-
అరచేతిలో ఎన్నికల సమాచారం
పెద్దవూర : టెక్నాలజీ ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు ఓటరుకు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచేందుకు వివిధ రకాల మొబైల్ యాప్లను ప్రవేశపెట్టింది. ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి గురించి తెలుసుకోవాలన్నా.. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా ప్లే స్టోర్లో ప్రత్యేక యాప్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. సువిధ, సీ–విజిల్, కేవైసీ, అబ్జర్వర్, సాక్ష్యం, ఓటరు హెల్ప్ వంటి యాప్లతోపాటు నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు, ఎన్నికల నియమావళి, ఓటర్లకు అవసరమైన సాయం, ఎన్నికల ఖర్చు, పోలింగ్ బూత్ల వివరాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సమాచారం తెలుసుకునేందుకు ఈ యాప్లను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని యాప్లు ప్లే స్టోర్లో లభ్యమవుతున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు, అభ్యర్థులకు ఉపయోగకరంగా సువిధ యాప్..ఈ యాప్లో అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని, వారి ఆధారాలతో లాగిన్ కావాలి. సువిధ యాప్ అభ్యర్థులకు అవసరమైన అనేక ఫీచర్లు అందిస్తోంది. ప్రచారానికి అవసరమైన అనుమతుల గురించి కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్ సరళి కోసం ‘ఓటర్ టర్న్ అవుట్’పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ఓటర్ టర్న్ అవుట్ యాప్ను సిద్ధం చేసింది. పోలింగ్ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేస్తారు. జిల్లా, నియోజకవర్గాల వారీగా వివరాలు తెలుసుకోవచ్చు. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్(ఎన్జీఎస్పీ) ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎన్నికల కమిషన్కు సహాయపడడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఓటరు తన మొబైల్ నంబర్ను ఉపయోగించి పోర్టల్లో ప్రొఫైల్ నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికల అధికారి స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతారు. పోలింగ్ బూత్లో సమస్యలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో సమస్యలు, ఎన్నికల ఖర్చు, అక్రమాలు వంటి ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా పోస్ట్ట్ చేయవచ్చు. పౌరులు తమ ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఈ యాప్లో పరిశీలించవచ్చు. అబ్జర్వర్ఎన్నికల కోడ్ దుర్వినియోగం, అక్రమాలకు సంబంధించిన కేసులను తెలుసుకునేందుకు వీలుగా అబ్జర్వర్లకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించేందుకు ఎన్నికల పరిశీలకులు ముందుగా లాగిన్ క్రియేట్ చేసుకుని, వారి పాస్వర్డ్తో సమాచారం అందించాలి. అక్రమాలను అరికట్టేందుకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. తమ నియోజవర్గంలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఉన్న ప్రదేశం వంటి సమాచారం పొందవచ్చు. ఓటర్లు ఆయా యాప్లను ఉపయోగించుకుని ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు ప్రత్యేక మొబైల్ యాప్లు అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల కమిషన్ వేగంగా ఫిర్యాదుల పరిష్కారం‘సీ–విజిల్’తో అక్రమాలకు అడ్డుకట్ట ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా ఈ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఆడియో, వీడియో, ఫొటో ఏదో ఒక సాక్ష్యం యాప్లో పోస్ట్ చేస్తే అధికారులు స్పందించి తగు చర్యలు చేపడతారు. ఎవరు కోడ్ ఉల్లంఘించినా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం వంటి ఉల్లంఘనలను ఫొటో, వీడియో, ఆడియో క్లిప్గా యాప్లో అప్లోడ్ చేయాలి. యాప్ ఓపెన్ చేయగానే ఫొటో, వీడియో ఆప్షన్లు ఉంటాయి. సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరించి పోస్ట్ చేయాలి. అధికారులు తక్షణం స్పందించి అక్రమాలను అరికట్టేందుకు కృషి చేస్తారు. -
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
మోత్కూర్ : బైక్కు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ను రాయితో కొట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఆదివారం రాత్రి మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో జరిగింది. వివరాలు.. మోత్కూర్లోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి నల్లగొండ డిపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి నల్లగొండకు వెళుతోంది. ఈ క్రమంలో బస్సు మున్సిపల్ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్దకు రాగానే మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన వ్యక్తి బైక్పై వెళ్తూ బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున రోడ్డు ఇరుకుగా మారడం, వర్షం కురిసి వరద నీరు రోడ్డుపై పారుతుండడంతో సైడ్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కొంచెం ఆగమని బస్సు డ్రైవర్ సిగ్నల్ ఇచ్చాడు. అయినా బైక్పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ డ్రైవర్ను బూతులు తిట్టసాగాడు. అంబేద్కర్ చౌరస్తాలో బస్సుకు అడ్డంగా బైకు పెట్టి రాయి తీసుకుని బస్సు ఎక్కి డ్రైవర్ శివరాత్రి ధనుంజయను తలపై కొట్టాడు. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బస్సు డ్రైవర్కు స్థానిక ఆస్పత్రిలో వైద్యం చేయించారు. -
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
చౌటుప్పల్ : తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కు కాంగ్రెస్కే ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో మున్సిపాలిటీ, మండలానికి చెందిన బూత్ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పాలించే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ పదేపదే అంటున్న బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే స్థితికి చేరిందన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించి తీసుకువస్తానని సీఎం రేవంత్రెడ్డికి మాట ఇచ్చానని అన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కై లాష్నేత, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, బ్లాక్, మున్సిపల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహగౌడ్, బోయ దేవేందర్, నాయకులు పబ్బు రాజు, చెన్నగోని అంజయ్య, గుండు మల్లయ్య, చింతల వె ంకట్రెడ్డి, రాంచంద్రం, ఎండీ.హన్నుభాయ్, చిట్టంపల్లి శ్రీనివాస్, జంగయ్య, శ్రీనాథ్, శ్రీనివాస్, రమేష్, బాబాషరీఫ్, బాలకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం కట్టంగూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి రోడ్షోలో ఆయన మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, దైద రవీందర్, మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, పెద్ది యాదగిరి, కొండ లింగస్వామి, రెడ్డిపల్లి సాగర్, ధార భిక్షం, మాద లింగస్వామి, శేఖర్, వెంకటేశ్వర్లు, సైదులు, అంజయ్య, నారాయణ, వెంకన్న, అనిల్రెడ్డి, జానయ్య, నర్సింహ ఉన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
నాగార్జునసాగర్ : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి చేస్తామని మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నాగార్జునసాగర్లోని తమ నివాసంలో ప్రపంచంలోని ప్రవాస తెలంగాణీయులతో ఎన్నారైలు గడ్డంపల్లి రవీందర్రెడ్డి, నాగబోయిన శ్రీను, నెమలి మాధవరెడ్డిలు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. ప్రవాసీయుల సహకారంతో నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్గా తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రవాసీ తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి కెటాయించేందుకు ప్రయత్నిస్తామని, గ్రామాల్లో కార్పొరేట్ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గల్ఫ్ కార్మికుల రక్షణకు నూతన చట్టాలను తేవడంతో పాటు నదీజలాల విషయంలో విభజన హామీలను అమలు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ మీటింగ్లో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. రఘువీర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలితిరుమలగిరి(నాగార్జునసాగర్) : పార్లమెంట్ ఎన్నికల్లో కుందూరు రఘువీర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి తన కీర్తి ప్రతిష్టలను పెంచాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని అల్వాల ఎక్స్రోడ్ నుంచి మండల కేంద్రం వరకు చేపట్టిన రోడ్షోలో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డితో కలిసి జానారెడ్డి పాల్గొని మాట్లాడారు. తిరుమలగిరి మండలంలోని సాగుకు నోచుకోని 24వేల ఎకరాలకు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో సాగు నీరందిస్తానన్నారు. నాలుగు విడతల్లో నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని, మొదటి విడతను రానున్న సంవత్సరంలో 24వేల ఎకరాలకు సాగునీరందిస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జయవీర్రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలల కాలంలోనే తిరుమలగిరి మండలానికి రూ.300కోట్లు నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్ మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపిస్తే నాగార్జునసాగర్ యువత కోసం రెండు పరిశ్రమలను నియోజకవర్గానికి తీసుకువచ్చే బాధ్యత తమదేనన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నాయక్, ఎంపీపీ భగవాన్నాయక్, జెడ్పీ మాజీ వైస్చైర్మన్ లింగారెడ్డి, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, కృష్ణానాయక్, సాగర్రెడ్డి, చంద్రశేఖర్, చవ్వ బ్రహ్మానందరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నారైల జూమ్ మీటింగ్లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే జయవీర్రెడ్డి -
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
నల్లగొండ : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల కమిషనింగ్ను కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని నాగార్జున కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూంలో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె కమిషనింగ్ చేస్తున్న సందర్భంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాలను సెక్టోరల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రవి, సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement