-
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
ఢిల్లీ: అమేథీ ప్రజలు కోరుకుంటే తానూ పోటీ చేయడానికి సిద్ధమని ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అమేథీ బరిలోకి 'కిషోరి లాల్ శర్మ'ను దింపింది. ఈ తరుణంలో వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.అమేథీ ఎంపీ టికెట్ కేఎల్ శర్మకు కేటాయించడం వల్ల.. వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొంతకాలం తరువాత తాను ఖచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లో చేరుతానని స్పష్టం చేశారు.రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరికీ సమాధానం చెప్పడానికి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ మీద మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానిగా ఇలాంటి మాట్లాడటం తగదని పేర్కొన్నారు.ప్రధాని మోదీ ఏది ఆరోపించినా వాటిని రుజువు చేయాలి. రుజువు చేయని పక్షంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాహుల్, ప్రియాంకా ఇద్దరూ ప్రజలకు సేవ చేయడానికి పాటుపడుతున్నారు. ఈ సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేదని వాద్రా అన్నారు.#WATCH | Robert Vadra says "...I do not want to come to politics to give a reply to anyone. I want to serve the people of the country, so maybe it is through Rajya Sabha. I will keep working for the people across the country and will travel to Amethi, Raebareli, and Morabadab as… pic.twitter.com/kUvzDHieEi— ANI (@ANI) May 9, 2024 -
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వైవి సుబ్బారెడ్డి
-
రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. కాగా, ఈరోజు రాజ్యసభ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాడు లోక్సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని కామెంట్స్ చేశారు. -
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ సోనియా గాంధీ చేత ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly - elected member Shrimati Sonia Gandhi in the Parliament House.#RajyaSabha @VPIndia @SoniaGandhi_FC @harivansh1956 pic.twitter.com/HdeqVvUUh7 — SansadTV (@sansad_tv) April 4, 2024 మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the re- elected member Ravi Chandra Vaddiraju in the Parliament House.#RajyaSabha @VPIndia @vaddirajumprs @harivansh1956 pic.twitter.com/2hCKkYkOAd — SansadTV (@sansad_tv) April 4, 2024 -
YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముగ్గురు ఎంపీలు
Live Updates.. ►వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ►వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Yerram Venkata Subba Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/iYPbG6qrHM — SansadTV (@sansad_tv) April 4, 2024 ►ఈ సందర్భంగా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Meda Raghunadha Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/cbYUwdztlC — SansadTV (@sansad_tv) April 4, 2024 ►హిందీలో దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల బాబురావు #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Golla Baburao in the Parliament House.#RajyaSabha @VPIndia @BaburaoGolla @harivansh1956 pic.twitter.com/LfsieauzrE — SansadTV (@sansad_tv) April 4, 2024 ►రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ►ఇక, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైఎస్సార్సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. ►అంతకుముందు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల్లో దళితులకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నా నాలాంటి పేద, దళిత వర్గాలకు రాజ్యసభ సీటు ఇచ్చారు. నా పదవీకాలంలో పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఈరోజు హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు.. రాజ్యసభలో టీడీపీ జీరో
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఇక, ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రాజ్యసభ సీట్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఈ క్రమంలో నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది. రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. నిన్న(మంగళవారం)తో టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది. దీంతో, రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది. కాగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. -
ఒక శకం ముగిసింది.. మన్మోహన్పై ఖర్గే ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. మన్మోహన్ రాజకీయ ప్రస్థానం.. ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
రాజ్యసభకు సుధామూర్తి.. ‘నారీ శక్తికి నిదర్శనం’: మోదీ
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజిక వేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం భారత ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శమని మోదీ పేర్కొన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్య, దాతృత్వంతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి ఆపారమైనదని ప్రశంసించారు. మహిళల శక్తి, సామర్థ్యాలను చాటిచెప్పేలా ఆమె పార్లమెంట్ పదవీకాలం ఉన్నతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F— Narendra Modi (@narendramodi) March 8, 2024 కాగా సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. -
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ చీఫ్ రాజీనామా
సాక్షి, ఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(63) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన హిమాచల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం లభించింది. బీహార్లో పుట్టి పెరిగిన జగత్ ప్రకాష్(జేపీ) నడ్డా.. నరేంద్ర మోదీకి సహచరుడు. లాయర్గా కెరీర్ను ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన పూర్వ మూలాలు మాత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అందుకే 1993 నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నెగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ రాష్ట్రానికి పలు శాఖల మంత్రిగానూ పని చేశారు. 2012లో హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. పెద్దల సభకు వెళ్లాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. .. 2014 నుంచి 2019 నడుమ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2019 జూన్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. 2020, జనవరి 20వ తేదీ నుంచి ఆయన బీజేపీ జాతీయాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2022లోనే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. బీజేపీ అధిష్టానం కాలపరిమితిని పొడగించింది. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన వైవీ సుబ్బారెడ్డి
-
రాజ్యసభ సభ్యుడిగా ధ్రువీకరణ పత్రం తీసుకున్న వైవి సుబ్బారెడ్డి
-
ఏపీలో రాజ్యసభ మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం
-
రాజ్యసభకు ఆ ముగ్గురూ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రక టించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, వద్ది రాజు రవిచంద్ర మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. బుధవారం ధ్రువీకరణ పత్రం తీసుకుంటానని రేణుకా చౌదరి రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. భారీ ప్రదర్శనగా వచ్చిన అనిల్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేందుకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనిల్ వెంట ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులున్నారు. అనిల్కుమార్ యాదవ్ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కడం తన విజయం కాదని, తెలంగాణ యువజన కాంగ్రెస్ విజయమని వ్యాఖ్యానించారు. ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపి కాంగ్రెస్ అధిష్టానం బీసీలందరికీ తగిన గౌరవం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్కు రుణపడి ఉంటానన్న వద్దిరాజు రాజ్యసభకు 2022లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున తొలిసారిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మరోమారు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రెండోమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్కుమార్ గుప్తాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన పార్టీ అధినేత కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై పార్లమెంటులో గొంతెత్తుతానని వద్దిరాజు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాగా, ఈ నెల 8న రాష్ట్రం కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 15 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కాయి. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం.. పరిశీలన, విత్డ్రా గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రాష్ట్రం నుంచి నామినేషన్ వేసిన బీజేపీ నేతలు చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో మూడు స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. లోక్సభ ఎంపీగా 6 పర్యాయాలు పనిచేసిన సోనియా గాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు చెందిన జైపూర్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా సోనియా 2006 నుంచి రాయ్బరేలీ నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ అమెథీలో రాహుల్ ఓడిపోయినప్పటికీ సోనియా రాయ్బరేలీ స్థానాన్ని గెలుచుకొని ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక స్థానంగా నిలిచింది. చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర
-
వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు
-
TS: మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాల్లోని అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం వెల్లడించారు. తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలుకు గాను.. మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఇక.. రేణుకా చౌదరి రేపు(బుధవారం) గెలుపు ధృవ పత్రాలను అందుకోనున్నట్లు తెలుస్తోంది. -
రాజ్యసభలో టీడీపీ సున్నా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో ఘోర పరాభవమిది. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో ఏప్రిల్ 2 నాటికి ఖాళీ కానున్న మూడు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. టీడీపీ చివరి సభ్యుడి పదవీ కాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యాన్ని నిలుపుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలే చేశారు. తనదైన శైలిలో కుయుక్తులతో ఓ స్థానం గెల్చుకోవడానికి ప్రయత్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తగినంత సంఖ్యా బలం శాసన సభలో లేకపోయినా.. ఓటుకు కోట్లు ఎరగా వేయాలన్న వ్యూహంతో బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. గతంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీకి లేని రాజ్యసభ స్థానాన్ని చేజిక్కించుకోవాలన్న దుగ్ధతో ఏకంగా ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమై, అడ్డంగా దొరికిపోయిన చరిత్ర చంద్రబాబుది. ఇంతే కాదు.. గతంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకున్నారన్న తీవ్ర విమర్శలు వచ్చాయి. తన వర్గానికి లేదా ఆర్థికంగా మేలు చేసే వారికే సీట్లు ఇచ్చేవారన్న విమర్శలు టీడీపీలోనే ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలకు ఒక్క అవకాశం కూడా ఉండేది కాదు. ఏపీలోనూ ఓ రాజ్యసభ స్థానాన్ని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు ఇచ్చినట్టే ఇచ్చి, చివర్లో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కట్టబెట్టారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న వర్ల రామయ్యను అవమానకరంగా మధ్య దారిలోనే వెనక్కి పంపించి మరీ తన వాడికి ఇచ్చుకొన్నారు. ఈసారి కూడా టీడీపీ తరపున రాజ్యసభ స్థానానికి ఓ అభ్యర్థిని నిలబెట్టి, ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆయన కుయుక్తులు ఫలించకపోవడంతో చివరి నిమిషంలో తమ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. దీంతో రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరాయి. 2019 ఎన్నికల్లోనే టీడీపీ చరిత్రలో ఘోర పరాజయం చంద్రబాబు మోసపూరిత విధానాలతో తెలుగుదేశం బలహీనపడిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. రైతులు, మహిళల రుణాలు మంజూరు చేస్తామంటూ వారిని ఘోరంగా వంచించారు. ఉద్యోగాలివ్వకుండా యువతకు మొండిచేయి చూపారు. ఫైబర్నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వంటి పలు కుంభకోణాల్లో వందల కోట్ల దోపిడీ జరిగింది. ఇసుక, మద్యంలో టీడీపీ నేతల దందా చెప్పలేనంత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేసిన ఘనతా చంద్రబాబుదే. ఇలా పెత్తందారీ పోకడలు, మోసపూరిత విధానాలు, దోపిడీతో రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారు. చంద్రబాబు అసలు స్వరూపం మరోసారి బయటపడటంతో 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. దీంతో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖాలాలు లేవు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్సభ స్థానాలకు చతికిలపడింది. టీడీపీ చరిత్రలో ఘోర పరాజయం ఇదే. దీంతో రాజ్యసభలోని అన్ని స్థానాలూ వైఎస్సార్సీపీ వశమయ్యాయి. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. మేనిఫెస్టో అంటే ఓ భగవద్గీత, ఓ బైబిల్, ఓ ఖురాన్ అని భావించే సీఎం జగన్.. ఆచరణలోనూ దానిని నిరూపించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలు నెరవేర్చారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్లు.. మొత్తం రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేదల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. పింఛను కోసం పేదలు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల్లో పడిగాపులు గాయాల్సిన పని లేకుండా వారున్న చోటనే ఇస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు అండదండలందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లారు. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోంది. వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సీఎం జగన్ తెచ్చిన మార్పు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తోంది. ఇది 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడానికి బాటలు వేసింది. రాష్ట్రంలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 10,299 పంచాయతీల్లో (80 శాతం) వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్, నగర పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో 52.63 శాతం ఓట్లతో 84 మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులను (97 శాతం) వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 14 కార్పొరేషన్ మేయర్ పదవులు (వంద శాతం) కైవసం చేసుకుంది. మండల పరిషత్ ఎన్నికల్లో 65.22 శాతం ఓట్లతో 8,216 ఎంపీటీసీ స్థానాల్లో(88 శాతం) విజయం సాధించి, 637 మండల పరిషత్ అధ్యక్ష పదవులను (96 శాతం) వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 69.25 శాతం ఓట్లతో 630 జెడ్పీటీసీ(87 శాతం) స్థానాలను.. 13 జిల్లా పరిషత్ అ«ధ్యక్ష పదవులను (వంద శాతం) వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత భారీగా విజయం సాధించిన దాఖలాలు దేశ చరిత్రలో మరే పార్టీకీ లేవు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రక అపజయాలను మూటగట్టుకుంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి, బద్వేలు, ఆత్మకూరు శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2019లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఉండటంతో ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 2019లోకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభవం తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
మీ నమ్మకాన్ని పొందటం నాకు గర్వకారణం
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ ప్రస్తుతం వయోభారం కారణంగా ప్రజాసభను వదిలి ఎగువ సభకు తన రాజకీయ పథాన్ని మార్చుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన నియోజకవర్గ ఓటర్లకు భావోద్వేగంతో ఒక లేఖ రాశారు. ‘‘ నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్ననంటే దానికి మీరే కారణమని గర్వంగా చెబుతా. మీ వల్లే, మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే నా శక్తిమేరకు మీకు సేవచేయగలిగాను. అనారోగ్యం, వయోభారం సమస్యల కారణంగా ఇక మీదట లోక్సభ ఎన్నికల్లో పోటీచేయదల్చుకోలేదు. ఈ నిర్ణయం తర్వాత ప్రత్యక్షంగా మీకు సేవచేసే అవకాశం నాకు లేదని తెలుసు. కానీ నా మనసు నిండా మీరే ఉన్నారు. గతంలోలాగే ఇక మీదట కూడా మీరు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడతారని తెలుసు’’ అని హిందీలో సోనియా ఓటర్లకు ఒక సందేశం పంపారు. ‘‘ మీరు లేకుండా ఢిల్లీలో నా కుటుంబం సంపూర్ణం కాదు. రాయ్బరేలీకి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడే మొత్తం కుటుంబం అనే భావన కలుగుతోంది. మీ బంధం దశాబ్దాలనాటిది. నా అత్తగారి నుంచే నేనీ బంధాన్ని వారసత్వంగా పొందా. రాయ్బరేలీతో నా కుటుంబ బంధం బలంగా పెనవేసుకుంది. నా మామగారు ఫిరోజ్ గాంధీ స్వాతంత్య్ర సిద్ధించాక తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాయ్బరేలీ నుంచి లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇందిరా గాంధీని ఆశీర్వదించి లోక్సభకు పంపారు. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తోడుగా నిలిచి బంధాన్ని మరింత పటిష్టం చేశారు. అత్తను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడూ మీ చెంతకొచి్చన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఇంతటి మద్దతు, ప్రోత్సాహాన్ని జీవితంలో మరువను. గత రెండు లోక్సభ ఎన్నికల్లో గడ్డుపరిస్థితులు ఎదురైనా మీరు నావెంటే నడిచారు. నా కంటే పెద్దవారికి ధన్యవాదాలు, యువతకు ప్రేమాశీస్సులు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’ అని సోనియా తన సందేశం పంపారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలుచేసిన మరుసటి రోజు సోనియా తన నియోజకవర్గ ప్రజలను గుర్తుచేసుకుంటూ లేఖ రాయడం గమనార్హం. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ఈసారి రాయ్బరేలీ నుంచి సార్వత్రిక సమరంలో నిలబడతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కేసీఆర్ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో వద్దిరాజు గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి దఫాలో రవిచంద్ర రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. -
రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆఖరికి చేతులెత్తేశారు. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. సంఖ్యాబలం లేక ఆ పార్టీ చతికిలబడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో బాబు వెనక్కి తగ్గారు. ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని బాబు భయపడిపోయారు. బలం లేకపోయినా ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు యత్నించినా.. ఆయన కుట్రలు, కుతంత్రాలు ఫలించలేదు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి తాజాగా తొలిసారి రాజ్యసభలో టీడీపీ ఉనికి కోల్పోనుంది. ఫలితంగా.. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతోంది. చదవండి: వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
RS: సోనియా గాంధీ నామినేషన్.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(77) రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఆ సమయంలో ఆమె వెంట కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అదే సమయంలో.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక బిహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी ने जयपुर, राजस्थान में राज्यसभा के लिए नामांकन पत्र भरा। pic.twitter.com/aPpWNndFJ5 — Congress (@INCIndia) February 14, 2024 #WATCH | Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra leave from Jaipur, Rajasthan. The Congress Parliamentary Party Chairperson filed her nomination for Rajya Sabha Election from Rajasthan today. pic.twitter.com/PxxeCC8hHr — ANI (@ANI) February 14, 2024 రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అందులో ఒకటి కాంగ్రెస్కు దక్కనుంది. నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం సోనియా ఆమె రాయ్ బరేలీ లోక్సభ స్థానానికి ఎంపీగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం లోక్సభకు ఐదుసార్లు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె తనయ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుమ.. ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. వయసురిత్యా.. అలాగే అనారోగ్య కారణాలతోనే ఆమె పార్టీ కార్యకలాపాలకు(ఎన్నికల ప్రచారంతో సహా) దూరంగా ఉంటూ వస్తున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
Advertisement