-
ఓయూ బడ్జెట్ రూ.686.77 కోట్లు
హైదరాబాద్: శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక బడ్జెట్ అభివృద్ధిదాయకంగా ఉందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు. శనివారం వర్సిటీ పాలనా భవనంలో రామచంద్రం అధ్యక్షతన జరిగిన సెనెట్ సమావేశంలో వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. గత ఏడాదిగా ఓయూలో చేపట్టిన పనులు, శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇటీవల సాధించిన న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్, స్వయంప్రతిపత్తి తదితర అంశాలను ప్రస్తావించారు. అనంతరం రూ.686.77 కోట్ల అంచనా, రూ.63.18 కోట్ల లోటుతో 2018–19 సంవత్సరానికి బిజినెస్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు ప్రవేశపెట్టిన ఓయూ వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. ఓయూలో 415 అధ్యాపక పోస్టుల భర్తీకి వార్షిక బడ్జెట్లో రూ.34.06 కోట్లు కేటాయించారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు పెంచిన 75 శాతం వేతనంపై బడ్జెట్లో నిర్ణయం తీసుకోలేదు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్రెడ్డి, వోఎస్డీ ప్రొ.కృష్ణారావు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. మౌలిక వసతులకు పెద్దపీట ఓయూ బడ్జెట్లో భవన నిర్మాణాలకు పెద్దపీట వేశారు. రూ.40 కోట్లతో కొత్త అకాడమీ బ్లాక్, వైస్ చాన్స్లర్ నివాసానికి మరో భవనం, రిజిస్ట్రార్కు క్యాంపస్లో కొత్తగా నివాస భవనం, రూ.30.50 కోట్లతో యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్ భవనం (యూఎఫ్ఆర్వో), క్యాంపస్లోని ఓయూ మోడల్ స్కూల్కు భవనం, రంగాపూర్లోని నిజాం అబ్జర్వేటరీ కేంద్రంలో కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. క్యాంపస్లోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల భవనాల మరమ్మతులకు రూ.10 కోట్లు కేటాయించారు. రూ.3.22 కోట్లతో ఠాగూర్ ఆడిటోరియం మరమ్మతు, రోడ్లు, పాత భవనాల మరమ్మతులకు రూ.17.19 కోట్లు, సీఎఫ్ఆర్డీ (రౌండ్ బిల్డింగ్)లో మౌలిక వసతులకు రూ.2.99 కోట్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యయన, పరిశోధనా కేంద్రం, తెలంగాణ అధ్యయన కేంద్రం, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపస్లో రెండు, సైఫాబాద్ పీజీ కాలేజీలో బాలుర హాస్టల్, కోఠి మహిళా కళాశాలలో బాలికల హాస్టల్ భవనాలు, సికింద్రాబాద్ పీజీ కళాశాలలో అకడమిక్ బ్లాక్ నిర్మించనున్నారు. తగ్గిన రాజీవ్గాంధీ ఫెలోషిప్లు ఓయూలో వివిధ కోర్సులు చదువుతున్న మెరిట్ విద్యార్థులకు లభించే ఫెలోషిప్ల సంఖ్య పెరిగింది. విద్యార్థినులకు లభించే ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ స్కాలర్షిప్లు 137కు చేరుకోగా, పీహెచ్డీ చేసే ఎస్సీ, ఎస్టీ పరిశోధక విద్యార్థులకు లభించే రాజీవ్గాంధీ నేషనల్ ఫెలోషిప్ల(ఆర్జీఎన్ఎఫ్) సంఖ్య 8 కి తగ్గింది. వర్సిటీ మెరిట్ విద్యార్థుల స్కాలర్షిప్లు 426, యూజీసీ, నెట్–జేఆర్ఎఫ్ 54, వృత్తివిద్య పీజీ కోర్సుల్లో 19 మందికి, పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్ 12 మంది, ఎమిరటస్ ఫెలో 5, డాక్టర్ రాధాకృష్ణన్ పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్ 4, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ఇద్దరికి లభిస్తున్నాయి. యూపీజీ మరో రెండేళ్లపాటు పొడిగింపు ఓయూకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి 2012–13 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్సీ(యూపీఈ) స్కీంకు ఎంపికైంది. ఈ స్కీం కింద రూ.30 కోట్లు లభించాయి. ఈ పథకం జూలై 2017లో ముగిసింది. ఓయూ పనితీరును పరిశీలించిన యూజీసీ అధికారులు యూపీఈ పథకాన్ని మరో రెండు సంవత్సరాల వరకు పొడిగించారు. -
26, 27, 28 తేదీల్లో శతాబ్ది ఉత్సవాలు
- వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ - కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన - ఓయూ వైస్ చాన్స్లర్ రాంచంద్రం వెల్లడి హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాలు 26, 27, 28 తేదీల్లో ప్రారంభం కానున్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంచంద్రం వెల్లడించారు. క్యాంపస్లోని ఏ గ్రౌండ్స్లో 26న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఆయన చేతుల మీదుగా శతాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. శుక్రవారం వర్సిటిలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. 26న మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు జరిగే కార్యక్రమంలో శతాబ్ది ఉత్సవాల పైలాన్ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారని చెప్పారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెంటినరీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, రూ.72 కోట్లతో నిర్మించనున్న హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ నరసింహన్ శతాబ్ది ఉత్సవాల సావనీర్, మూడు భాషలోని పబ్లికేషన్స్ను ఆవిష్కరిస్తారన్నా రు. ప్రభుత్వం కేటాయించిన రూ.200 కోట్లలో రూ.20 కోట్లను ఉత్సవాల నిర్వహణకు, మిగతా రూ.180 కోట్లను మౌలిక వసతుల కల్పనకు వినియో గిస్తామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు కేంద్రం నుంచి రూ.300 కోట్లను ఆశించినట్లు చెప్పారు. నిజాం వారసులకు ఆహ్వానం.. ప్రారంభోత్సవాల వేదికపై రాష్ట్రపతితో పాటు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రే య, ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరవుతారని చెప్పారు. ఉత్సవాలకు 18 వేల మందిని ఆహ్వానిస్తు న్నామని, మొదటి ఆహ్వాన పత్రాన్ని ఓయూ వ్యవస్థా పకులు నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ కుటుంబసభ్యుల కు అందజేయనున్నట్టు తెలిపారు. రోజూ సాయం త్రం 6 నుంచి 9.30 వరకు ఆర్ట్స్ కళాశాల ఎదుట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం ఉత్సవాలపై పాటల రచయిత సుద్దాల అశోక్తేజ రచించిన పాటను, జర్నలిజం విభాగం విద్యార్థులు రూపొందించిన లఘు చిత్రాల ను, వెబ్సైట్ను ప్రారంభించారు. శతాబ్ది ఉత్సవాల కు ప్రభుత్వం ప్రకటించిన రూ.200 కోట్లలో మొదటి విడతగా రూ.55 కోట్లను విడుదల చేసినట్లు అధికారు లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్ రెడ్డి, వోఎస్డీ ప్రొ.లింబాద్రీ, ప్రత్యేక అధికారి ప్రొ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement