-
రూరల్ యాక్షన్కి సై
హీరో విజయ్ దేవరకొండ అంటే సిటీ బ్యాక్డ్రాప్ కథలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలని ఓ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ సైన్ చేశారు. ఈ సినిమా కోసం సిటీ నుంచి విలేజ్కి వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. అక్కడే ఫుల్ యాక్షన్ చేయనున్నారు.ఈ రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ మూవీని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. -
టాలెంటెడ్ డైరెక్టర్తో దిల్ రాజు- విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈరోజు లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్ టాక్ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్మెంట్తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass EndeavourX A @storytellerkola's Vision 💥 Produced by Raju - Shirish ✨More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024 -
ట్రెండింగ్లో 'ఫ్యామిలీ స్టార్'.. అలాంటి రూమర్స్కు చెక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఇప్పటికే థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా రీసెంట్గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ జోడీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని తెలుపుతున్నారు. కథలో హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం అనే కాన్సెప్ట్ అందరూ ఆలోచించతగినట్లూ ఉందంటూ వారు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ఈ సినిమా పట్ల తప్పుగా ప్రచారం చేసినా కూడా విజయ్ క్రేజ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది. అమెజాన్ ప్రైమ్లో టాప్ వన్లో ఫ్యామిలీ స్టార్ చిత్రం దూసుకుపోతుంది. -
'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి అడ్డంగా బుక్కపోయాడు. పాపం ట్రోలర్స్ దెబ్బకు ఇంకో రౌండ్ బ్యాండ్ పడుతోంది. థియేటర్ రిలీజ్ టైంలో కేవలం మాటల వరకే పరిమితమవగా.. ఇప్పుడు స్క్రీన్ షాట్స్, వీడియోలు పోస్ట్ చేసి మరీ సినిమా పరువు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అయిపోతున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?ఉగాది కానుకగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ థియేటర్లలో రిలీజైంది. కుటుంబ నేపథ్య కథ కావడంతో ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది కదా అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజుకి సీన్ అర్థమైపోయింది. జనాలు పట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు మాత్రం తమ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్కి కనెక్ట్ అయిందని అన్నారు. కానీ అందులో నిజమేంటనేది ఆయనకే తెలియాలి.ఎందుకంటే తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్' వచ్చేసింది. అయితే సినిమా చూసిన చాలామంది నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. అలానే విలన్ రవిబాబుకి వార్నింగ్ ఇచ్చే సీన్లో హీరో డైలాగ్స్ వరస్ట్గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఓటీటీ రిలీజ్ వల్ల దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి బలైపోతున్నాడు. What is this kalacondom 😶🏃#Familystar pic.twitter.com/qVN3vSJMDn— ..... (@DontDisturbu) April 26, 2024దోస వేసుకోటానికి లోభిస్తాం కాని సంవత్సరానికి 8 లక్షలు తాగుతాం 😎😎😎మొత్తం అంతాచూసాక టక్కున కథ చెప్పరా అంటే ఎవ్వడు చెప్పలేడు పరశురాంతో సహా అది #FamilyStar— Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) April 27, 2024Worst ra dei !!@TheDeverakonda parasuram#FamilyStar pic.twitter.com/hL6pg7jxPz— Frustrated Thamizhan (@FrustTamizhan) April 27, 2024 -
సడన్గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. వచ్చిన తర్వాత చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరసగా మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క దానితో హిట్ కొట్టలేకపోతున్నాడు. 'ఖుషి' ఓ మాదిరి కలెక్షన్స్తో పర్వాలేదనిపించింది. ఇది తప్పితే మిగతావన్నీ డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. దీంతో 'ఫ్యామిలీ స్టార్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ విషయంలోనూ నిరాశే ఎదురైంది.ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉగాది, రంజాన్ లాంటి హాలీడే వీకెండ్ దొరికినప్పటికీ.. 'ఫ్యామిలీ స్టార్' చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఊహించని విధంగా 20 రోజుల్లోనే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్లో దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన 'ఫ్యామిలీ స్టార్'.. ఓటీటీలో ఇంకేం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement