-
ఆలయ భూములపై ఘర్షణ: ముగ్గురు మృతి
దియోరియా: ఉత్తరప్రదేశ్లో దేవాలయ భూముల ఆక్రమణకు సంబంధించి జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించారు. దియోరియా జిల్లాలోని సరౌరా గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దేవాలయం పక్కన పెట్రోల్ పంపు యజమాని గోడ కట్టడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఆ భూమిని అతను ఆక్రమిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పెట్రోల్ పంపు సిబ్బంది మధ్య గొడవ ముదిరి హింసాత్మకంగా మారింది. మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో నలుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. -
భూములు బోలెడు
నెల్లూరు : జిల్లాలో ఖాళీ భూములు భారీగా ఉన్నా.. ఆక్రమణల చెరలో చిక్కాయి. ఫలితంగా ప్రజావసరాలకు.. పారిశ్రామిక అవసరాలకు భూముల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునే దిశగా రెవెన్యూ యంత్రాంగం అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్ కమిటీ పర్యటన అనంతరం ఖాళీ భూముల గుర్తిం పు.. వాటి రక్షణపై కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు దృష్టి సారించారు. ల్యాండ్ బ్యాంక్ పేరిట భూముల సంరక్షణ దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా ఖాళీ భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబు తున్నాయి. రెండు నెలల క్రితం నీతి ఆయోగ్ కమిటీ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ బృందం కృష్ణపట్నం తీరంలో పర్యటించి ఖాళీ భూముల విని యోగం, తదితర అంశాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రంగంలోకి దిగి వివాదాలు, కోర్టు పరిధిలో లేని 26 వేల ఎకరాల ఖాళీ భూములను గుర్తించారు. మరో 44 వేల ఎకరాలు ఉన్నప్పటికీ వాటిలో అధిక శాతం ఆక్రమణ చెరలో ఉన్నట్టు గుర్తించారు. మరికొన్ని కోర్టు వివాదాలు, ఇతర సమస్యలతో ముడిపడి ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు జిల్లాలోని ఖాళీ భూములను గుర్తించి.. వాటి సంరక్షణకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, దేవాదాయ, పోరంబోకు తదితర అన్నిరకాల భూముల్ని గుర్తించే ప్రక్రియను రెండు నెలల క్రితం చేపట్టారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు సమీపంలోని మండలాల్లో ఎక్కువగా భూములు ఉన్నట్టు గుర్తించారు. కోర్టు వివాదాలు, ఇతర ఇబ్బందులు లేని భూములు 26 వేల ఎకరాలు ఉండగా.. వాటిలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆ«ధీనంలో ఉన్నాయి. మరికొన్ని భూములను పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట ఖాళీగా ఉంచారు. ఇదిలావుంటే.. రిలయన్స్తో సహా అనేక పరిశ్రమలకు గతంలో భూములు కేటాయించారు. వీటిలో కొన్ని పరిశ్రమలు స్థాపన కాలేదు. ప్రస్తుతం వివాదం లేకుండా నేలటూరుపాలెంలో రిలయన్స్ ఆధీనంలో ఉన్న 44 ఎకరాల భూమిని అధి కారులు స్వాధీనం చేసుకున్నారు. ముత్తుకూరు మండలంలో 350 ఎకరాల చౌడు భూములు ఉన్నట్టు గుర్తిం చారు. గరిమెనపెంట, మర్రిపాడు, రాపూరు మండలాల్లో వందలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాం డ్ రికార్డ్ ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం కొత్తగా సాఫ్ట్వేర్ను రూపొం దించి.. ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కేంద్ర బృందాల పరిశీలన ఏడాది జూన్ 12న కృష్ణపట్నం తీర ప్రాంతంలో నీతిఆయోగ్ కమిటీ పర్యటించింది. జిల్లాలో ఖాళీ భూములు, పరిశ్రమల స్థాపనకు ఉన్న సౌకర్యాలు, ఇతర అంశాలపై ఏరియల్ సర్వే నిర్వహించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారుల బృందం కూడా పర్యటించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ఈ బృందాలు పరిశీలించాయి.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement