-
రాఫెల్ ఒప్పందంపై మళ్లీ మొదలైన రగడ..
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ద విమానాలపై రగడ మళ్లీ మొదలైంది. రాఫెల్ ఒప్పందంపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. 59 వేల కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2106లో భారత్–ఫ్రాన్స్ ఒప్పందం మధ్య కుదిరింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి బాహాటంగా బయటపడిందన్నారు. రిలయన్స్-డసాల్ట్ డీల్లో అన్ని సాక్ష్యాధారాలను ఫ్రెంచ్ వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ బయటపెట్టిందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఇక జేపీసీ దర్యాప్తునకు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. తాజా నివేదికల ఆధారంగా ఫ్రాన్స్ జాతీయ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించినట్లు మీడియాపార్ట్ తెలిపింది. ఇన్ఫ్రా, డసాల్ట్ ఏవియేషన్ కలిసి డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయని, దీనికి సంబంధించిన ఒప్పందం వివరాలన్నిటినీ ఈ వెబ్సైట్ వెల్లడించిందని తెలిపారు. ఈ అంశాలను అప్పటి ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయీస్ హొల్లాండ్ స్టేట్మెంట్ బలపరుస్తోందని తెలిపారు. డసాల్ట్ ఇండస్ట్రియల్ పార్టనర్గా రిలయన్స్ను నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుందని హొల్లాండ్ చెప్పారన్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్కు ఎటువంటి అవకాశం లేదని చెప్పారన్నారు. -
రఫేల్ రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం తీర్పు..
న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందానికి క్లీన్ చిట్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్దానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన సుప్రీం బెంచ్ తీర్పును వెల్లడిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 14న రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై మే 10న అన్ని పక్షాల వాదనలు విన్న మీదట సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ల మధ్య కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతర వివరాలతో కూడిన పత్రాలను సుప్రీం కోర్టు పరిశీలించిన మీదట ఈ ఒప్పందానికి సర్వోన్నత న్యాయస్ధానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రఫేల్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
రఫేల్ రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
రాఫెల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
‘రాహుల్ పాకిస్తాన్నే నమ్ముతారు’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ అవాస్తవాలను ప్రచారంలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత వాయుసేనపై రాహుల్కు విశ్వాసం లేదని, ఆయన సుప్రీం కోర్టు, కాగ్ను కూడా నమ్మరని..మరి పాకిస్తాన్ను మాత్రమే రాహుల్ విశ్వసిస్తారా అని కేంద్ర మంత్రి నిలదీశారు. రఫేల్ పోటీదారులకు అనుకూలంగా రాహుల్ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. కాగా రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందం పత్రాలు గల్లంతయ్యాయని మీడియాపై మోదీ సర్కార్ ఆరోపణలు గుప్పిస్తోందని, రూ 30,000 కోట్ల రఫేల్ ఒప్పందంలో ప్రమేయం కలిగిన వారిపై మాత్రం విచారణ చేపట్టడం లేదని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోదీ సహా ఈ ఒప్పందంలో భాగమైన వారందరినీ విచారించాలని డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement