-
చెన్నైకి గేమ్
చెన్నైలో ఆట మొదలెట్టనున్నారు హీరో రామ్చరణ్. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ చెన్నైలోప్రారంభం కానుందని సమాచారం. మే మొదటి వారంలో చెన్నైలోప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్, కియారా అద్వానీ, సునీల్, నవీన్ చంద్రలపై ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట శంకర్. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. -
గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు
-
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్ చేసిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. రామ్చరణ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. భారీ బడ్జెట్లో తెరెక్కిన ఈ చిత్రాన్ని సురేందర్రెడ్డి డైరెక్ట్ చేశారు. రాజకీయాల తర్వాత చిరు 'ఖైదీ నంబర్ 150'తో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో ‘సైరా’ 2019లో విడుదలైంది. కొణిదెల ప్రొడక్షన్లో రూ. 200 కోట్లతో సైరాను నిర్మించారు రామ్ చరణ్. అంత బడ్జెట్తో సినిమా అంటే కష్టం అనిపించినా.. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఖర్చులో ఏమాత్రం రాజీ పడకుండా సైరాను నిర్మించారు. సినిమా పరంగా మంచి టాక్ వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల హిట్ టాక్ వచ్చింది. కానీ కొన్ని చోట్ల నష్టాలు వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సైరా సినిమా నష్టాలు మిగిల్చినట్లు అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'సైరా' గురించి చిరంజీవి ఇలా వ్యాఖ్యానించారు. ' ఇన్నేళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, చాలా సినిమాల్లో నటించాను. కానీ వాటిలో కొన్ని సంతృప్తి ఇవ్వలేదు. పలాన పాత్ర చేయాలని ఎదురు చూస్తే ప్రతిసారీ మనకు రావు. ఈ క్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలనే కోరిక నాలో చాలా ఏళ్లుగా ఉండేది. ఫైనల్లీ 'సైరా'తో అది తీరిపోయింది. అయితే, ఆ సినిమా నేను అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా మెప్పించలేదు. కానీ మిగిలన రాష్ట్రాల్లో బాగానే ఆడింది. దీంతో సైరా వల్ల భారీగానే నష్టపోయాం. గతంలో కూడా 'రుద్రవీణ' సినిమా చేశాను. ఈ సినిమాను నా తమ్ముడు నాగబాబు నిర్మించాడు. సినిమాకు మంచి పేరు వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదు. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే నిర్మాత జేబు ఖాళీ అవుతుంది. అందువల్లే వారి బాగు కోసం కమర్షియల్ సినిమాలనే ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది.' అని మెగాస్టార్ చెప్పారు. -
రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్ ?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement