-
కాంగ్రెస్లో పలువురి చేరిక
భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామస్తులు 150 మంది కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. వీరందరికి ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ పార్టి కండువాలు కప్పి స్వాగతించారు. కాంగ్రెస్ జహిరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఓటు వేసి అత్యదికి మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరన్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు చంద్రకాంత్రెడ్డి, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యాక్షుడు కుంట లింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. పోచారంలో.. పెద్దకొడప్గల్(జుక్కల్) : మండలంలోని పోచారంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పోచారం బీఆర్ఎ్స్ పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి అశోక్, గ్రామ అధ్యక్షుడు చంద్రకాంత్ సర్పంచ్ మానెవ్వ మొగులయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల నాయకులు బేగంపూర్, బేగంపూర్ తండా,కాస్లాబాద్ గ్రామల్లో ప్రచారం నిర్వహించారు. నాగిరెడ్డి, చిప్ప మోహన్, శ్యామప్ప పటేల్, మల్లప్ప పటేల్ తదితరులున్నారు. కామారెడ్డి రూరల్ నుంచి.. కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని బీజేపీ పార్టీకి చెందిన 20 మంది యువకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్రెడ్డి, పండ్ల రాజు, కారంగుల అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: అమ్మ ఆదర్శ పాఠశాలలలో చేపట్టిన పనులను విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. మంగళవారం టేక్రియాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను, మున్సిపల్ నర్సరీని, చౌరస్తాలో ఉన్న అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ను సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన ప్రహరీ మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను, నర్సరీలో పెంచుతున్న వట్టివేరు మొక్కలను పరిశీలించారు. అనేక ఔషధ గుణాలు కలిగిన వట్టి వేరు మొక్క ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. వట్టివేరు మొక్కలను చెరువు కట్టలపై పెంచాలని, వాటి వేర్లు 10–15 అడుగుల లోతువరకు వెళ్లి కట్టకు బుంగ పడకుండా కాపాడుతాయని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేయాలని చెక్పోస్టు సిబ్బందికి సూచించారు. కార్యక్రమాలలో ఇంజినీరింగ్ అధికారులు సుబ్బారాయుడు, శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
ఖలీల్వాడి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం నిజామాబాద్ నగరం, ఆర్మూర్లలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు తెలిపారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. రూట్ మ్యాప్ వివరాలు ఆర్మూర్లోని ఆలూర్ బైపాస్, జమ్మన్జట్టి గల్లీ, గో ల్బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా రోడ్ షో సాగుతోంది. అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ని ర్వహించనున్నారు. నగరంలోని గోల్ హనుమాన్ చౌరస్తా, ఆర్యసమాజ్, బడా బజార్, పోస్ట్ ఆఫీస్ మీదుగా రోడ్ షోలో పాల్గొనున్న సీఎం నెహ్రు పా ర్క్ వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడుతారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు సీఎం పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మ ళ్లింపు ఉంటుందని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. ● పూలాంగ్ చౌరస్తా నుంచి నగరంలోనికి వచ్చే వాహనాదారులు ఆర్ ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, బోధన్ బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు. ● కంఠేశ్వర్ వైపు నుంచి వచ్చే వాహనాదారులు ఎ న్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, ఫ్లై ఓవర్ నుంచి బ స్టాండ్కు. ● బోధన్ వైపు నుంచి రాకపోకలు సాగించే వాహనాలు అర్సపల్లి రైల్వే గేటు మీదుగా కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బ చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా బస్టాండ్కు రావాలి. ● హైదరాబాద్ నుంచి వచ్చి పోయే వాహనాలు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్, ఖానాపూర్ ఎక్స్ రో డ్డు, దుబ్బ చౌరస్తా మీదుగా రాకపోకలు సాగించాలి. ● ఆర్మూర్ రాకపోకలు సాగించే వాహనదారలు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానా పూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బ చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ● బాన్సువాడ వైపు నుంచి వచ్చి, పోయే వాహనాలను వర్ని చౌరస్తా నుంచి ఖిల్లా చౌరస్తా, బోధన్ బస్టాండ్, అర్సపల్లి రైల్వే గేటు మీదుగా కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బ చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. -
11న ప్రియాంకా గాంధీ సభ
కామారెడ్డి రూరల్: కామారెడ్డిలో ఈనెల 10న నిర్వహించాల్సిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ 11వ తేదీకి వాయిదా పడిందని ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాథ్ తెలిపారు. సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. మోదీ నియంత పాలనను అంతమొందించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సమన్వయ కర్త, కేరళ ఎంపీ రాజామోహన్ పున్నన్ తదితరులు పాల్గొన్నారు. పతి కోసం సతి ప్రచారం దోమకొండ: మండల కేంద్రంలో మంగళవా రం సాయంత్రం జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ భార్య అరుణ పాటిల్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కమలం పువ్వు గుర్తు కు ఓటేసి బీబీ పాటిల్ను గెలిపించాలని కోరారు. ఆమె వెంట బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్రెడ్డి, నాయకులు రవీందర్రెడ్డి, నరేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, కంది మనోజ్కుమార్, మోహన్రెడ్డి ఉన్నారు. విద్యుత్కు అంతరాయం దోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సమస్య ఏర్పడదిందని విద్యుత్శాఖ అధికారులు తెలిపారు. కొనసాగుతున్న కళాశాలల తనిఖీ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సి టీ పరిధిలో అనుబంధ గుర్తింపు తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం నవీపే ట్లోని మేధా డిగ్రీ కాలేజీ, బోధన్లోని ఉషోదయ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విజయసాయి మహిళా డిగ్రీ కాలేజీ, ఎస్వీ, ఉషోదయ మ హిళా డిగ్రీ కాలేజీ, ఎంఐఎంఎస్, ఇందూరు డిగ్రీ కళాశాలలు తనిఖీ చేసినట్లు వర్సిటీ అ కడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. సరైన సౌకర్యాలు లేని కళాశాలలకు నోటీసులు అందించినట్లు తెలిపారు. విజయసాయి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కనీ సం టేబుల్స్ సైతం లేకపోవడంతో కాళ్లపైనే రిజిస్టర్లు పెట్టుకుని తనిఖీ చేయాల్సి రావడంతో వర్సిటీ అధికారులు అసహనానికి లోనయ్యారు. ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ అతిక్ సుల్తాన్ ఘోరీ, డీన్లు ఆరతి, రాంబా బు, లావణ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
తప్పనిసరిగా ఓటు వేయాలి
కామారెడ్డి క్రైం: అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయడానికి మంగళవారం జిల్లాకేంద్రంలో 5కే రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన రన్.. కొత్త బస్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది. అనంతరం స్టేడియంలో విద్యార్థులతో ఓటు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పోలింగ్ కేంద్రానికి రావడానికి వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేశం, జిల్లా అధికారులు నాగరాజు, వెంకట్రెడ్డి, సాయిలు, ఆర్కే విద్యా సంస్థల సీఈవో జైపాల్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజేందర్ రావు, శ్రీకాంత్, ఎన్సీసీ వలంటీర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు. 5కే రన్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement