-
‘మహా’ నగరంలో ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, ముంబై: నగరవ్యాప్తంగా ఉన్న వీధి స్తంభాలకు ఎల్ఈడీ విద్యుద్దీపాలు అమర్చనున్నారు. దీనికి సంబంధించి బీఎంసీకి పంపిన ప్రతిపాదన తుది దశలో ఉంటుందని బెస్ట్ సంస్థ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్ గుప్తా చెప్పారు. ‘వచ్చే రెండేళ్లలో నగర రహదారులపై ఉన్న వీధి విద్యుత్ స్తంభాలపై ఎల్ఈడీ బల్బులు దర్శనమివ్వనున్నాయి. వీటివల్ల 40 శాతం విద్యుత్ పొదుపు అవుతుంద’ని ఆయన అన్నారు. నగరంలో సుమారు 52వేల స్ట్రీట్ లైట్లకు బెస్ట్ విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటన్నింటిని మార్చాలంటే కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుందని గుప్తా వివరించారు. ‘సోడియం ఫిలమింట్తో వెలిగే దీపాలతో పోలిస్తే ఎల్ఈడీ బల్బులు కొనుగోలు చేయాలంటే మూడు, నాలుగు రేట్లు వెచ్చించాలి. అయితే ఎల్ఈడీ బల్బుల జీవిత కాలం మన్నికగా ఉంటుంది. విద్యుత్ ఆదా కూడా అదే స్థాయిలో ఉంటుంద’ని ఆయన వివరించారు. కాగా, బెస్ట్ సంస్థ ఇటీవల నిర్వహించిన సమావేశంలో సోడియంతో వెలిగే బల్బులు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. ఆ సమయంలో సమితి సభ్యులు ప్రమోద్ మాంద్రేకర్, కేదార్ హోబాల్కర్ ఎల్ఈడీ బల్బులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. దీనికి అందరూ సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. బీఎంసీకి చేరిన ఈ ప్రతిపాదనను తుది దశలో ఉందని, త్వరలో అనుమతి లభిస్తుందని గుప్తా వెల్లడించారు. ఈ బల్బుల వల్ల ఎంతమేర విద్యుత్ ఆదా అవుతుంది...? వీటిని బిగించేందుకు ఎంత ఖర్చవుతుంది...? తదితరాలు తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా ఓ బెస్ట్ బస్డిపోలో ఓ బల్బును అధికారులు అమర్చారు. త్వరలో పూర్తి వివరాలతో కూడిన జాబితా బీఎంసీకి అందివ్వనున్నారు. -
సుదీర్ఘకాలం తర్వాత..
నగరంలో కొత్త బస్సు డిపో ఏర్పాటు 18 ఏళ్ల తర్వాత గోరేగావ్-మలాడ్ల మధ్య నిర్మాణం లక్షమంది ప్రయాణికులకు ఉపయోగం సాక్షి, ముంబై: నగరంలో 18 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మరో కొత్త బస్ డిపోను నిర్మించనున్నారు. గోరేగావ్-మలాడ్ల మధ్య నగరవాసులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంచేందుకు కొత్త బస్డిపోను ఏర్పాటు చేయనున్నట్లు బెస్ట్ జనరల్ మేనేజర్ ఓంప్రకాష్ గుప్తా వెల్లడించారు. నగరంలో ఇప్పటికే 25 డిపోలుండగా ఇది 26వది. ఈ బస్డిపోను మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. గోరేగావ్-మలాడ్ల మధ్య ఉన్న చించోలి వద్ద దాదాపు 18,440 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.9.10 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 115 బస్సులను ఉంచనున్నారు. 14 కొత్త రూట్ల మధ్య ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా గోరేగావ్, మలాడ్ల మధ్య ఐటీ హబ్లు, మాల్స్, రెసిడెన్షియల్ కాలనీలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ బస్ డిపోను కొత్తగా నిర్మించనున్నట్లు గుప్తా వివరించారు. ఈ డిపో వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న లక్షకు పైగా ప్రయాణికులు లబ్ధి పొందనున్నారని ఆయన చెప్పారు. కాగా, 1996లో తూర్పు జోగేశ్వరిలో చివరిసారిగా ‘మజస్’ డిపోను ప్రారంభించారు. తిరిగి 18 ఏళ్ల తర్వాత కొత్తగా ఈ బస్ డిపో నిర్మాణం చేపడుతున్నారు. ఇదిలా వుండగా చించోలి డిపో నుంచి బస్సులు కేవలం సమీప రైల్వేస్టేషన్ వద్దకే కాకుండా ఐటీ సెంటర్లకు కూడా తరచూ సేవలు అందించనున్నాయి. అంతేకాకుండా నగర తూర్పు శివారు ప్రాంతాలైన ఘాట్కోపర్, ములుండ్లకు కూడా తమ సేవలను అందించనున్నాయి. అంతేకాకుండా ఈ డిపో నుంచి వడాలా, సైన్ ప్రాంతాలకు కూడా రోజూ బస్సులను నడపనున్నట్లు అధికారి వెల్లడించారు. అంతేకాకుండా మార్చి ఒకటో తేదీన బెస్ట్ సంస్థ దహిసర్లోని కండర్పాడా వద్ద మరో కొత్త బస్స్టేషన్ను ప్రారంభించనుంది. ఇటీవల జరిగిన బెస్ట్ కమిటీ సమావేశంలో కొత్త బస్ డిపో, అదేవిధంగా బస్ స్టేషన్ల ప్రతిపాదన ఆమోదం పొందింది. ఈ సందర్భంగా బెస్ట్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. గోరేగావ్-మలాడ్, గోరియా ప్రాంతాల్లో చాలా మంది బస్సులను ఆశ్రయిస్తుంటారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సర్వీసులను అందజేస్తున్నామన్నారు. అయితే కొత్తగా నిర్మించబోయే బస్ డిపో వల్ల మాల్వానీ, గోరాయి, గోరేగావ్ డిపోలకు కొంత మేర భారం తగ్గనుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల స్పందనను బట్టి తాము బస్సులను పెంచడమేకాకుండా కొత్త రూట్లను కూడా పరిచయం చేస్తామన్నారు. అలాగే బెస్ట్ మరో 426 కొత్త నాన్ ఏసీ బస్సులను కొనుగోలు చేయనుందని గుప్తా స్పష్టం చేశారు. వీటి కొనుగోలు తర్వాత పాత బస్సులను తొలగిస్తామన్నారు. కొత్త డిపోలో కంప్యూటరైజ్డ్ షెడ్యూల్ను అందుబాటులో ఉంచనున్నామని వివరించారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
హమాస్ చెరలో బందీలుగా.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా.. రాహుల్ నిర్ణయంపైనే ఉత్కంఠ
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
Advertisement