-
రోడ్డు ప్రమాదమా.. హత్యాయత్నమా?
గాయపడ్డ ముగ్గురు ‘ఎర్ర’ దొంగలు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం అనంతపురం క్రైం, న్యూస్లైన్ : అనంతపురం శివారులో ఆదివారం వేకువజామున జరిగిన ఎర్రచందనం దొంగల ముఠా సభ్యుల రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారా.. లేక ఎర్రచందనం దుంగలను రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటుంటే పసిగట్టి ముఠా నేతలే వాహనంలో వెంబడించి ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్నది అంతుచిక్కడం లేదు. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నారాయణ అలియాస్ అగస్టీన్, ఇదే మండలం దొరికొట్టాలకు చెందిన రాజు, కర్ణాటకవాసి సోహైల్ శనివారం రాత్రి శ్రీశైలం అడవుల నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలతో కేఏ05 ఎంపీ 2855 నంబరుగల క్వాలీస్ వాహనంలో బెంగళూరుకు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి సమీపాన 44వ నంబరు జాతీయరహదారి వంతెనపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ లేవలేని స్థితిలో ఉన్నా పోలీసుల కంటపడకూడదని తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే స్థానికులు అక్కడకు చేరుకుని మానవతా దృక్పథంతో వారిని సర్వజనాస్పత్రికి చేర్చారు. అగస్టిన్, రాజు అపస్మారకస్థితికి చేరుకున్నారు. సోహైల్ మాత్రం స్పృహలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదంపై అవుట్పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఉదయం పదిన్నర గంటల సమయంలో సంఘటన స్థలానికెళ్లారు. నుజ్జునుజ్జయిన క్వాలీస్ వాహనాన్ని తనిఖీ చేయగా.. సీటు కింద 9 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సర్వజనాస్పత్రిలో ఆ ముగ్గురు ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులకు ఎస్కార్టను నియమించారు. ఈ ముఠా వివరాలను తెలుసుకునేందుకు.. ఇంకా ఎక్కడెక్కడ దుంగలను నిల్వ చేశారో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. ఆ దుంగలు.. అటవీశాఖ కార్యాలయంలోనివంటూ పుకార్లు అనంతపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలను ఆధివారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. ఈ విషయంపై అటవీశాఖాధికారులు తర్జన భర్జనలో ఉండగానే...రోడ్డు ప్రమాదంలో ఎర్ర చందనం దొంగలు గాయపడి పోలీసులకు చిక్కారు. వీరి వాహనంలో లభించిన దుంగలు అటవీశాఖ కార్యాలయంలో అపహరణకు గురైనవీ ఒక్కటేనేమోనని పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఆ దుంగలు అటవీశాఖవి కాదని నిర్ధారణైంది. దీంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొడుకును బతికించుకోవాలని..
గాయపడ్డ ఓ తండ్రి ఆరాటం టైరు పేలడంతో కారు బోల్తా తండ్రీ కుమారులకు గాయాలు రోడ్డు ప్రమాదంలో తనతో పాటు తీవ్రంగా గాయపడిన కొడుకును రక్షించుకునేందుకు ఆ తండ్రి పడిన క్షోభ అంతులేనిది. ఒక పక్క తనకు తగిలిన గాయాలు బాధిస్తున్నా అపస్మారక స్థితిలో ఉన్న తనయుడిని కాపాడుకునేందుకు హైవే పోలీసులు, జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారుల కాళ్లావేళ్లా పడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు స్థానికుల చొరవతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి విశాఖలోని కేర్ ఆస్పత్రికి క్షతగాత్రుణ్ణి తరలించారు. యలమంచిలి/యలమంచిలి రూరల్ న్యూస్ లైన్ : యలమంచిలి మండలం, మర్రిబంద సమీపంలో హోటల్ వద్ద సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో టైరు పేలడంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో తండ్రీ కుమారులు గాయపడ్డారు. విశాఖకు చెందిన బి.వీరన్న తన కుమారుడు సాయితేజ తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల నుంచి విశాఖ వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. వీరన్నకు స్వల్పగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని స్థానికుల సాయంతో రోడ్డువరకు తీసుకువచ్చిన వీరన్న తీవ్ర వేదనకు లోనయ్యారు. సంఘటన స్థలం వద్ద ఉన్న హైవే పోలీసులను త్వరగా ఆస్పత్రిలో చేర్చాలని ప్రాథేయపడుతూనే మరోపక్క జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను కూడా నిలిపే ప్రయత్నం చేశారు. సాయితేజ కొన ఊపిరితో ఉన్నాడన్న కారణంగా హైవే పోలీసులు ఆస్పత్రికి తీసుకు వెళ్లడానికి వెనుకాడారు. స్థానికులు కూడా బతిమాలడంతో అర్ధగంట తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స చేసి విశాఖ తరలించాలని వైద్యులు సూచించడంతో వాహనం కోసం వీరన్న పడిన యాతన అంతా ఇంతాకాదు. రోగులను, స్థానికులను నా కుమారుడిని రక్షించుకోవడానికి వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. ప్రమాదానికి సం బంధించిన పత్రాలు ఇవ్వాలంటూ వైద్య సిబ్బందిని వేడుకున్నారు. వాహనం లేకపోవడంతో సమీపంలోని ట్రావెల్స్ వద్దకు పరుగులు తీశారు. కార్లు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఏర్పాటు చేసిన వాహనంలో కుమారుడిని విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వీరన్న విశాఖలోని ఎంవీపీ కాలనీలో బియ్యం వ్యాపారం చేస్తుండగా కుమారుడు సాయితేజ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో సాయితేజ చికిత్స పొందుతున్నాడని యలమంచిలి టౌన్ ఎస్ఐ నల్లి రవికుమార్ తెలిపారు. -
జాతీయ రహదారి రక్తసిక్తం
తమిళనాడులోని హొసూరు-సూళగిరి మధ్య రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి దుర్మరణం మృతుల్లో వేలూరు జిల్లా ఎస్ఐ నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కార్లు హొసూరు, న్యూస్లైన్ : ఏడవ నంబర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో వేలూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న ఆనందన్ (50)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వివరాలు... వేలూరు జిల్లా సత్వచేరి గ్రామానికి చెందిన ఆన ందన్.. పాగాయంలో ఎస్.ఐగా పనిచేస్తున్నారు. ఇతనని సోదరుడు బాబు (46) బెంగళూరులో వ్యాపారి. శనివారం ఆనందన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బాబు కుటుంబ సభ్యులు వేలూరు నుంచి రెండు కార్లలో శనివారం అర్ధరాత్రి బెంగళూరు బయలుదేరారు. కాశ్మీర్-క న్యాకుమారి ఏడవ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో హొసూరు-సూళగిరి మధ్యలో గోపనపల్లి వద్ద రోడ్డుపై చెడిపోయి నిలిపి ఉన్న లారీని వేగంగా వస్తున్న కార్లు బలంగా ఢీకొన్నాయి. వెనుకనే వస్తున్న మరో రెండు కార్లు కూడా అదుపు తప్పి ఢీకొన్నాయి. దీంతో మొదటి రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12 మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఎస్.ఐ ఆనంద్ (50) ఆయన భార్య ఉమ (48), కూతురు సంధ్య (13), ఎస్.ఐ సోదరుడు బాబు (46), భార్య రమణి (40), కుమారుడు అరుణ్ (10), కారు డ్రైవర్ విల్లు (35) అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్ మురుగన్, షాలినీ (20), సీత (7), ఐశ్వర్య (15), దివాకర్ (4) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హొసూరు ప్రభుత్వలో ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని హొసూరు వైద్యులు వెల్లడించారు. కాగా, అర్ధరాత్రి క్షతగాత్రుల అరుపులు, కేకలతో జాతీయ రహదారి దద్దరిల్లింది. ప్రమాద సమాచారం అందుకున్న హొసూరు డీఎస్పీ గోపి, సిప్కాట్, సూళగిరి సీఐలు శంకర్, సుభాష్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉంటే మూడో కారులో ప్రయాణిస్తున్న రాజస్తాన్కు చెందిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గంటసేపు శ్రమించిన అనంతరం ట్రాఫిక్ను పునరుద్దరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఇద్దరు పీయూసీ విద్యార్థుల దుర్మరణం
ప్రాణాలు తీసిన వేగం బైక్పై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాన్వి, న్యూస్లైన్ : ద్వితీయ పీయూసీ పరీక్ష రాసేందుకు మాన్వికి వెళుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను తాలూకాలోని హిరేకొట్నేకల్కు చెందిన అజీం(18), యాపలపర్వికి చెందిన యల్లప్ప(18)గా గుర్తించారు. వీరు ఇక్కడకు సమీపంలోని నసలాపుర క్రాస్ వద్ద రాష్ట్ర రహదారిలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతుండగా, మలుపులో వంతెన వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. పోత్నాళలోని మహర్షి వాల్మీకి పీయూ కాలేజీలో చదువుతున్న వీరికి మాన్విలోని బాలికల ప్రభుత్వ పీయూ కాలేజీని పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష ప్రారంభమయ్యేలోపు కేంద్రానికి చేరుకోవాలనే ఆత్రుతలో వేగంగా బైక్పై వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సీఐ హరీష్, ఎస్ఐ దీపక్ బూసరెడ్డి తమ సిబ్బంది తో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహర్షి కాలేజీ పాలక మండలి, విద్యార్థుల స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయూలు ఆగి ఉన్న లారీని కారుఢీకొనడంతో ప్రమాదం మరో ఇద్దరికి స్వల్ప గాయాలు బాధితులంతా వైద్య విద్యార్థులే మడికొండ/ఎంజీఎం, న్యూస్లైన్ : సరదాగా ఐదుగురు మెడికల్ విద్యార్థులు కలిసి విహారానికి బయల్దేరగా వారి ప్రయూణం విషాదంతమైంది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నగర శివారు మడికొండ పెట్రోల్పంప్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... వరంగల్ కాశిబుగ్గకు చెందిన వైద్యులు డాక్టర్ టి.భాస్కర్, శోభారాణి దంపతుల కుమార్తె చైతన్యశ్రీ(24), ఎంజీఎం యూరాలజిస్టు డాక్టర్ సురేందర్ కుమార్తె పూజిత, జనగామ వ్యాపారవేత్త నర్సింహారెడ్డి కుమార్తె సుష్మ, దుబాయ్కి చెందిన నజియా కరీంనగర్ జిల్లా ప్రతిమ మెడికల్ కళాశాలలో హౌస్సర్జన్ నాలుగో సంవత్సరం పూర్తి చేశారు. వీరంతా ఆదివారం వరంగల్ కేఎంసీ, నిట్లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం అంతా కలిసి హన్మకొండ హంటర్రోడ్డులోని వనవిజ్ఞాన కేంద్రం(జూ పార్కు)కు వెళ్లారు. అరుుతే జూ పార్క్ మూసి ఉండడంతో హైదరాబాద్కు వెళ్దామని బయల్దేరారు. కారు మడికొండలోని పెట్రోల్పంప్ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న చైతన్యశ్రీ తమ్ముడు ఉదయ్రాజ్ షూ క్లచ్, గేర్ మధ్య ఇరుక్కుంది. దీంతో కాలిని పైకి తీసే క్రమంలో కారు అదుపుతప్పి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో చైతన్యశ్రీ అక్కడి కక్కడే కారులో మృతిచెందగా పూజిత, నజియా తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతురాలు చైతన్యశ్రీ ఎడమ చేయి పూర్తిగా తెగి దూరంగా పడిపోయింది. మడికొండ సీఐ నందిరాంనాయక్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో, ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ప్రమాద స్థలాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్కు అంత రాయం ఏర్పడడంలో పోలీసులు వన్వేలో వాహనాలను పంపించారు. స్వల్పగాయాలైన సుష్మ, హృదయ్రాజ్ నుంచి సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమచారమిచ్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం వెనుకాలే వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రమాద సమయంలో కారు వేగం 120 స్పీడ్తో ఉన్నట్లు తెలుస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయ్రాజ్ కాకతీయ మెడికల్ కళాశాలలో(కేఎంసీ)లో సెకండయరీ చేస్తున్నాడు. బాధితులను డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్తోపాటు పెద్దఎత్తున వైద్యులు తరలివచ్చి పరామర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement