-
మతోన్మాదుల పంచన చేరిన మంద కృష్ణ
పాలకుర్తి/పాలకుర్తి టౌన్: రాష్ట్రంలో 80 లక్షల మంది దళితులను మోసగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మతోన్మాదుల పంచన చేరాడని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ అన్నారు. శనివారం పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం ఇన్చార్జ్ మేడ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిఽధి నీరటి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవం కోసం డాక్టర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. దళితులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అఽధికారం చేపట్టిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, మాజీ సర్పంచ్లు భూమ రంగయ్య, పోగు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గడ్డం యాకసోమయ్య, ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మేడ మహేందర్, నాయకులు మేడ మహేందర్, గాదెపాక శ్రీధర్, ఎల్లయ్య, యాకయ్య, ఎల్లయ్య , రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం తెలిపారు. 13న జరగనున్న పోలింగ్లో ప్రతీఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా నుంచి 750 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో రూ. 87,09,840 నగదు, రూ.91,18,107 విలువ చేసే మద్యం, రూ.11,04,150 విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సీ విజిల్ యాప్, డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఆదివారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2024
మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ గార్ల/బయ్యారం: లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయిస్తానని మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ హామీ ఇచ్చారు. శనివారం గార్ల నెహ్రూసెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, గుండా వెంకట్రెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే బయ్యారంలో రోడ్ షో, బైక్ ర్యాలీ నిర్వహించారు. న్యూస్రీల్ -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వీఆర్ఎన్ గార్డెన్ వరకు పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారా మిలిటరీ బలగాలతో కలిసి పట్టణంలోని నెహ్రూసెంటర్, అండర్ బ్రిడ్జి, స్టేషన్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్, బస్టాండ్ మీదుగా నర్సంపేట బైపాస్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ సాగింది. అనంతరం మరిపెడ బంగ్లా రాజీవ్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు జిల్లా కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారం పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారన్నారు. అక్రమ మద్యం, నగదు రవాణాకు సంబంధించి ఎవరికై నా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ట్రైనీ ఐపీఎస్ పండరి చేతన్, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, తొర్రూరు డీఎస్పీ సురేష్, సీసీఎస్ డీఎస్పీ మోహన్, ఎస్బీ సీఐ బాలాజీవరప్రసాద్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. మరిపెడలో.. మరిపెడ: మరిపెడ మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ సూచించిన మేరకు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహిస్తారన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ముగిసిన ‘ఎప్సెట్’
విద్యారణ్యపురి: ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ పరీక్ష శనివారం ముగిసింది. వరంగల్ జోన్లోని 10 కేంద్రాల్లో చివరి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈపరీక్షకు 2,040 మంది అభ్యర్థులకుగాను 1,993 మంది (97.7 శాతం) హాజరయ్యారు. 47 మంది గైర్హాజరైనట్లు ఎప్సెట్ కన్వీనర్ బి.డిన్కుమార్ తెలిపారు. నర్సంపేట ప్రాంతంలో రెండు పరీక్ష కేంద్రాల్లో 403 మందికిగాను 389 మంది (96.5శాతం) అభ్యర్థులు హాజరవ్వగా.. వారిలో 14 మంది అభ్యర్ధులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈనెల 9నుంచి ప్రారంభమైన ఎప్సెట్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. మొత్తం ఐదు సెషన్లలో పరీక్షలు జరిగాయి. -
వైన్స్, బార్లు మూసివేత
మహబూబాబాద్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎకై ్సజ్ శాఖ అధికారులు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్స్లు, బార్లను శనివారం సీజ్ చేశారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాలు, 9 బార్ అండ్ రెస్టారెంట్లలో సోమవారం సాయంత్రం వరకు మద్యం క్రయవిక్రయాలు బంద్ ఉంటాయన్నారు. మద్యం లైసెన్స్దారులు బెల్ట్షాపులకు గానీ, చిల్లర వర్తక దుకాణాలకు గానీ ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి అక్రమంగా మద్యం సరఫరా చేసినా, ఇతర చోట్ల నిల్వ చేసిన చట్టరీత్య వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైన మద్యం పంపకాలు, అమ్మకాలు జరిగితే డీపీఈఓ 87126 58998, జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి 87126 59026, మానుకోట ఎకై ్సజ్ సీఐ 87126 59014, తొర్రూర్ ఎకై ్సజ్ సీఐ 87126 59015, గూడూరు ఎకై ్సజ్ సీఐ 87126 59013, కంట్రోల్ రూం నంబర్ 8719 298533 నంబర్లకు సమాచారం తెలియజేయాలన్నారు. రెండు రోజులు మద్యం క్రయవిక్రయాలు బంద్ -
బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదు
సాక్షి, మహబూబాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా కేసీఆర్ ఎంత అరచినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా శివారులోని అనంతారంలో శనివారంఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. ఆయన మాటలు ఎవరూ నమ్మరు.. చేసిన తప్పులు, అవినీతి పాలనను కప్పిపుచ్చుకునేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 35 సీట్లు ఉన్న బీఆర్ఎస్, ఏడు సీట్లు ఉన్న బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పడం శోచనీయమన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. దక్షిణ భారతాన్ని విస్మరించి పాలించిన ఘనత బీజేపీ అన్నారు. విభజన చట్టం హామీలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, దానిని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేశామని, రైతుల రుణమాఫీ ఆగస్టు 15 లోపు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట 10 కేజీల తగ్గించి రైతులను నిలువు దోపిడీ చేశారని గుర్తుచేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన హోదాను మరిచి అసత్యాలతో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రామచంద్రునాయక్, కోరం కనకయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ సాధు రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
రహదారులు రక్తసిక్తం..
ఖిలా వరంగల్ : మాయదారి మృత్యువు.. మా టు వేసి కాటువేసింది. చెల్లి పరీక్ష కోసం ఆమెతో కలిసి వెళ్తున్న అక్క ను టిప్పర్ రూపంలో అమాంతం మింగింది. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటనతో వరంగల్ లక్ష్మీపురంలో విషాదం నెలకొంది. స్థానికుల కథ నం ప్రకారం.. వరంగల్ 39వ డివిజన్ లక్ష్మీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ నాగపూరి కాళీ దాస్, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు తన్మయి, సాయి హర్షిత ఉన్నారు. పెద్ద కు మార్తె తన్మయి (21) వాగ్దేవి ఇంజనీరింగ్ కళా శాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చిన్న కుమార్తె సాయి హర్షిత ఇంటర్ పూర్తి చే సింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని శ్రీనిధి కళాశాలలో శనివారం ఉదయం 9గంటలకు జరిగే ఎంసెట్ పరీక్ష రాసేందుకు ఉదయమే కారులో తల్లి సంధ్య, సాయి హర్షిత, తన్మయి బయలుదేరారు. మార్గమధ్యలో వరంగల్– హైదరాబాద్ రహదారిపై ఆలేరు సమీపంలో కారు.. టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో తన్మయి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తల్లి, చెల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డా రు. మృతదేహన్ని ఎంజీఎం తరలించి సా యంత్రం పోస్టుమార్టం నిర్వహించి తన్మయి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్వగృహం లక్ష్మీపురం తరలించారు. కాగా, చే తికి అందొచ్చిన బిడ్డ కళ్లెదుటే కనిపించని లో కాలకు వెళ్లిందని తల్లిదండ్రులు గుండెలవిసే లా రోదించారు. తమ ఆశాదీపం ఆరిపోయిదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్షెల్టర్లోకి దూసుకెళ్లిన ఇసుక లారీ.. ఇద్దరి దుర్మరణం భూపాలపల్లి అర్బన్ : భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూర్నగర్ ఏరియా ఆసుపత్రి సమీ పంలోని బస్షెల్టర్లోకి శనివారం ఓ ఇసుక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కాళేశ్వరం గోదావరి నుంచి హనుమకొండ వైపున కు ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ (టీఎస్ 25టీ1314) అతి వేగంగా వచ్చి అదుపు తప్పి ఏరి యా ఆసుపత్రి ఎదుట ఉన్న బస్షెల్టర్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్లో ని విజయనగరం జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు(24), మహబూబ్నగర్ జిల్లా నిజాంపూర్ గ్రామానికి చెందిన వాకిటి సత్యనారాయణ(30) అక్కడికక్కడి దుర్మరణం చెందారు. విజయనగరం జిల్లాకు చెందిన అప్పల నాయుడు, మంజూ ర్నగర్కు చెందిన మధుకర్రెడ్డి, కాల్వపల్లికి చెందిన చంద్రశేఖర్, బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరు ఓపెన్కాస్టులో ఎస్ వీఈసీ కంపెనీలో డ్రైవర్, ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. మృతులిద్దరు.. ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమతో పని చేసే కోట మురళి, అప్పలనా యుడిని ఆంధ్రప్రదేశ్కు పంపించే క్రమంలో బస్సు ఎక్కించేందుకు బైక్లపై తీసుకువచ్చా రు. వారిని బస్షెల్టర్లో దింపి బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో లారీ.. మృతువు రూపంలో ఇద్దరిని బలికొంది. అనంతరం క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో భద్రపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ తెలిపారు. నీరుకుళ్లలో ఒకరు.. ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఆత్మకూ రు మండలం నీరుకుళ్ల శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ములుగు జిల్లా శ్రీనగర్ గ్రామానికి చెందిన నాగు సుధాకర్ (45)తన బైక్పై దామెర మండలం పసరగొండకు వెళాడు. తిరుగు ప్రయాణంలో నీరుకుళ్ల వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. రహదారులు రక్తసిక్తమయ్యాయి. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన ప్రమాదంలో వరంగల్ నగరానికి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. -
రాజకీయాలు.. ప్రజాకీయాలు కావాలి
హన్మకొండ కల్చరల్ : దేశ భవిష్యత్ను మార్చే శక్తి ప్రజాస్వామ్యనికి ఉందని, అది ఓటు ద్వారానే సాధ్యమని విశ్వసించిన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు. ప్రజాస్వామ్యంలో పౌరుడి బాధ్యతలు, ఓటుహక్కును కాళోజీ చెప్పినంత గొప్పగా ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనూ ఏ ప్రజాస్వామిక రాజకీయ సిద్ధాంత కర్తలు, తత్వవేత్తలు చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలు ప్రజాకీయాలు కావాలని అనేవారు. ఎన్నికల సందర్భంగా కాళోజీ కవితలు.. 1967 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను హెచ్చరిస్తూ కాళోజీ రాసిన ‘డూ ఆర్ డై’ గేయంలోని కొంతభాగం.. ఓటర్లూ! ‘ఏమైనా చేయండి! లేకుంటే చావండి’ఎన్నికల్లో మీ ఓటును సక్రమంగా వాడండి..గుత్తాధికారమంత చేజిక్కిన ముఠాబలం..గద్దెజారితే గాని ప్రజాస్వామ్యం బతకదు.’ 1966 మే 14న రాసిన ఎన్నికల సంరంభం కవితలో కొంతభాగం.. ‘ఓటర్లు కునుకు తీస్తు కూచుంటే నేతగాడు ముడుపులన్నీ కాజేయును. నైవేద్యం చాలకున్నా.. గుడి లింగము మేస్తాడు. ఓటరయ్యా’ నీకు కూడా నేతాగిరి ‘లూటి’లోన వాటావుంటే దొంగకె ఓటేస్తవు. ‘నాగొడవ’ను లెక్కింపవునే నెరగుదు. నేతాగిరి లూటీలో వాటా వజ్జెలేని ఓటర్లకే ప్రజాస్వామ్య పరాభవం సహియింపని ఓటర్లకే పెత్తన్దారీ బలగం నెదిరిపోరు ఓటర్లకే.. పౌరుడిగా ఓటుచేయు ధైర్యమున్న ఓటర్లకే ‘నా గొడవ’. ప్రజాస్వామ్య మనుగడకే నాగొడవ. పరాభవంతో పాటు ప్రజాస్వామ్య పరాభావం తొలగిపోవ సక్రమముగా ఎన్నికలు జరుగుటకే ‘నాగొడవ?’ ఓటర్లను హెచ్చరిస్తూ ప్రజాకవి కాళోజీ రచనలు -
ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నా
ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నా. అప్పట్లో అభ్యర్థులు విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వారు. ప్రలోభాల ప్రభావం ఉండేది కాదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగేది. ఘర్షణలు, దాడులు, దొంగ ఓట్లకు తావుండేది కాదు. బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపొందిన అనంతరం హామీలను నెరవేర్చడానికి ఆసక్తి చూపే వారు. సమర్థుడైన నేత ఎన్నిక కోసం క్యూలైన్లో నిలబడి ఓటు వేస్తున్నాం. – ఇనుగాల జోగిరెడ్డి, తిమ్మాపురం ఎన్నికలు వస్తే పండుగలా ఉండేదిమా చిన్నప్పుడు ఎడ్లబండి మీద వెళ్లి ఓటు వేసే వాళ్లం. ఎన్నికలు వస్తే పదిహేను రోజులు పండుగలా అనిపించేది. నాడు జెండాలు పట్టి ప్రచారం చేస్తూంటే వీధులన్నీ కోలాహాలంగా ఉండేది. పోలింగ్కు ఒక రోజు ముందు వరకు ఎవరి పార్టీ అభ్యర్థులకు వారు మద్దతుగా ప్రచారం నిర్వహించే వాళ్లం. నేను 18 ఏళ్లకు ఓటు హక్కును వినియోగించుకున్నా. పోలింగ్ నాడు మాత్రం అందరం కలిసి దొంగ ఓట్లకు తావులేకుండా సజావుగా ఓటింగ్ ప్రక్రియ ముగించే వాళ్లం. – కత్తి విజయ, తిమ్మాపురం -
‘వరంగల్’ పరిధిలో ఫిర్యాదులు ఇలా..
సాక్షి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ పరిధిలో 1950 టోల్ ఫ్రీ నంబర్కు 289 ఫిర్యాదులు రాగా, ‘సి’ విజిల్ ద్వారా 77, సోషల్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 2, రాతపూర్వకంగా 2, ఎన్జీఎస్ పోర్టల్ ద్వారా 753 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో చాలా వరకు మా ఓటు ఎక్కడా..? ఏ పోలింగ్ కేంద్రంలో ఉందంటూ చెప్పాలని వచ్చాయి. సువిధ యాప్ను ఎలా నిక్షిప్తం చేసుకోవాలంటూ వచ్చాయి. ఇంకొన్ని ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ఇలా మొత్తం వివిధ రూపాల్లో వచ్చిన 1,153 ఫిర్యాదుల్లో 1,137 పరిష్కరించారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేస్తూ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (ఎఫ్ఎస్టీ), 11 వీడియో సర్వేలెన్స్ టీమ్ (వీఎస్టీ)ల ద్వారా నిత్యం నిఘా ఉంచారు. ఇప్పటివరకు రూ.1,84,03,330 నగదు, రూ.11,13,976 విలువైన బంగారం, వెండి వస్తువులు, రూ.27,55, 180 క్వింటాళ్ల ఇతర సామగ్రి, రూ.6,05,03,526 విలువైన మద్యం, రూ.71,89,875 విలువైన 285 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన 462 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీటిలో పది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నమోదయ్యాయి. మిగతా 452 కేసులు మద్యం, గంజాయి, నగదు, తదితర ఘటనల కింద నమోదయ్యాయి. వడదెబ్బతో యువకుడి మృతి ఖానాపురం : వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వేపచెట్టు తండాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేపచెట్టుతండాకు చెందిన అజ్మీరా సురేష్(32) బతుకుదెరువు కోసం వరంగల్కు వెళ్లాడు. ఈ క్రమంలో శుక్రవారం పనికి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేపే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, సురేష్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
మాదిగ జాతి ప్రయోజనాలే ముఖ్యం
నయీంనగర్: మతం మారిన నకిలీ ఎస్సీలకు ఓటు వేసి మాదిగ బిడ్డలు ఆగం కావొద్దని, అసలైన లోకల్ మాదిగ బిడ్డ బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నా ఆరాటం, పోరాటం మాదిగ జాతి ఉన్నతి కోసమేనని, జాతి ప్రయోజనాల కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్నా’ అన్నారు. రాజకీయ లబ్ధి ముఖ్యం అనుకుంటే ఏనాడో కేంద్రమంత్రిని అయ్యేవాడినన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేసేది బీజేపీ అని గ్రహించాలన్నారు. కేసీఆర్కు వరంగల్ మాదిగ బిడ్డలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని, ఓట్లు చీల్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అయితే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. నీతి, నిజాయితీ, సమర్థ, సాహసవంతుడైన ప్రధాని మోదీ దేశానికి అవసరమన్నారు. దేశం భద్రంగా ఉండాలంటే మోదీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మందకుమార్ మాదిగ, వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేంద్ర మాదిగ, తదితరులు పాల్గొన్నారు. మతం మారిన నకిలీ ఎస్సీలకు ఓటు వేయకండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
బీఆర్ఎస్ను ఆదరించాలి
పాలకుర్తి/ పాలకుర్తి టౌన్ : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన సమగ్రాభివృద్ధిపై ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ గెలుపు కోసం శనివారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోతో పాలకుర్తి రాజీవ్ చౌరస్తా గులాబీమయమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్ర పునర్మిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించి పురోగతి సాఽధిస్తే.. అధికార దాహం కోసం కాంగ్రెస్ ఆచరణలో సాధ్యం కానీ మోసపూరిత వాగ్దానాలను చేసి అఽధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టిన పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతు రుణమాఫీపై కాలయాపన చేస్తూ ఎన్నికల అక్కెర తీర్చుకునేందుకు మోసపూరిత ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సాగు, తాగు నీరు ఢోకా లేకుండా వేసవిలో కూడా చెరువులు, కుంట మత్తళ్లు పోయించి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన విషయాన్ని రైతాంగం మరవొద్దన్నారు. చైతన్యవంతులైన పాలకుర్తి ప్రజలను చూస్తే తనకు దుఃఖం కలుగుతోందని, శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఏడవగానే జాలిపడి తాను చేసిన అభివృద్ధి మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైట్ మోడ్ పాలకులతో పాలకుర్తి అధోగతి పాలవుతోందన్నారు. కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టింది తానైతే తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ భిక్షతో ఎమ్మెల్యేగా ఎన్నికై న అరూరి రమేష్ పార్టీని వీడి నమ్మక ద్రోహం చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులను ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమనేత సుఽధీర్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. హామీలు అమలు చేయని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరు శ్రీనివాస్రావు, మాజీ ఎంపీపీ దల్జీత్కౌర్, యాకాంతారావు, గాంధీనాయక్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామిరెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు పసునూరి నవీన్, తీగల దయాకర్, సింధె రామోజీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాలకుర్తిలో రోడ్షో -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
టేకుమట్ల: అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జి ల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మాదారపు భాస్కర్రావు (44)కు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సాగు చేయగా సరైన దిగుబడి రాక సుమారు రూ.18 లక్షల అప్పులయ్యాయి. వ్యవసాయం చేస్తే అప్పులు తీరవని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అక్కడి వేతనం కుటుంబం గడవడానికే సరిపోతుంది. ఇటీవల తన స్వగ్రామమైన సుబ్బక్కపల్లికు వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిశాడు. మళ్లీ హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనపై మృతుడు తల్లి వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై గొవికారి ప్రసాద్ తెలిపారు. -
ఒక్కసారి కూడా వదులుకోలేదు.
నాకు 62 ఏళ్లు. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో ఓటేస్తున్న. ఎంత కష్టమైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేస్తున్న. ఒక్కసారి కూడా ఓటు హక్కును వదులు కోలేదు. వృద్ధులకు ఇంటి వద్దే ఓటుకు అవకాశం కల్పించినా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేయడడమే సంతోషంగా ఉంటోంది. – పిట్ట రవీందర్, శాంతినగర్భవిష్యత్ను నిర్ణయించేది ఎన్నికలే..మన భవిష్యత్ను నిర్ణయించేది ఎన్నికలే. 44 ఏళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటింగ్లో పాల్గొనాలి. మంచి నేతను ఎన్నుకోవాలని చైతన్యం కల్పిస్తున్నా. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ముందు నేను ఓటు వేసి తర్వాత నా సహచరులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారిని ఓటు వేసేలా ప్రోత్సహిస్తూ ఓటు వేయిస్తుంటా. – కొండా సత్యనారాయణ, అబ్బనికుంట వరంగల్ -
రూ. 4.11 లక్షల నగదు పట్టివేత
కాజీపేట: కాజీపేట డీజిల్ కాలనీ ప్రధాన రహదారిపై శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎన్నికల అధికారులు రూ.4.11 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా తుమ్మలకుంటకు చెందిన కందుగుల రాందాస్ ద్విచక్రవా హనంలో రూ.4.11 లక్షలు లభ్యమయ్యాయి. ఈ నగదుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో స్వాధీ నం చేసుకుని హనుమకొండ జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వర్ధన్నపేటలో రూ. 4 లక్షలు..వర్ధన్నపేట: మండలంలోని డీసీ తండా చెక్ పోస్టు వద్ద పోలీసులు శనివారం రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.స్టేషన్ ఘన్పూర్కు చెందిన పండ్ల వ్యాపారి మామిడాల జయరాం తన కారులో మరిపెడ బంగ్లా నుంచి హనుమకొండకు వెళ్తున్నా డు. డీసీ తండా చెక్ పోస్టు వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీ చేయగా ఇందులో ఎలాంటి ఆధారాలు లేని రూ. 4 లక్షల నగదు లభ్యమైంది. దీంతో స్వాధీనం చేసుకున్నామని ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
ప్రలోభాలకు లొంగితే శిక్ష తప్పదు
కాజీపేట : ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు శతవిధాలా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. డబ్బు, మద్యం, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను ఇస్తూ ఓట్లు గంపగుత్తగా దండుకోవడానికి నానాతంటాలు పడతారు. ఓట్ల కోసం ఇలా నజరానాలతో పట్టుబడితే నాయకులపై పోలీసులు కేసు నమోదు చేస్తుంటారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం వంటివి ఇచ్చిన, తీసుకున్న రెండు నేరమే. ప్రజాప్రాతినిఽథ్య చట్టం 1951 సెక్షన్ 123 దీనిని స్పష్టంగా చెబుతోంది. కేసు నమోదు అయితే ఐపీసీ సెక్షన్ 171 ప్రకారం జైలు లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని ఓటర్లతో పాటు నాయకులు గుర్తించాలి. -
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్ సేవలు
నెహ్రూసెంటర్: క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని వినియోగించుకుని ఓపీ రిజిస్ట్రేషన్ సేవలను పొందాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం క్యూఆర్కోడ్ ఓపీ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పా టు చేసిన క్యూఆర్కోడ్ విధానం ద్వారా స్కాన్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుందని, దానిని కౌంటర్ వద్ద చెబితే ఓపీ స్లిప్ అందజేస్తారన్నారు. ఎక్కువ సమయం ఓపీ స్లిప్ కోసం నిలబడకుండా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు క్యూఆర్కోడ్ విధానాన్ని వినియోగించుకుని సమయం వృథా కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ జగదీశ్వర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రవికిషోర్, రామాంజనేయులు, రాజేంద్రప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ సునీల్, భిక్షపతి, వెంకటేశ్వర్లు, సపోర్ట్ ఇంజనీర్ పల్లకొండ శ్రీకాంత్, డీఈఓ శ్రీనివాస్, కావ్య, అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎప్సెట్ ఇంజనీరింగ్ పరీక్ష
విద్యారణ్యపురి: ఇంజనీరింగ్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను ఎప్సెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష శుక్రవారం వరంగల్జోన్లో 10 కేంద్రాల్లో నిర్వహించారు. 98శాతంమంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సెషన్లో 2,168మంది విద్యార్థులకుగాను 2,129మంది (98.2శాతం) హాజరుకాగా 39మంది గైర్హాజరయ్యారని ఎప్సెట్ కన్వీనర్ బి.డీన్కుమార్ తెలిపారు. రెండో సెషన్లో 2,168మందిగాను 2,127మంది (98.1) హాజరుకాగా 41మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంతంలోని రెండు కేంద్రాల్లో మొదటి సెషన్లో 393 మందికిగాను 379మంది (96.4శాతం) హాజరుకాగా 14మంది గైర్హాజరయ్యారని తెలిపారు. రెండో సెషన్లో 393మందికిగాను 383మంది (97.5శాతం) హాజరుకాగా 10మంది గైర్హాజరయ్యారని వివరించారు. శనివారం మొదటిసెషన్తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
డోర్నకల్: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష కోరారు. శుక్రవారం డ్రైడేను పురస్కరించుకుని ఇస్రాతండాతో పాటు పలు తండాల్లో అంబరీషతో పాటు వైద్య బృందం పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబరీష మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను వంద శాతం అమలు చేయాలన్నారు. పీహెచ్సీలో నార్మల్ డెలివరీలు జరిగేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్సీవీవీడీసీ పీఓ సుధీర్రెడ్డి, సబ్ యూనిట్ అధికారి వడ్డె శ్రీనివాస్, సీహెచ్ఓలు వీరబాబు, కృష్ణార్జున్రావు తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ కురవి: మండలంలోని బలపాల పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. జాతీయ కార్యక్రమాలు మెరుగ్గా అమలు చేయాలన్నారు. ప్రజలకు వడ దెబ్బ తగలకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కీటక జనిత జిల్లా నియంత్రణ అధికారి సుధీర్రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణార్జున్రావు, సబ్యూనిట్ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి స్రవంతి, డాక్టర్ యశస్విని, సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి
తొర్రూరు: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్పు కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచురించిన కరపత్రాలను శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుందన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్లో చీలిక తెస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చిన ప్రజలు కేంద్రంలోని బీజేపీని మార్చాలని కోరారు. నాయకులు ప్రొఫెసర్ రవీందర్, సంగని మల్లేశ్వర్ ఉన్నారు. -
విజ్ఞాన కేంద్రంగా కేవీకే..
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని రైతులకు ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు అందించే విజ్ఞాన కేంద్రంగా మల్యాల కేవీకే కొనసాగుతోందని రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ.సరళకుమారి అన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ సరళకుమారి హాజరై మాట్లాడారు. మల్యాల కేవీకే 30 సంవత్సరాలుగా రైతులకు ఎన్నో రకాల సేవలు అందించిందన్నారు. జిల్లా రైతులు వరిలో వెదజల్లే పద్ధతి, వ్యవసాయంలో యాంత్రికరణ, నూతన సాగుబడుల గురించి తెలుసుకుని అభివృద్ధి చెందారన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి కేవీకే అందించే వివిధ రకాల నూతన విత్తనాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. రైతులకు జరిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతులు యాకూబ్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుందర్, మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు కిషోర్ కుమార్, క్రాంతి కుమార్, రాంబాబు, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం పదిమంది అభ్యుదయ రైతులను సన్మానించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కొత్తగూడ: మండలంలోని బత్తులపల్లి, బక్కచింతలపల్లి పోలింగ్ కేంద్రాలను డీఈఓ రామారావు శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులను బూత్ వరకు తీసుకువెళ్లేందుకు ట్రై సైకిళ్లు, అధికారులు ఉండేందుకు వసతి, తాగు నీటి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారులు సుధాకర్, శ్రీరాములు, ఎంఎన్ఓ లక్ష్మీనారాయణ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సుధీర్రెడ్డి గూడూరు: మండలంలోని మధనాపురం గ్రామానికి చెందిన లింగాల సుధీర్రెడ్డిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన నియామానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సుధీర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ గెలుపుకోసం కృషి చేస్తున్నామన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా నవీన్ మహబూబాబాద్ రూరల్ : టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనరుగా మహబూబాబాద్ జిల్లాలోని బంజర గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది నిమ్మరబోయిన నవీన్ను నియమించినట్లు టీపీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగం రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ శుక్రవారం పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులకు నవీన్ కృతజ్ఞతలు తెలిపారు. మతతత్వ శక్తులను ఓడించాలి తొర్రూరు: లోక్సభ ఎన్నికల్లో మతతత్వ శక్తులను ఓడించాలని తెలంగాణ పీపుల్స్ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మైస శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని అమరవీరుల స్థూపం ఎదుట తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రచార కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో నియంతృత్వ, మతతత్వ శక్తులను ఓడించి లౌకిక శక్తులను గెలిపించాలని కోరారు. రాజ్యాంగ రక్షణకు పాటుపడే పార్టీలకు అధికారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటాచారి, సోమిరెడ్డి, యాకూబ్, వీరన్న, శ్రీహరి, వెంకన్న, భరత్, నాగేశ్వర్, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య సేవలను విస్తృతం చేయాలి
నెహ్రూసెంటర్: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు 12 రకాల ఆరోగ్య సేవలను అందించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గర్భిణులు, ప్రసవసేవలు, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, బాల్య, కిశోరశిశు ఆరోగ్య సేవలు, అసంక్రమిత వ్యాధులు, సాధారణ రుగ్మతలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, కంటి, నోటి, ఈఎన్టీ, అత్యవసర సేవలను విధిగా అందించాలన్నారు. రోగులకు అందించాల్సిన ఆరోగ్య సేవలపై వైద్యులు వసుమతి, ఫ్లారెన్స్, రాధిక, అనిత, నాగేశ్వర్రావు, రాజేశ్ వైద్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష, ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, సుధీర్రెడ్డి, శ్రవణ్, విజయకుమార్, మాస్ మీడియా అధికారి ప్రసాద్, సీహెచ్ఓ కృష్ణార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్ మహేందర్రెడ్డి, కేవీ రాజు, పురుషోత్తం, గీత, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, డీపీఎంఓ రవీందర్రావు, డీపీఓ రుక్ముద్దీన్, పీహెచ్సీల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి -
కడియం కావ్య గెలుపు లాంఛనమే
తొర్రూరు: పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపు లాంఛనమేనని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టులకు చరిత్ర ఉందని, కాంగ్రెస్ గెలుపు దేశానికి ఎంత అవసరమో వారు గుర్తించారన్నారు. ఎర్రజెండా పార్టీల సహకారంతో దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం దేశానికి యువ నాయకత్వం అవసరమని, రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయమే లక్ష్యంగా కార్యకర్తలందరూ శ్రమించాలన్నారు. వరంగల్ లోక్సభలో కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్సారథి, రాష్ట్ర సమితి సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, సీపీఎం నాయకులు బొల్లం అశోక్, సింగారపు రమేష్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి, వామపక్షాల నాయకులు ఎండీ యాకూబ్, బందు మహేందర్, మాచర్ల సారయ్య, చిట్యాల సోమన్న, సోమ సత్యం, ఓమ భిక్షపతి, జమ్ముల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
బలరాంనాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలి
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్కు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్టీఐ మాజీ కమిషనర్ గుగులోతు శంకర్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ నాయకత్వంలో దేశంలో అనేక సవరణలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో పేద ప్రజలకు చేసిందేమి లేదన్నారు. మనుషులు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. దేశంలో మణిపూర్, కశ్మీర్, రాజస్థాన్, తెలంగాణ, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అనేక సమస్యలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు, యువతకు మేలు జరుగుతుందని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు గుగులోత్ రాజు నాయక్, రవి నాయక్, దేవసోత్ శ్రీనివాస్ నాయక్ రాథోడ్, సురేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement