిష్టం / కనిష్టం -
దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ
సూర్యాపేట : దేశం కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గురువారం సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ తీసుకురావడం, చేతివృత్తులు చేసుకునే నిరుపేదల కోసం విశ్వకర్మ యోజనతో ఆర్థిక రుణాలు అందించడం, 370 ఆర్టికల్ రద్దుచేసి కశ్మీర్ ను భారతదేశ అంతర్భాగంలో కలిపిన చరిత్ర కూడా ప్రధాని మోదీదేనన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 100శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పాలన అంతం కావాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు. ఫ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ -
భీంరెడ్డి పోరాట చరిత్ర మరువలేనిది
సూర్యాపేట : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, ఎంసీపీఐ పొలిట్ బ్యూరో సభ్యుడు భీంరెడ్డి నర్సింహా రెడ్డి చేసిన పోరాట చరిత్ర మరువ లేనిదని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వరికుప్పల వెంకన్న అన్నారు. గురువారం భీంరెడ్డి నర్సింహారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. నేటి యువత బీఎన్ ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, నాయకులు మోరపాక ఉగ్రయ్య, లింగంపల్లి రాజు, ఓంకార్, బి.ఎల్లమ్మ, ఏపూరి సోమన్న, మీసాల సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలి సూర్యాపేట : ఫాసిస్ట్ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా ప్రజలంతా తమ ఓటు హక్కు ద్వారా ఓడించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ కోరారు. గురువారం స్థానిక చండ్ర పుల్లారెడ్డి విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. హిందూత్వం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎమ్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, పి.లక్ష్మయ్య, పెద్దింటి రంగారెడ్డి, కనకారావు, సుంకురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, భయం లింగయ్య, దూదియా పాల్గొన్నారు. ప్రత్యేక మేనిఫెస్టోతో సూర్యాపేటకు ఎంతో మేలు భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం రూపొందించిన మేనిఫెస్టోతో సూర్యాపేటకు ఎంతో మేలు కలుగుతుందని టీపీసీసీ లీగల్, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టం విభాగం జిల్లా చైర్మన్ నూకల సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో న్యాయవాది మారపాక వెంకన్న నివాసంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు, ఇతర న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు సూర్యాపేట మీదుగా స్పీడ్ రైలు నడుపుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాస్ రావు, సోమేశ్వర్, గుంటూరు మధు, పోలేబోయిన నరసయ్య యాదవ్, నరేష్ పిళ్ళై, మంగు నాయక్, కోక రంజిత్ కుమార్, పసల బాలరాజు, అనంతుల సందీప్ ఉన్నారు. వంద శాతం సాధారణ కాన్పులే చేయాలి హుజూర్నగర్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందశాతం సాధారణ కాన్పులు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం కోరారు. గురువారం హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన ఆస్పత్రి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, ప్రజారోగ్య విభాగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమన్వయంతో పనిచేయూలని ఆయన చెప్పారు. నమోదైన ప్రతి గర్భిణికి పల్లె దవాఖానాలు, పీహెచ్సీల్లో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ జయ శ్యాంసుందర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ నాజియా, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కరుణ్ కుమార్, డేమో అంజయ్య, ఎస్ఓ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుణాత్మక బోధనతో మంచి ఫలితాలు
భానుపురి (సూర్యాపేట) : గుణాత్మకబోధనతో జిల్లాలో మంచి ఫలితాలు సాధించామని కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు. పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పదిలో ప్రత్యేక తరగతులు నిర్వహించి నాణ్యమైన విద్యానందించామన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాగా ఆదిశగా ముందస్తు ప్రణాళికతో విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పది ఉత్తీర్ణత విద్యార్థులు తొలి మెట్టుగా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో 354 మంది విద్యార్థులు 10 /10 జీపీఏ సాధించడం అంటే సాధారణ విషయం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో మున్ముందు ఇదే తరహాలో ఉత్తీర్ణత శాతం సాధించాలంటే ఉపాధ్యాయులు సమష్టి కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచిందని మున్ముందు మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. సూర్యాపేట డివిజన్ పరిధిలో మంచి మార్కులు సాధించిన 193 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మెమొంటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యాశాఖ అధికారి అశోక్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీ శైలజ, ఎంఈఓలు, హెంఎంలు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ వెంకటరావు హోం ఓటింగ్ 96.10శాతం భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 96.10శాతం మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకటరావు వెల్లడించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఈనెల 3, 4,8 తేదీల్లో కలిపి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 542 మందికి 526 మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నట్లు చెప్పారు. హుజూర్నగర్ లో 232 మందికి 225 మంది, కోదాడలో 150 మందికి 147 మంది, సూర్యాపేటలో 160 మందికి 154 మంది హోం ఓటింగ్లో పాల్గొన్నట్లు వివరించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 150 మందికి 139 మంది వినియోగించు కున్నారని, జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 692 మందికి 665 మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో 27 రూట్లలో 29 బృందాలు ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ చేపట్టాయన్నారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని గురువారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తి గావించి శ్రీస్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతోముస్తాబుచేసి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తిగట్టించారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం , పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రవేశం గావించి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. -
ఎన్నికల ముందు 48గంటల నిబంధన అమలు
● సూర్యాపేట ఎస్పీ రాహుల్హెగ్డేసూర్యాపేట: జిల్లాలో లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తున్నందున రానున్న 72గంటలు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తామని, ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 48 గంటల నిబంధనలు ఉంటాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. 48 గంటల నిబంధన మేరకు స్థానికేతరులు, ఓటర్లు కానీ వారు గ్రామాల్లో, వార్డుల్లో, కాలనీల్లో ఆశ్రయం తీసుకొని ఉండరాదని పేర్కొన్నారు. హోటల్స్, లాడ్జ్లలో కొత్త వ్యక్తులను ఉండనివ్వొద్దని కొత్త వ్యక్తులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. 144సెక్షన్ అమలులో ఉంటుంది, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువగా గుంపులుగా చేరవద్దు అని అన్నారు. ఇల్లు, ఇల్లు తిరిగి ప్రచారం చేయవద్దని, ఎకై ్సజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు సైతం మూసి వేయాలన్నారు. ప్రచారం ముగిశాక ఓటరు కానీ వారు నియోజకవర్గంలో ఉండవద్దని ఓటర్లను గుంపులుగా వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించడం నేరమని పోలింగ్ బూత్ లోపల ఓటు వేసే ప్రక్రియను ఫొటోలు, తనిఖీలు నిర్వహిస్తూ గ్రామాలు, పట్టణాలు, వార్డ్స్లో నిశితమైన నిఘా ఉంచుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం చల్లబడింది
ఫ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు భానుపురి (సూర్యాపేట) : పది, పదిహేను రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపిన భానుడు కాస్త శాంతించాడు. ఆదివారం నుంచి రెండుమూడు రోజుల పాటు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఉరుములు, మెరుపులతో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా గురువారం చాలా ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. మోతె మండలంలో 40.4, మునగాల మండలంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, తుంగతుర్తి మండలంలో అత్యల్పంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోదాడలో 40 డిగ్రీలు ఉండగా అనంతగిరి, పెన్పహాడ్, నడిగూడెం, చిలుకూరు, మఠంపల్లి, ఆత్మకూర్, నూతనకల్, చింతలపాలెం, సూర్యాపేట, పాలకవీడు మండలాల్లో 39.9 నుంచి 39.0 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. మద్దిరాల, మేళ్లచెర్వు, నేరేడుచర్ల, చివ్వెంల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో 38.9 నుంచి 38.0 డిగ్రీల మధ్య నమోదైంది. ఇక నాగారం 37.7, మద్దిరాల 37.3, జాజిరెడ్డిగూడెం మండలాల్లో 37.1, తిరుమలగిరిలో 36.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి!
నల్లగొండ: నల్లగొండ లోక్సభ నియోజకవర్గం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం చాలా అరుదు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కాగా.. ఎన్నికల సంఘం నల్లగొండ లోక్సభ నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను రిటర్నింగ్ అధికారిగా నియమించారు. ఈ మేరకు ఆమె నామినేషన్లు స్వీకరించారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా.. ఉమ్మడి జిల్లాల పరిధిలో నల్లగొండ నుంచే నామినేషన్లు స్వీకరించాల్సి ఉన్నందున మళ్లీ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందననే రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది. ఇటు లోక్సభ, అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఆమే వ్యవహరిస్తూ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. -
బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం
● నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన నల్లగొండ: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం ఉంటుందని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచారాలకు సంబంధించిన ఎస్ఎంఎస్లు పంపకూడదని అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎస్ఎంస్లు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
రైతు సంక్షేమమే ధ్యేయం
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 150 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులే నన్ను గెలిపిస్తాయి. నేను రైతు బిడ్డను. రైతుల కష్టాలపై అవగాహన ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటా కోసం పోరాడుతా. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తా. నాగార్జునసాగర్పై హక్కు కోల్పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా సాగర్ నుంచి ఈసారి సాగునీరు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తా. 1.90 లక్షల ఉద్యోగాలిచ్చాం బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో 1.90 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను విస్మరించింది. నేను గెలిచాక నిరుద్యోగుల తరఫున పోరాడుతా. రోడ్లు, రైల్వేలైన్లు అభివృద్ధి చేయిస్తా.. గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు రైల్వే, రోడ్ల సమస్యలను పట్టించుకోలేదు. నేను ఎంపీగా గెలిచాక రోడ్లు, రైల్వేల అభివృద్ధికి బాటలు వేస్తా. సూర్యాపేట మీదుగా హైదరాబాద్ – విజయవాడ రైలు మార్గం ఏర్పాటుకు కృషిచేస్తా. జాతీయ రహదారిపైన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, హైవేల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడతా. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి -
రైతు బంధుపై రేవంత్ దొంగనాటకాలు
ఆత్మకూర్(ఎస్): రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి దొంగనాటకాలు ఆడుతున్నాడని, రైతు బంధు వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీ పడేది లేదని, ఓట్ల రాజకీయం అవసరం లేదన్నారు. యాసంగి సాయం అందకముందే వానాకాలం సీజన్ మొదలైందన్నారు. వానాకాలం రైతు భరోసాపై రేవంత్ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు కొనసాగించేలా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలవుతున్నా ఒక్క పథకాన్ని కూడా అమలుచేయలేదన్నారు. రాబోయే రోజుల్లో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు కనుమరుగు చేసేలా కనిపిస్తోందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే, కాంగ్రెస్ కబంధహస్తాలనుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, నేరెళ్ల వెంకన్న, మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, బెల్లంకొండ యాదగిరి, ముద్దం క్రిష్ణారెడ్డి, కసగాని బ్రహ్మం, మిర్యాల వెంకటరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సోమిరెడ్డి వెంకటరెడ్డి, బొడ్డు మల్సూర్, బోళ్ల వెంకటరెడ్డి, సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వాంకుడోత్ వెంకన్న, గునగంటి భిక్షం ఉన్నారు.ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తాం
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పదేళ్లుగా అభివృద్ధితో కూడిన పాలనను అందిస్తున్నారు. ప్రజల్లో ఆయనపై ఉన్న సానుకూలత ఉంది. యువత మోదీ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. అందుకు నన్ను ఎంపీగా గెలిపిస్తారు. నేను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఎంపీలుగా ఉన్న వారు పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలో వచ్చాక ఆయా పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తా. మహిళలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించి వారి స్వయం సమృద్ధి కోసం చర్యలు తీసుకుంటా. సాగునీటి కష్టాలు దూరం చేస్తా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతులే ఉన్నారు. ఇక్కడి ప్రజలు, రైతులకు సాగునీటి కల్పన విషయంపై ప్రత్యేక దృషి సారిస్తా. నదుల అనుసంధానం విషయమై కేంద్ర ప్రభుత్వం మాట్లాడి.. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా రైతులకు సాగునీటి కష్టాలను దూరం చేస్తా. డ్రైపోర్టు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతా. హైవేలు, రైల్వే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హైవేల అభివృద్ధిపై దృష్టిపెడతాను. హుజూర్నగర్–దాచేపల్లి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు, మిర్యాలగూడ – జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు, సూర్యాపేట మీదుగా హైదరాబాద్– విజయవాడ కొత్త రైల్వే లైన్కు ప్రతిపాదిస్తా. బీబీనగర్ – నడికుడి డబ్లింగ్, నల్లగొండ – మాచర్ల రైల్వే లైన్ల పనుల వేగానికి కృషిచేస్తా. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి -
సాగునీరు, రైల్వే, రహదారులపై ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం ఉంది. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు, ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి సమన్వయం, కృషితో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం. నేను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తా. దేవరకొండలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 7 ఎత్తిపోతల పథఽకాలు, మిర్యాలగూడలో 3, నాగార్జునసాగర్లో నెల్లికల్, ఇతర ఎత్తిపోతల పథకాలు పెండింగ్లో ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లెంల చివరి దశలో ఉంది. వాటన్నింటినీ పూర్తి చేయిస్తా. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతం పరిస్థితుల ఆధారంగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తా. రైల్వే సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తా. నడికుడి – బీబీనగర్ డబ్లింగ్ పనులను వేగంగా పూర్తి చేసేలా చూస్తా. నల్లగొండ – కొండమల్లేపల్లి రోడ్డుతోపాటు పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషిచేస్తా. కేంద్రంతో మాట్లాడి నవోదయ విద్యాలయాలు తీసుకొస్తా. సాగర్పై హక్కుల కోసం కృషి నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వారే ప్రాజెక్టును అప్పగిస్తూ సంతకాలు చేశారు. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నావంతు పనిచేస్తా. -
తప్పిన అంచనాలు
ధాన్యం కొనుగోలుకు అధికారులు వేసిన అంచనాలు కొంతమేర తప్పాయి. కొనుగోలు కేంద్రాలకు దాదాపు 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 1,84,484 మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేశారు. మరో 50వేల నుంచి 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు భావిస్తుండగా.. సుమారుగా 1,01,412 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోయాయి. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ జలాలు అందక సాగు చేసినా నెలరోజులకే ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో పంట దిగుబడి తగ్గింది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నందున రెండురోజులుగా అక్కడక్కడా కొనుగోళ్లు మందగించాయని, తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. -
ఆటల్లో నైపుణ్యం పొందేలా..
హుజూర్నగర్ : వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి 10 మంది శిక్షకులను నియమించారు. రోజూ 450 మంది క్రీడాకారులు ఈ శిబిరాలను వినియోగించుకుంటున్నారు. పది ప్రాంతాల్లో క్రీడల్లో శిక్షణ జిల్లాలోని వివిధ మండలాల్లో పది చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. బాలబాలికలకు వేసవి సెలవులు వృథా కాకుండా వారి క్రీడా నైపుణ్యాలను పెంచుకునేందుకు వీటిని ప్రారంభించారు. ఒక చోట అథ్లెటిక్స్, రెండు చోట్ల కబడ్డీ, రెండు చోట్ల ఖోఖో, ఐదు చోట్ల వాలీబాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటిలో నడిగూడెంలో అథ్లెటిక్స్, చిలుకూరు, నూతనకల్ మండలం యర్రపహాడ్లో కబడ్డీ, సూర్యాపేట మండలం బాలెంల, గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలలో ఖోఖో, అనంతగిరి మండలం గొండ్రియాల, హుజూర్నగర్ మండలం లింగగిరి, పెన్పహాడ మండలం గాజులమల్కాపురం, సూర్యాపేట మండలం టేకుమట్ల, మఠంపల్లిలో వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. ఉత్సాహంతో.. వేసవి క్రీడా శిబిరాలకు గతంలో విశేష స్పందన లభించేది. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే వారు. నైపుణ్యాలు పెంచుకునేవారు. కరోనా నేపథ్యంలో 2019–20, 2020–21లో ఈ శిబిరాలు నిర్వహించలేదు. 2022 నుంచే ఈ శిబిరాలను మళ్లీ నిర్వహిస్తున్నారు. వీటిలో వివిధ ఆటల్లో నెల రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. జిల్లాలో చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించేదీ తక్కువే. దీంతో వేసవి క్రీడా శిబిరాలు చిన్నారులకు కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. క్రీడాకారులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పది ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు జిల్లా పరిధిలో ప్రాంతాల వారీగా శిక్షకులను నియమించారు. శిక్షకుడికి నెలరోజుల పాటు గౌరవ వేతనం చెల్లిస్తారు. వారు నెల రోజులు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మే 31 వరకు క్రీడా శిబిరాలు కొనసాగుతాయి. పది మంది శిక్షకులను నియమించాం. ఆసక్తిగల బాల బాలికలు ఈ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. వీటిల్లో తర్ఫీదు పొందిన వారికి క్రీడలశాఖ తరఫున ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. – కె జగదీశ్వర్రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి ఫ జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఫ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్లో తర్ఫీదు ఫ సద్వినియోగం చేసుకుంటున్న పిల్లలు ఫ రోజూ 450మంది వరకు హాజరు ఫ నెలాఖరు వరకు శిక్షణ -
యాసంగి రైతు భరోసాకు బ్రేక్!
భానుపురి (సూర్యాపేట) : రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా నిధులకు బ్రేక్ పడింది. ఈ యాసంగి సీజన్ ప్రారంభంలోనే చిన్న, సన్నకారు(ఐదెకరాలలోపు) రైతులకు డబ్బులను ప్రభుత్వం జమచేసింది. ఆ తర్వాత ఈ నిధులు విడుదల చేయకపోవడంతో చాలాకాలంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఐదెకరాల లోపు వారికే రైతుభరోసా ఇస్తారని ప్రచారం జరగ్గా.. ఈనెల 6వ తేదీనుంచి గతంలో మాదిరిగానే ఈ యాసంగి సీజన్కు సంబంధించి అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం, మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లాలోని ఐదెకరాల నుంచి 15 ఎకరాల వరకు భూమిఉన్న రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమచేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బుల జమను నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో డబ్బుల జమ ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో చిన్న,సన్నకారు రైతులకు.. యాసంగి ప్రారంభంలోనే విడతల వారీగా ఐదెకరాల లోపు నిధులువిడుదల చేసింది. జిల్లాలో మొత్తం 2,70,853 మంది రైతులు ఉండగా 2,47,348 మందికి ఇదివరకే నిధులు జమ అయ్యాయి. ఇందులో 0 – 2.5 ఎకరాల లోపు 1,98,542 మంది, 2.5 ఎకరాల నుంచి 5.0 ఎకరాల లోపు 48,806 మంది ఉన్నారు. మిగిలిన 5.0 ఎకరాల నుంచి 10.0 ఎకరాల లోపు 19,489 మంది, 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు 4,016 మంది.. మొత్తం 23,505 మందికి ఈనెల 6 నుంచి జమ అవుతున్నాయి. అయితే మంగళవారం సాయంత్రానికి నిధుల జమను ఎన్నికల కమిషన్(ఈసీ )నిలిపి వేసింది. అప్పటికే జిల్లాలో 15 ఎకరాల వరకు ఉన్న వారికి సాయం అందినట్లు రైతులు చెబుతున్నారు. ఇక మిగిలినకొద్ది మందికి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జమకానున్నాయి.ఫ ఈసీ ఆదేశాలతో తాత్కాలికంగా నిలిపివేత ఫ తాజాగా రెండు రోజుల పాటు కొందరు రైతుల అకౌంట్లలో జమ అయిన పెట్టుబడి సాయం ఫ గతంలో ఐదెకరాలలోపు 2,47,348 మందికి అందిన డబ్బులు -
No Headline
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై కాంగ్రెస్ ధీమా డ్రైపోర్టు, రైల్వే లైన్లు, ఉపాధిపై హామీలిస్తున్న బీజేపీ గతంలో చేసిన పనులు, కాంగ్రెస్ వైఫల్యాలను నమ్ముకున్న బీఆర్ఎస్ తాము గెలిస్తే.. చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రణాళికలను సాక్షితో పంచుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆత్మకూరు ఎస్. మండలంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి మాట్లాడారు. ధాన్యం తడిసిందని అధైర్య పడవద్దన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తుగా తార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ మిల్లులకు పంపాలని, మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 31,335 మంది రైతుల నుంచి 1,84,485.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు ఇప్పటివరకు రూ. 225 కోట్లు చెల్లించామని వివరించారు. కేంద్రాల్లో కొత్త గోనె సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
AP:మండుటెండను లెక్క చేయకుండా.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement