-
పటిష్ట బందోబస్తు
భద్రతలో పాలుపంచుకునే పోలీసు బలగాలు సివిల్ ఫోర్స్ 832 వింగ్ ఫోర్స్ 384 హోంగార్డులు 300 ట్రైనీ కానిస్టేబుళ్లు 300 ఛత్తీస్గఢ్ హోంగార్డులు 700 సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది 91 స్పెషల్ పార్టీ సిబ్బంది 64 వరంగల్ సీటీసీ 12 ఎన్సీసీ కేడెట్లు 90 కేంద్ర బలగాలు 443 -
నేడే లోక్సభ పోలింగ్
ఆదివరాహస్వామికి పూజలు కమాన్పూర్ : స్థానిక శ్రీఆదివరాహస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చా రు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు.● మూడు ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం ● ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ● పెద్దపల్లి జిల్లా మంథనిలో సాయంత్రం 4 గంటలకే ముగింపు ● కరీంనగర్లో 28, పెద్దపల్లిలో 42 మంది, నిజామాబాద్లో 29మంది పోటీ ● భారీ పోలీసు బందోబస్తుతో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ ● పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు, సిబ్బంది ● డబ్బులు అందక తీవ్ర నిరాశలో పలువురు ● రాత్రి వరకు వేచి చూసినా రాని నాయకులుసోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో నేడు(సోమవారం) జరిగే పోలింగ్కు అన్నిఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. గతనెల 18న నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ మూడుస్థానాల్లో ఎక్కడా రెబల్స్ లేకపోవడం గమనార్హం. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ (బీజేపీ), వెలిచాల రాజేందర్ రావు (కాంగ్రెస్), మాజీ ఎంపీ వినోద్కుమార్ (బీఆర్ఎస్)లతో కలిపి 28 మంది, పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ)లతో కలిపి 42 మంది, ఇక నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ (బీజేపీ), ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (కాంగ్రెస్), బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్)లతో సహా 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 2,194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయా కేంద్రాలకు ఆదివారం సాయంత్రం పోలింగ్ అధికారులు, సిబ్బంది ఈవీఎంలను తీసుకెళ్లారు. పోలీసు భద్రత మధ్య ఈవీఎంలు పోలింగ్స్టేషన్లకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలకు పోలీసు యంత్రాంగం 2,500మందితో భద్రత కల్పిస్తోంది. పార్లమెంట్ పరిధిలో 17లక్షల 97 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్లో వీల్చైర్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, నీడ వసతి కూలర్లు, ప్రత్యేక క్యూలైన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశారు. మొత్తం 10,200మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మొత్తం బ్యాలెట్ యూనిట్స్ 5,500, కంట్రోల్ యూనిట్స్ 2,743, వీవీ ప్యాట్స్ 3,077 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,012 పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు దాటిన వారందరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 15.96లక్షల ఓటర్లు, 1,462మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ముజమ్మిల్ఖాన్ వెల్లడించారు. 139 లోకేషన్లలో 221 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను, 38 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లాలో మొత్తం 497 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతీ ఒక్కఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.స్వీప్ స్టాండ్ వద్ద ఆర్వో ముజమ్మిల్ఖాన్న్యూస్రీల్ఆశ.. నిరాశ శనివారం ప్రచారం ముగియగానే.. ప్రలోభాలు మొదలైనా అవి ఆశించినస్థాయిలో లేవని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే డబ్బు, మందు పంపిణీ ప్రభావం చాలా తక్కువగానే జరిగిందని తెలిసింది. సాయంత్రం మూడు సెగ్మెంట్ల పరిధిలో కొన్ని మాత్రం చోట్ల డబ్బుల పంపిణీ జరిగింది. సిరిసిల్ల జిల్లాలో పంచమని ఇచ్చిన క్వార్టర్ బాటిళ్లలో మండల నా యకులు చేతివాటం ప్రదర్శించారు. జగిత్యాలలో పలుచోట్ల చికెన్, క్వార్టర్ బాటిళ్లు, ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ జరిగింది. ఇక పెద్దపల్లిలో డ బ్బుల పంపిణీ అంతగా జరగలేదు. కా ర్మికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం క్వార్టర్లు పంచారని సమాచా రం. ఇక కరీంనగర్ జిల్లాలో కులసంఘాలకు కొన్నిచోట్ల మందు పార్టీలు జరిగాయి. జిల్లాలో చాలాచోట్ల నాయకులు తమకు తాయిలాలు ఇస్తారని రాత్రి ఒంటి గంట వరకు ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. చాలా మంది ఇంటి ఎదుట లైట్లు ఆర్పేస్తే.. నే తలు అటు నుంచి అటే వెళ్లిపోతారన్న ఆందోళనతో రాత్రి ఒంటి గంట వరకు వాకిట్లో లైట్లు వేసే ఉంచారు. అయినా నేతలు రాకపోవడం కొసమెరుపు. జిల్లా మొత్తం ఓటర్లు అభ్యర్థులు కరీంనగర్ 17.90 లక్షలు 28పెద్దపల్లి 15.96 లక్షలు 42నిజామాబాద్ 17.04 లక్షలు 29 -
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
పెద్దపల్లిరూరల్: సోమవారం నిర్వహించే పా ర్లమెంట్ ఎన్నికల కోసం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 72 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఇందులో ఒక్కో నియోజకవర్గానికి ఐదేసి చొప్పున మహిళలకు ప్రత్యేకంగా 35 పోలింగ్ కేంద్రాలను సుందరీకరించారు. అలాగే యువత, దివ్యాంగులకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 14 పోలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేశారు. ఇక మోడల్ పోలింగ్ స్టేషన్లుగా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురిలో ఐదేసి చొప్పున 20, రామగుండం, మంథని,పెద్దపల్లిలో ఒక్కొక్కటి చొప్పున 3 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రూ.2.14కోట్లు జప్తు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లో చేపట్టిన వాహన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.2,14,04,742 నగదును జప్తు చేశామని, అందులో ఆధారాలు చూపిన వారికి గ్రీవెన్స్ క మిటీ రూ.2,08,13,242 నగదు విడుదల చే సిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్తెలిపారు. ఆధారాలు చూపని రూ. 5,91,500 నగదు సీజ్ చేశామని పేర్కొన్నారు. ‘ఎల్లంపల్లి’లో 5 టీఎంసీలు రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. నీటిపారుదలశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. అయితే, ఆదివారం నీటిమట్టం 140.89 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 5.90 టీఎంసీలకు పడిపోయింది. -
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలకు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్నిఏర్పా ట్లూ పూర్తిచేశారు. ప్రధానంగా సమస్యాత్మక, మా వోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సా రించారు. ఇందుకోసం రామగుండం పోలీస్ కమిషనరేట్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. పె ద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో సోమవారం నిర్వహించే పోలింగ్కు ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉన్న 6 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సె క్టార్ అధికారులు, పోలీస్రూట్ మొబైల్ అధికారు లు, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారుల పర్యవేక్షణలో ఈవీఎంలను పోలింగ్ లొకేషన్లకు తరలించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతపై దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యం పర్యవేక్షణ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. 48గంటల సైలెన్స్ పీరియడ్లో లాడ్జీలు, ఫంక్షన్హాళ్లు, గెస్ట్హౌస్లు తనిఖీ చేశారు. స్థానికేతరులను ఇక్కడి నుంచి పంపించివేశారు. మద్యం, నగదు, ఇతర విలువైన బహుమతుల పంపిణీ నియంత్రణకు డేగకన్నుతో నిఘా కాస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పాతనేరస్తులపై నిఘా పెంచారు. డ్రోన్లతో నిఘా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి, పోలింగ్కు భంగం కలిగించి, అల్లర్లు గొడవలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. -
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సోమవారం తన ఓటుహక్కు వినియోగించుకోనున్నా రు. పట్టణ శివారులోని రంగంపల్లి పో లింగ్ కేంద్రంలో ఆయన తన ఓటుహ క్కు వినియోగించుకోనున్నారు. ఈమే రకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మపాత్ర నిత్య నూతనం జ్యోతినగర్(రామగుండం): అమ్మ పాత్ర నిత్య నూతనమని ఎన్టీపీసీలోని దీప్తి మహిళా సమితి ఉపాధ్యక్షురాలు జ్యోత్స్న త్రిపాఠి అన్నారు. ఎన్టీపీసీ రా మగుండం పర్మినెంట్ టౌన్షిప్లోని బాలికా సాధికారత మిషన్–2024 శిక్ష ణ కేంద్రంలో ఆదివారం మదర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా త్రిపాఠి మాట్లాడారు. అమ్మ ఒక్కరే అయినా, ఆమె పోషించే పాత్రలు అనేకమని పేర్కొన్నారు. గృహిణిగా, తల్లి గా, సోదరిగా, భార్యగా.. ఇలా ఎన్నో పాత్రల్లో తనకు తెలియకుండానే ఒదిగిపోయి కుటుంబ ఎదుగుదలకు ఊపిరిలూదుతోందని పేర్కొన్నారు. ఆమెను సమాజం గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం బాలికలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి సభ్యులు పద్మశ్రీతోపాటు జెమ్ శిక్షణ పొందుతున్న బాలికలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు
ముస్తాబాద్(సిరిసిల్ల): మత్తు పదార్థాలకు అలవాటు పడి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రంలో ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ద్విచక్రవాహంలోని 20 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేయగా, కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన కట్కూరి కుమార్ (22), మంద వినయ్ (21)గా గుర్తించారు. వినయ్ కుటుంబం పదేళ్ల క్రితమే ముస్తాబాద్ మండలం మోహినికుంట నుంచి మాచారెడ్డికి వలస వెళ్లింది. అక్కడ గంజాయికి అలవాటు పడ్డ కట్కూరి కుమార్, మంద వినయ్ ముస్తాబాద్లో పరిచయాలు పెంచుకొని గంజాయి రవాణా చేశారు. పోలీసులు పక్కా సమాచారం మేరకు ఇద్దరు యువకులను అరెస్టుచేసి బైక్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
మాజీ ఏఎంసీ చైర్మన్పై దాడి
వేములవాడరూరల్: వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ గడ్డం హన్మాండ్లుపై దాడి సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతి తెలిపారు. శనివారం వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో అదే గ్రామానికి చెందిన చెక్కిళ్ల పర్శరాములు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు తెలిపారు. డబ్బుల విషయంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రేమించాలని వేధింపులు గంగాధర: ప్రేమించాలంటూ వేధించడంతో ఓ వి వాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కకాశీ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తుర్కకాశీ నగర్కు చెందిన వివాహితను మల్యాల మండలం తాటిపెల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముబారక్ ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో గత శుక్రవారం మంగపేట శివారులోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సయ్యద్ ముబారక్ను శనివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘బీజేపీ చేసిన అప్పు రూ.103 లక్షల కోట్లు’ చిగురుమామిడి: పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే కాకుండా రూ.103 లక్షల కోట్ల అప్పు చేసిందని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫె సర్ వీరన్న నాయక్ ఆరోపించారు. శనివారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు చేస్తే 750 మందిని చంపించారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేయని కేంద్రం బడా వ్యాపారస్తులకు మాత్రం రూ.25 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. -
కాంగ్రెస్ నాయకుడి మృతి
ఓదెల(పెద్దపల్లి): గుండ్లపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముక్కీస గణపతిరెడ్డి(70) శనివారం మృతిచెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గణపతిరెడ్డి అంత్యక్రియలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరయ్యారు. గీత కార్మికుడికి తీవ్రగాయాలు సిరిసిల్ల: పట్టణ శివారులోని రగుడు గ్రామంలో శనివారం ఏశ దేవరాజుగౌడ్ (58) తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరాజుగౌడ్ ఎప్పటిలాగే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా మోకుజారి కిందపడ్డాడు. తీవ్రగాయాలుకాగా అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మద్యం దుకాణాలు సీజ్ చందుర్తి : మండలంలోని మర్రిగడ్డ, చందుర్తిలోని వైన్స్ షాపులను వేములవాడ ఎకై ్సజ్ ఎస్సై రవిరెడ్డి శనివారం సీజ్ చేశారు. ఈనెల 13 సాయంత్రం 6 గంటలలోపు వైన్స్ షాపులను తెరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. 48 గంటల పాటు వైన్స్ షాపులు మూసి వేసి ఉంటాయని ఎస్సై తెలిపారు. వృద్ధురాలి ఆత్మహత్య కోనరావుపేట: తన కుమారుడు బాగోగులు పట్టించుకోకపోవడ లేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బావుసాయిపేట గ్రామానికి చెందిన వంగాల మణెవ్వ (82) కు కుమారుడు వెంకటేశ్, కూతురు భూలక్ష్మి ఉన్నారు. భర్త మురారి కొన్నేళ్ల క్రితం మృతిచెందగా కుమారుడు వెంకటస్వామి వేములవాడలో ఉంటున్నాడు. మణెవ్వ ఒక్కతే బావుసాయిపేటలో ఉంటుంది. కొన్ని రోజులుగా ఆమె బాగోగులను కుమారుడు పట్టించుకోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు. ఓటరు అవగాహన సదస్సుచొప్పదండి: చొప్పదండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వాకర్స్ క్లబ్ సభ్యులు స్థానిక వాకర్స్ గ్రౌండ్లో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. క్లబ్ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేశ్ మాట్లాడుతూ.. డబ్బుకు ఆశ పడకుండా నిజాయతీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. దేశంలో 65 శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలి పారు. ప్రజాస్వామ్య పరిపుష్టికి 100 శాతం ఓటింగ్ జరగాలని పిలుపునిచ్చారు. నాయకులు దూస రాము, కొల్టూరి జితేందర్, తొడుపునూరి లక్ష్మయ్య, వల్లాల జగన్, కుమార్ పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక పోటీలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణంలోని క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు చేపట్టారు. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల ఫుట్బాల్ చాపింయిన్షిప్ పోటీల్లో ప్రతిభ చూపాలన్నారు. సంఘం కార్యదర్శి గణపతి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఈనెల 24 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. ప్రతినిధులు అంతటి శంకరయ్య, కృష్ణమూర్తి, నరేశ్కుమార్, షఫీ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు
రామగుండం: గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోయాయి. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేదు. ఎన్టీపీసీ, హెచ్ఎండబ్ల్యూఎస్కు అత్యవసరంగా నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో అతివేగంగా నీటి నిల్వలు పడిపోతున్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు అడుగులు పడిపోతే.. ● ప్రతీరోజు హైదరాబాద్ నగరానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అవుతోంది. ● ఇందుకోసం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి శివారులో నిర్మించిన పంపుహౌస్ నుంచి ప్రతీరోజు 6.6 కేవీ సామర్థ్యం గల ఆరు విద్యుత్ మోటార్లతో 56 క్యూసెక్కులు(0.03 టీఎంసీ)లు పంపింగ్ చేస్తున్నార. ● ప్రాజెక్టులో నిర్దేశిత ఎత్తులో నీటి మట్టం ఉంటేనే హైదరాబాద్ మెట్రోకు పంపింగ్ సవ్యంగా సాగుతుంది. ● ప్రస్తుతం నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. ● ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా శుక్రవారం 140.9 మీటర్లుగా ఉంది. ● 138.3 మీటర్ల వరకు నీటి మట్టం ఉంటేనే విద్యుత్ మోటార్లు నడుస్తాయి. ● నీటి సరఫరా సవ్యంగా సాగుతుంది. ● అంతకు మించి తగ్గితే నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ● ప్రస్తుత నీటి మట్టానికి కేవలం రెండు అడుగుల వ్యత్యాసమే ఉంది. మోటార్లు సిద్ధం.. ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోతే మెట్రో నగరాలకు నీరు సరఫరా చేసేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అప్రోచ్ కెనాల్ హెడ్ రెగ్యులేటరీ నుంచి ప్రాజెక్టులో 1.8 కిలోమీటర్ల లోతట్టు ప్రాంతం వరకు మట్టి రోడ్డు సిద్ధం చేసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నీటిని హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎత్తిపోసేందుకు 125 హెచ్పీ సామర్ధ్యం గల 25 విద్యుత్ మోటార్లను అందుబాటులో ఉంచారు. ఇందుకోసం మోటార్లు, ప్లాట్ఫారం, ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు ప్లాట్ఫారం నిర్మించారు. నీటి సమాచారం.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు, కాగా నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం నీటిమట్టం 140.91 మీటర్లు ఉండగా, నీటి నిల్వలు 5.96 టీఎంసీలకు పడిపోయాయి. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 331 క్యూసెక్కులు విడుల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఏలాంటి ఇన్ఫ్లో లేదు. ప్రాజెక్టులో నీటి మట్టం 134 మీటర్లకు పడిపోతే.. డెడ్ స్టోరేజీకిగా ప్రకటిస్తారు. డెడ్ స్టోరేజీ దశలో ఉండగా ప్రాజెక్టులో 0.690 టీఎంసీలు నిల్వ ఉంటుంది. హైదరాబాద్ ప్రజల తాగునీటికి గండం! అడుగంటిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అప్రమత్తమైన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు -
‘మోదీని నిరుద్యోగులే ఇంటికి సాగనంపాలి’
హుజూరాబాద్: రపధాని మోదీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ వారికి అనుగుణంగా చట్టాలను మారుస్తున్నారని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, తర్వాత ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రతీ పౌరుని ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పి, ఒక్కరికీ వేయలేదని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో జీఎస్టీ లాంటి పన్నులను ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నారు. దీని ఫలితంగా స్వయం ఉపాధి రంగంలోని చిన్న వ్యాపారాలు కుప్పకూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలను కల్పించకపోగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని లక్షలాది మంది శాశ్వత ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో తొలగించారని తెలిపారు. నిరుద్యోగులే బీజేపీని ఓడించి, మోదీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అంబటి నాగయ్య, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కన్నెగంటి రవి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు, నాయకులు వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, పల్కల ఈశ్వర్రెడ్డి, సదానందం తదితరులున్నారు. -
‘బీజేపీ కూటమిని ఓడించండి’
జ్యోతినగర్(రామగుండం): ‘బీజేపీ కూటమిని ఓ డించండి–ఇండియా కూటమిని గెలిపించండి’ అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు చిలుక శంకర్ కోరారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో ఏ ర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతోన్మాద ఫాసిస్టు పాలనను అంతమొందించాలని అన్నారు. పదేళ్లలో పేదవారికి సాయం చేస్తానని చెప్పిన నరేంద్రమోదీ అత్యంత ధనబలం ఉన్న అంబానీ, అదానీల కార్పొరేట్ సంస్థలకు యావత్ దేశం సంపదను అప్పజెప్పారని ఆరోపించారు. నాయకులు బుచ్చన్న, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్
మంథని: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి తీరు ఎంతకీమారడం లేదు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకారనే అపవాదు కొంతకాలంగా ఎదుర్కొంటున్నారు. వంతుల వారీగా కూడా విధులకు వస్తారనే విమర్శలూ ఉన్నాయి. కానీ అసలు ఆస్పత్రికి సంబంధ లేనిప్రైవేటు వైద్యుడు కొంతకాలంగా దర్జాగా విధులు నిర్వర్తిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ‘సాక్షి’కి అందించిన సమాచారం మేరకు.. శనివారం రాత్రి ఆస్పత్రిని విజిట్ చేయగా ఆస్పత్రిలో షారూఖ్ అనే వైద్యుడు విధుల్లో కనిపించారు. ఆయన గురించి ఆరా తీయగా.. తాను కాంట్రాక్ట్ డాక్టరునని సమాధానం చెప్పారు. డ్యూటీ డాక్టర్ పేరు మరొకరిది ఉందని ప్రశ్నించగా.. వైద్యురాలికి అనారోగ్యం చేయడంతో తాను డ్యూటీకి వచ్చానని చెప్పుకొ చ్చారు. అసలు విషయం తెలుసుకోగా.. సదరు వ్యక్తికి ప్రభుత్వ ఆస్పత్రితో అసలు సంబంధమే లేదని, కాంట్రాక్ట్, రెగ్యులర్ వైద్యుడు కాదని తేలింది. ఆస్పత్రిలో ఐదుగురు కాంట్రాక్ట్, ఆరుగురు రెగ్యులర్ వైద్యులు పనిచేస్తున్నారు. అయితే, ఒకరిద్దరూ మినహా అందరి విధులను ఈ ప్రైవేటు డాక్టరు చేస్తున్నట్లు తెలిసింది. చాలా కాలంగా జరుగుతున్న ఈ తతంగమంతా స్థానిక సిబ్బందితో పాటు జిల్లా ఉన్నతాధికారుల నోటీసులో ఉందని సమాచారం. ఇటీవల ఆస్పత్రిలో పేషెంట్లతో సదరు వ్యక్తి ఘర్షణ పడినట్లు తెలియవచ్చింది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా తన దృష్టికి రాలేదన్నారు. డ్యూటీ డాక్టర్కు నోటీస్ జారీ చేస్తానని చెప్పారు. అంతేగాకుండా మరో వైద్యుడిని వెంటనే విధుల్లోకి తీసుకుంటామని వివరించారు. ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఆ వ్యక్తి అసలు డాక్టరేనా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సర్కారు వైద్యులకు బదులు సేవలు -
అదృష్టంగా భావిస్తున్న
నర్సింగ్ ఆఫీసర్గా సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్న. మాది జమ్మికుంట మండలం పోతిరెడ్డిపల్లి. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేశా. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో నెలరోజులు, హనుమకొండలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పదేళ్లపాటు పనిచేశా. 2018లో ప్రభుత్వ స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు ఎంపికై తే 2021లో పోస్టింగ్ ఇచ్చారు. తొలుత ఆదిలాబాద్ రిమ్స్లో ఆర్నెల్లు పనిచేశా. రెండున్నరేళ్లుగా జీజీహెచ్లో వైద్యసేవలు అందిస్తున్న. – కిరణ్, నర్సింగ్ ఆఫీసర్, జీజీహెచ్ -
లైఫ్ డో‘నర్స్’
● పేషెంట్ల సేవలో నిమగ్నం ● ప్రాణాలు కాపాడడంలో కీలకం ● ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ సేవలు ఆదర్శం ● నేడు ప్రపంచ నర్సింగ్ ఆఫీసర్స్ దినోత్సవం కోల్సిటీ(రామగుండం): కనిపించే దేవుళ్లు డాక్టర్లు.. కాపాడే దేవతలు నర్సింగ్ సిబ్బంది.. తెల్లని దుస్తులు ధరించి, తల పై టోపీ పెట్టుకుని, చిరున వ్వుతో ఆప్యాయంగా పలుకరి ంచే నర్స్లు.. అమ్మను, అక్కాచెల్లెళ్లు, సోదరభావంతో సేవ లు అందిస్తారు.. సిస్టర్, బ్రదర్ అని పిలవగానే అవసరమైన మందులు, ఇంజక్షన్లు వేస్తూ వైద్యచికిత్సలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు అందిస్తున్న సేవలతో పేషెంట్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో కాపాడే దేవతలుగా పిలుస్తుంటారు. ఆదివారం ప్రపంచ నర్సింగ్ ఆఫీసర్స్ దినోత్సవం సందర్భంగా కథనం.. ఇదీ నర్సింగ్ డే నేపథ్యం.. ● యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన ప్రమా దాల్లో గాయడిన వారిని ప్రేమతో ఆదరించి, ఆప్యాయంగా పలుకరించి.. మానసిక ధైర్యం చెప్పి, ప్రాథమిక వైద్య చికిత్స అందించారు నిస్వార్థ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్. ● ఆమె సేవాకృషి ఫలితమే ‘ప్రపంచ నర్స్ల దినోత్సవం’గా ఏర్పడింది. ● నైటింగేల్ 1820 మే 12న ఇటలీలోని ఫ్లోరెన్స్ నరగంలో జన్మించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్స్ వృత్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ● అందుకే ఏటా మే 12న ఆమె జయంతిని ‘ప్రపంచ నర్స్ల దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీ. ● వైద్యుల కన్నా నర్సింగ్ సిబ్బంది పేషెంట్లకు వై ద్య సేవలు అందించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ● అంతేకాదు.. మానసిక ప్రశాంతతో విధులు నిర్వర్తించాలనే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆశయానికి అనుగుణంగా సేవలు అందిస్తున్నారు. ● పేషెంట్లతో నర్సింగ్ సిబ్బందికి పేగు బంధం ఉండదు. ● పేషెంట్ తాలూకు సమాచారం తెలియదు.. ● దొంగలు, శత్రువులు, మిత్రులు, విదేశీయులు, అసాంఘిక శక్తులనే తేడా చూపించరు. ● కేవలం వారు అందించేది వైద్య సేవలు అనేది మాత్రమే చూస్తారు. నర్సింగ్ కోర్సులపై పెరుగుతున్న ఆసక్తి.. ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటున్నాయి. అందుకే న ర్సింగ్ కోర్సులకు ఆదరణతోపాటు డిమాండ్ ఎక్కువైంది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎ మ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కో ర్సులు అందించేందుకు ఇన్స్టిట్యూట్లు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీగా ప్రారంభిస్తున్నారు. -
No Headline
సంతృప్తిగా ఉంది మా నాన్న రాఘవులు టీచర్ నన్ను మెడికల్ డిపార్ట్మెంట్లో చేర్పించాలనేది ఆయన ఆశయం. అందుకే టెన్త్ పూర్తయ్యాక నాకు తెలియకుండానే నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేశారు. సీటు వచ్చాకే నాకు చెప్పారు. కోర్సు పూర్తిచేశాక తొలిపోస్టింగ్ కరీంనగర్ సివిల్ ఆస్పత్రి. 38ఏళ్లుగా పేషెంట్లకు సేవలు అందిస్తున్న. చాలా సంతృప్తిగా ఉంది. ప్రస్తుతం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2 హోదాలో సేవలు అందిస్తున్న. – విజయ, నర్సింగ్ సూపరింటెండెంట్, గోదావరిఖని -
మా తాతే స్ఫూర్తి
మాది గోదావరిఖనిలోని మార్కండేయకాలనీ. మా తాత కృపానందం, మేనత్త విజయకుమారి స్ఫూర్తితోనే మెడికల్ డిపార్ట్మెంట్ ఎంచుకున్నా. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి, ఐదున్నరేళ్లపాటు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్స్టాఫ్గా పనిచేశా. ఈఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు నర్సింగ్ ఆఫీసర్గా రెగ్యులర్ ఉద్యోగం వచ్చింది. నేను పని చేసిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే పోస్టింగ్ ఇచ్చారు. – జాయ్మెర్సీ, నర్సింగ్ ఆఫీసర్, జీజీహెచ్ -
యువకుడి మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్
ఎల్లారెడ్డిపేట: మండలంలోని సింగారం గ్రామ శివారులోని మానేరు వాగు చెక్ డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడి మృతికి కారణమైన ఇద్దరిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీ ఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సింగారం గ్రామానికి చెందిన ముత్యాల బాలకృష్ణ, గుమ్మడి శంకర్, పూ టకుల్ల సుధీర్ కలిసి గురువారం చేపలు పట్టేందుకు మానేరు వాగు చెక్ డ్యాంకు వెళ్లారు. బాలకృష్ణను చెక్డ్యాంలోకి దించి విద్యుత్ షాకుతో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. బాలకృష్ణ చేపలు పడుతుండగా విద్యుత్ షాక్ గురై మృతిచెందాడు. మృతుడి భార్య కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చే పట్టి శంకర్, సుధీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ చెప్పారు. సిరిసిల్ల కోర్టు న్యాయమూర్తి ఇద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ విధించి కరీంనగర్ జైలుకు తరలించిటనట్లు పేర్కొన్నారు. -
మిగిలింది ప్రలోభాస్త్రమే..!
సాక్షి, పెద్దపల్లి: పోలింగ్కు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాల ఎ రవేస్తున్నారు. ఎన్నికల క్రతువులో కీలకంగా భావించే మరికొన్ని గంటల్లో ఫలితాలను తారుమారు చే సేందుకు అభ్యర్థులు తెరవెనుకు రాయబేరాలు సా గిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసేకునేందుకు ఎ త్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ‘డబ్బు, మద్యం ఏదైనా సరే రెడీ.. సింగిల్గానైనా.. ఫ్యామిలీ ప్యాకేజీగానైనా ఓకే.. కానీ ఓటు తప్పకుండా మాకే‘.. అనేలా అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కుల, యువజన సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లశాతాన్ని బట్టి ‘ఇంత మొత్తం’ అంటూ ధర నిర్ణయించారనే ప్రచారం వినిపిస్తోంది. గెలిస్తే తమ పార్టీ మేనిఫెస్టోతోపాటు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇస్తున్నారు. కొంత నగదు ఇచ్చి, విందు ఏర్పాటు చేసుకోవాలని ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రచార పర్వంలో ఖర్చు తడిసి మోపైడెనా.. పోలింగ్కు ముందు కీలకమైన ఈసమయంలో వెచ్చించే డబ్బులే ఫలితాన్ని నిర్ణయిస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. 62 రోజులుగా ప్రచారం ● లోక్సభ ఎన్నికల షెడ్యూల్ గత మార్చి 16న విడుదలైంది. ● అంతకు ముందు నుంచే ఆశావాహలతో ఎంపీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ● ఎన్నికల కోడ్ నుంచి రాజకీయ పార్టీల ప్రచారం వేడెక్కూతూ వచ్చింది. ● ఏప్రిల్ 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ వరకు ప్రచారం జోరందుకుంది. ● ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ● వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల ఊపు కొనసాగిస్తూ, పట్టు కోల్పోకుండా మంత్రి శ్రీధర్బాబు తోపాటు, ఎమ్మెల్యేలు ఎండలను సైతం లెక్కచేయకుండా తమ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ● బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించగా, బీజేపీ తరఫున మంద కృష్ణమాదిగతోపాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు సుమారు 62రోజుల పాటు ప్రచారంలో మునిగి తేలారు. ఓటరుకు నేరుగా చేరేలా. తమ విజయానికి అభ్యర్థులు విచ్చలవిడిగా ధన, మద్య ప్రవాహానికి సిద్ధమవుతున్నారు. ప్రచారంలో చేసిన ఖర్చుకు అదనంగా ఓటుకు రూ.200 వెచ్చించేలా.. ఎంతలేదన్నా ఇప్పటివరకు ఖర్చు చేసిన దా నికి అదనంగా రూ.5కోట్ల – రూ.10 కోట్ల వరకు పంచేందుకు రంగం సిద్ధం చేసు కుంటున్నారనే ప్ర చారం జరుగుతోంది. పార్లమెంట్ విస్తీర్ణం, ఓటర్లు అధికంగా ఉండటంతో అందరికీ ఇవ్వడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. తమకు అనూకూలం లేనిప్రాంతాలను గుర్తిస్తూ, వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. బలహీనంగా ఉన్నచోట్ల నోటుకు అదనంగా మద్యం పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ముగిసిన ప్రచారం.. చెమటోడ్చిన నేతలు బలహీనమైనచోట ఓటర్లకు మద్యం, మనీ.. కుల, యువజన సంఘాల ప్రసన్నం కోసం చివరి యత్నాలు రణగొణ మై క్ల మోత లు మూగబోయాయి.. ప్రచా ర రథాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.. బహిరంగ సభలు, రోడ్డు షోలు, పాదయాత్రలతో తీరిక లేకుండా ప్రసంగించిన రాజకీయ పార్టీల ప్రముఖులు, అభ్యర్థులు ప్రత్యక్ష ప్రచారాన్ని ఆపేశారు.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచీ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ వచ్చిన కొందరు అభ్యర్థులు.. ఇక ప్రలోభాల పర్వానికి తెరతీస్తున్నారు.. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. -
పేదవారే నాకు కొండంత అండ
మంథని: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రాజీలేకుండా ముందుకు సాగుతున్నామని పేదవా రే తనకు కొండంత అండ అని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తా లో శనివారం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి అనేకమంది కాంగ్రెస్లోకి వస్తున్నారని తెలిపారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తామని అన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనతో ప్రజలకు స్వేచ్ఛ సొంతమైందన్నారు. తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ చై ర్పర్సన్ పెండ్రి రమ, వైస్ చైర్మన్ బానయ్య, నాయకులు ప్రసాద్, శ్రీనివాస్, శశిభూషణ్ కాచె ఉన్నారు.మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్బాబు, వంశీకృష్ణ -
సింగరేణి కార్మికుల కష్టాలు చూశా
● బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: సింగరేణిలో 26ఏళ్లపాటు కార్మికుడిగా పనిచేసి, వారి కష్టాలు కళ్లారా చూసిన తనను ఎంపీగా గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్ అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక నాయకుడిగా, ఉద్యమ నేతగా అనేక పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్లివచ్చానని ఆయన అన్నారు. కారుణ్య నియామకాల ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కారుగుర్తుకు ఓటు వేసి తననను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ బైక్ ర్యాలీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలో బైక్ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. పలువురు నాయకులు పాల్గొన్నారు. అబద్ధాల హామీలతో మోసపోవద్దు రామగిరి(మంథని): అధికారం కోసం కాంగ్రెస్ ఇస్తున్న అబద్ధాల హామీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కోరారు. కల్వచర్ల గ్రామంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ఉపాధిహామీ కూలీలను కోరారు. నాయకులు శంకేశీ రవీందర్, పూదరి సత్యనారాయణగౌడ్, జాపతి శేఖర్, మ్యాదరబొయిన కుమార్ యాదవ్, కాపురబొయిన భాస్కర్, సైండ్ల సత్యనారాయణ, రేండ్ల కుమార్స్వామి, బొంకూరి పోచం తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 13న జరిగే లోక్సభ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. పార్లమెంట్ పరిధిలో 15,96,430 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 1,462మంది సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. 1,557మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారని ఆయన వివరించారు. 221 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలో 221 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. 497 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాల్లో సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ సమయాలు.. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటుహక్కు వినియోగించుకోవాలని ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో ఐదు మహిళలకు, దివ్యాంగులు, యువజనుల కోసం ఒక్కోటి కేటాయించామని కలెక్టర్ వివరించారు. గుర్తింపు కార్డుతో.. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు 12రకాల ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదోఒకటి చూపి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఇందులో ఈజీఎస్ జాబ్కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాపుస్తకాలు, కార్మికశాఖ జారీచేసిన బీమా స్మార్డ్కార్డు, ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు ఫొటోతో జారీచేసిన ఐడీకార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన ఐడీకార్డు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చని వివరించారు. మూడోదశ ర్యాండమైజేషన్ పూర్తి జిల్లాలో మూడోదశ ర్యాండమైజేషన్ను ఎన్నికల సాధారణ పరిశీలకుడు రావిశ్గుప్తా, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్తో కలిసి పూర్తి చేసి నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలిపారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 840 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్డీవోలు హనుమానాయక్, గంగయ్య, డీఈవో మాధవి, ఏవో శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత, అజీం పాల్గొన్నారు. 497 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ 131సెంటర్లలో సీసీ కెమెరాలు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ -
సింగరేణిని ముంచిన బీజేపీ, బీఆర్ఎస్
గోదావరిఖని: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి సింగరేణి సంస్థను నిండా ముంచాయని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ విమర్శించారు. జీడీకే–2వ, గనిపై శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ అ ధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి వారు మాట్లాడారు. బీజేపీని ఓడించాలని కోరారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీ–1 జీఎం కార్యాలయ సిబ్బందిని రాజ్ఠాకూర్ కలిసి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కాగా,ఆటోబతుకులు సీరియల్ ఐదో ఎపిసోడ్ సీడీని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, అధికార ప్రతినిధి దార మధు, జిల్లా కన్వీనర్ కాసిపేట రాజయ్య, మున్సిపల్ కన్వీనర్ అంబాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులతో కాసేపు.. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, వంశీకృష్ణ ఆర్జీ–1 ఏరియా వర్క్షాప్లో కార్మికులను కలిసి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాసేపు రిపేర్ పనులు చేశారు. బైక్ ర్యాలీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నగరంలోని ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● మావోయిస్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ● రామగుండం సీపీ శ్రీనివాస్ గోదావరిఖని: పార్లమెంట్ ఎన్నికలకు పోలీసు శా ఖ సర్వంసన్నద్ధంగా ఉందని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు కంపెనీల ప్రత్యే క బలగాలతో పాటు 3,220మంది సిబ్బంది సేవ లను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నామన్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, స్థానిక పో లీసులతోపాటు 1,407 మంది కమిషనరేట్ పోలీసు లు, అధికారులు, 883మంది ఛత్తీస్గఢ్కు చెందిన హోంగార్డులు, మహిళా సిబ్బంది, 290మంది ట్రై నింగ్ కానిస్టేబుళ్లు, ట్రైనింగ్ సిబ్బంది, 98మంది సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, 159మంది టీఎస్ఎస్పీ సిబ్బంది బందోబస్తులో పాలుపంచుకుంటా రని వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతా ల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించేలా పోలీసు క ళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించామని చెప్పారు. అధికారులు రాజు, రాఘవేంద్రరావు, ప్రతాప్, సురేంద్ర పాల్గొన్నారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు పెద్దపల్లిరూరల్: పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల త రలింపు, ఎన్నికలు ముగిశాక స్ట్రాంగ్రూమ్లకు వా టిని చేరవేసేదాకా పోలీసు అప్రమత్తంగా ఉండాల ని సీపీ శ్రీనివాస్ ఆదేశించారు. డీసీపీ చేతనతో కలిసి రంగంపల్లిలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద లోపాలు తలెత్తితే రూట్మొబైల్ సి బ్బంది పరిష్కారం చూపుతారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చే యాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏసీపీ కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు ఉన్నారు. -
కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
రామగిరి(మంథని): సెంటనరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ శనివారం పరిశీలించారు. పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని నియోజకవ ర్గాల స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశా రు. అలాగే మంథని నియోజకవర్గం డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు రాంచందర్రావు, రామ్మోహన్ పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యత అవసరం రామగుండం: ఆర్థిక అక్షరాస్యతపై మహిళలకు అవగాహన ఉండాలని మహిళా సాధికారత జి ల్లా కో ఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో శనివారం స్పందన గ్రామైక్య సంఘం సభ్యులకు ‘ఆర్థిక అక్షరాస్యత – మహిళా చట్టాలు’ అంశంపై అవగాహన కల్పించారు. లింగ వివక్ష లేకుండా మ హిళా సాధికారిత సాధించడమే భేటీ బచావో – భేటీ పడావో ముఖ్య ఉద్దేశమన్నారు. పరిసరా ల పరిశుభ్రత, బాల్య వివాహాలను అరికట్టడం, పోక్సో చట్టం, సైబర్, గృహ హింస చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం, అంగన్వాడీ సేవలు, హెల్ప్ లైన్నంబర్లు, సఖి కేంద్రం, షీ టీం సేవలు తదితర అంశాలపై వివరించారు. పంచాయతీ కార్యదర్శి రమ్య, వీవో ఏ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈఏపీసెట్ రామగిరి(మంథని): సెంటనరీకాలనీ జేఎన్టీయూలో ఐదురోజులుగా కొనసాగుతున్న తె లంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీ సెట్) శనివారం ముగిసింది. మూ డు రోజులపాటు జరిగిన ఇంజినీరింగ్లో 540 మంది విద్యార్థులకు 483 మంది హాజరయ్యా రు. రెండు రోజులపాటు జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీలో 285 మందికి 275 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి తెలిపారు. వారసత్వ రాజకీయాలకు గుణపాఠం చెబుదాం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో గోమాస శ్రీనివాస్ కమలం పువ్వు గు ర్తుపై ఓటువేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ కోరా రు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర కోవాధికారి తాత రవి యాదవ్ నేతృత్వంలో కాల్వశ్రీరాంపూర్, మంగపేట, కూనారం, గంగారంలో శనివారం ఎ న్నికల ప్రచారం చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రదీప్కుమార్ మాట్లాడుతూ, ఇన్నాళ్లూ తండ్రి, కుమారులు వెంకటస్వామి, వివేక్ పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారని, ఇప్పు డు అదే కుటుంబంలోని వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అన్నార. ఇలాంటి వారసత్వ రాజకీయాలకు గుణపాఠం చెబుతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సంపత్, పర్వతాలు, ఈర్ల శ్రీనివాస్, బాలకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం మార్పు పెద్దపల్లిరూరల్: శాంతినగర్ పోలింగ్ సెంటర్(నంబరు 36)ను ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోకి మార్చినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గంగయ్య శనివారం తెలిపారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement