-
40 ఏళ్ల నవనవలాడే నాయకి
తమిళసినిమా: కళామతల్లి ముద్దుబిడ్డ నటి త్రిష. 25 వసంతాలుగా కథానాయకిగా రాణిస్తున్న అరుదైన నటి ఈమె. శనివారం త్రిష 40వ పుట్టిన రోజు. దీంతో భాషా బేధం లేకుండా వెల్లువెత్తిన శుభాకాంక్షల్లో ఆమె తడిసి ముద్దయ్యారు ఈ చైన్నె సుందరి. త్రిష విజయ పయనాన్ని ఒక్కసారి తిరగేస్తే మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ ఈ జాణ. 1999లో ప్రశాంత్, సి మ్రాన్ జంటగా నటించిన జోడి చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన నటి త్రిష. ఆ తరువాత కొంత పోరాటం అనంతరం 2002లో మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. అమీర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో సూర్య కథానాయకుడు. తొలి చిత్రంతోనే విజయానందాన్ని పొందిన త్రిషకి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆ తరువాత విక్రమ్తో జత కట్టిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ను చేసింది. అలా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, మధ్యలో హిందీలోనూ ఎంట్రీ ఇచ్చి ఆ ముచ్చటా తీర్చుకున్నా రు. కాగా కథానాయకిగా 25 ఏళ్లు గా విజయ ప్రస్థానాన్ని కొనసాగి స్తున్న నటి త్రిష. ఇది అరుదైన వి షయమే. ఎందుకంటే త్రిషతో పా టు కథానాయకిగా పయనించిన పలువురు నటీమణులు ఇ ప్పుడు అక్క, వదిన, అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు. త్రిష మాత్రం ఒక్క త మిళంలోనే కాకుండా, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్నా రు. కెరీర్లో ఎత్తు పల్లాలు అన్నవి సహజం. అపజయాలనేవి కొన్నిసార్లు త్రిష కెరీర్ను వెక్కిరించాయి. అయితే అలాంటి వాటిని ఎదుర్కొని నిలబడిన 40 ఏళ్ల నవనవ లాడే నాయకి త్రిష. ఈమె కెరీర్ దిగజారిపోతోంది అనుకునే సమయంలో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం అవకాశం పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. అంతే కాదు అంత కంటే ఎక్కువ పారితోషికం అందుకునేలా చేసింది. ఇప్పుడీ పరువాల ప్రౌడ రూ. 10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల విజయ్ సరసన లియో చిత్రంలో నటించిన త్రిష తాజాగా అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్తో థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్లాల్కు జంటగా రామ్, టోవినో థామస్ సరసన ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఇలా నాలుగు పదుల వయసులోనూ నాటౌట్ కథానాయకిగా కొనసాగడం త్రిషకే సాధ్యం అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎవర్గ్రీన్ బ్యూటీ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నది గమనార్హం. నటి త్రిష -
ఓల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కరించాలి
పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్ నొచ్చిలి, కృష్ణమరాజుకుప్పం, జీసీఎస్ కండ్రిగ పరిసర ప్రాంతా ల్లోని 30 గ్రామాల్లో వ్యవసాయానికి లో ఓల్టేజ్ సమస్యగా మారింది. దీంతో పంటలకు నీరందక వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు సోమ వారం అత్తి మాంజేరిపేటలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించాలని నిర్ణయించారు. సమా చారం తెలుసుకున్న అసిస్టెంట్ ఇంజినీర్ కన్నన్ శనివారం రైతు సంఘం ప్రతినిధులతో చర్యలు జరిపారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సోమవారం తలపెట్టిన ఆందోళన రద్దు చేసుకుంటున్నట్లు రైతులు తెలిపారు. -
తమిళనాడుకే పెద్ద హీరో ‘అన్బుచెలియన్’
తమిళసినిమా: నటుడు సంతానం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇంగ నాన్ దాన్ కింగ్. నటి ప్రియాలయ నాయకిగా నటించిన ఇందులో నటుడు తంబిరామయ్య, కూల్ సురేశ్ తదితరులు ముఖ్య పా త్రలు పోషించారు. గోపురం ఫిలింస్ పతాకంపై అన్బుచెలియన్ సమర్పణలో ఆయన వారసురాలు సుష్మిత నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహించారు. డీ.ఇమాన్ సంగీతం అందించిన ఇంగ నాన్దాన్ కింగ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్బుచెలియన్ మాట్లాడుతూ నటుడు సంతానం హీరోగా చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, అది ఈ చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు. అందరూ ఆనందించే వినోద భరిత కథా చిత్రంగా ఇంగ నాన్దాన్ కింగ్ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు. చిత్ర కథానాయకుడు సంతానం మాట్లాడుతూ ఇంగ నాన్దాన్ కింగ్ చిత్రానికి తాను హీరోనని, అయితే ఈ చిత్ర సమర్పకుడు అన్బుచెలియన్ మాత్రం తమిళనాడుకే హీరో అని పేర్కొన్నారు. ఆయన కార్యాలయానికి వెళ్లని హీరోనే లేరన్నారు. ఒకసారి తాను కూడా ఆయన ఆఫీస్కు డబ్బు కోసం వెళ్లానన్నారు. ఇల్లు కొ నడానికి అప్పు అడిగానని, అందుకాయన అప్పు చేసి ఇల్లు కొనడం అంత శ్రేయస్కరం కాదని హితవు పలి కి, తాను డబ్బు ఇస్తాను దాన్ని మీరు హీరోగా నటించే తన చిత్రానికి అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పారన్నారు. అలా ఈ చిత్రం మొదలయ్యిందని సంతా నం చెప్పారు. ఆయనతో కలిసి ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా తాను హీరోగా నటించిన చిత్రం ద్వారా అన్బుచెలియన్ వారసురాలు సుష్మిత నిర్మాతగా మారడం మరింత సంతోషంగా ఉందనే భావాన్ని సంతానం వ్యక్తం చేశారు. లాజిక్లు వెతక కుండా చూసి ఎంజాయ్ చేసే కథా చిత్రం ఇంగ నాన్ దాన్ కింగ్ అని సంతానం చెప్పారు. -
ఓటీటీ ప్లస్ పేరుతో మరో ప్లాట్ఫామ్
తమిళసినిమా: ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్ఫామ్లు వరప్రసాదంగా మారారనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ఫామ్లో అమలులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్లో బిజీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా ఓటీటీ ప్లస్ పేరుతో మరో కొన్ని ఓటీటీ లను కలుపుకుని కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్ శంకర్, ఎంఆర్ శీనివాసన్, సుధాకర్ కలిసి ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల వర్థమాన దర్శకులు జాన్ కిళడి(పైరీ), మణివర్మన్(ఒరునొడి), ఆర్.వెంకట్(కిడా), బాలాజీ వేణుగోపాల్ (లక్కీమేన్), కన్నుసామి(వట్టార్ వళక్కు), యశ్వంత్ కిశోర్ (కన్నగి), విఘ్నేశ్కార్తీక్( హార్ట్స్పార్ట్) శరత్ జ్యోతి, రచయిత వసంత్ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్ ముణుసామివీరప్పన్(వెబ్సిరీస్)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ భవిష్యత్లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించి, వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్ శంకర్ మాట్లాడుతూ ఓటీటీ ప్లాట్ఫామ్ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్ మరో 5 ఓటీటీ ప్లాట్ఫామ్లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్ఫామ్గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్ శంకర్ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్ అనే వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ను, సెన్టెన్స్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
నొచ్చిలి రహదారిపై మహిళల రాస్తారోకో
తిరుత్తణి: తమ గ్రామంలో నీటి సమస్య పరిష్క రించలేదని వీసీఆర్ కండ్రిగ మహిళలు శనివారం నొచ్చిలి రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తిరుత్తణి యూనియన్ చిరుగుమి పంచాయతీలో ని వీసీఆర్ కండ్రిగలో వందకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలోని బోర్వెల్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో ఎండల తీవ్రత పెరిగిన నేపఽథ్యంలో భూగర్భజలా లు అడుగంటి పోయాయి. దీంతో బోర్వెల్ ఎండి పోయి తాగునీటి సమస్య నెలకొంది. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విషయమై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినా పంచాయ తీ సర్పంచ్ నీటి సమస్య పరిష్కారం గురించి ప ట్టించుకోలేదు. దీంతో నీటి సమస్య మరింత తీ వ్రం అయ్యింది. దీంతో ఆగ్రహించిన మహిళలు 100 మంది గ్రామానికి సమీపంలోని కేజీ కండ్రిగ, నొచ్చిలి రాష్ట్ర రహదారిలో రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోతో ఆ మార్గంలో అర్ధగంట పాటు రాక పోకలు స్తంభించాయి. పంచాయతీ సర్పంచ్ లక్ష్మి భర్త వడివేలు గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అతనితో మహిళలు వాగ్వాదానికి దిగా రు. బీడీఓ కార్యాలయ అధికారులు హామీ మేరకు మహిళలు రాస్తారోకో విరమించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement