-
సికింద్రాబాద్ బొల్లారంలో వేసవి శిబిరం
సికింద్రాబాద్ బొల్లారంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వర్. విద్యార్థులందరికీ వేసవికాలం సెలవులు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే విద్ఆయ సంవత్సరం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లలకు భరతనాట్యం, కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాలు, జానపద నృత్యకళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, గురువులను నియమించుకున్నారు.ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రియాంకను ఆహ్వనించగా.. వేసవి శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులను ఉద్దేశించి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వరు మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం, యోగను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శ్రద్ధ పెట్టాలన్నారు. -
నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్లో కాంగ్రెస్ పెండింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో సమావేశమయ్యారు. మరో వైపు, కరీంనగర్ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ వేయగా, పార్టీ ఆదేశించకుండా నామినేషన్ వేయడంపై ఆశావహుడు ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారని.. లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
ఈస్టర్ ఫెస్టివల్.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్లో ‘రన్ ఫర్ జీసస్ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. -
BRS Party: మాగంటి Vs రావుల.. వేదికపైనే తిట్టుకున్నఇరువురు నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు వేదికపైనే తిట్టుకున్నారు. మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. దీనికి శ్రీధర్ రెడ్డి బదులిస్తూ ‘నువ్వేవడివి.. నాకు చెప్పడానికి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ జోక్యం చేసుకొని ఇరువురి నేతలకు సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే స్టేజీ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: ఫోన్ ట్యాపింగ్పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ -
సికింద్రాబాద్ : హ్యాపీగా నవ్రోజ్..(ఫొటోలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
ప్రచార హోరు..
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేయాలి
బిల్లులు రాక రెండేళ్లు..
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement