-
ఆరిపోతున్న ఆరోగ్యశ్రీ దీపం
సాక్షి, అమరావతి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించిన ఆరోగ్యశ్రీ దీపం ప్రస్తుత టీడీపీ పాలనలో ఆరిపోయే దశకొచ్చింది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) జాబితాలో వైద్యమందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడమే దీనికి కారణం. గత నాలుగు నెలల్లో రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలే చెబుతుండటం గమనార్హం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను ఆపేశాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే డిసెంబర్ 9 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఏపీ సూపర్స్పెషాలిటీస్ అసోసియేషన్లు సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి. పేద రోగులపై ఆంక్షల దాడి మరోవైపు ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం విధించిన ఆంక్షలతో పేద రోగులు అల్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లినవారు మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోతే వారిని ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఆయా కార్డులకు అనుమతి తీసుకోవాలన్నా అవకాశం ఉండటం లేదు. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వెళుతున్న బాధితులకు వైద్యమందించడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ రేట్లు తక్కువగా ఉండటంతో వైద్యం అందించలేమని చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీకే కాకుండా ఈహెచ్ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్)కు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని ఆస్పత్రి యాజమాన్యాలు వాపోతున్నాయి. రోజూ వందలాది మంది ఉద్యోగులు వైద్యానికి వస్తున్నా నగదురహిత వైద్యం చేయడానికి ఆస్పత్రులు అంగీకరించడం లేదు. ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 35 లక్షల మంది పైనే సర్కారు తీరుతో వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దశలవారీగా చెల్లిస్తాం గత కొంత కాలంగా ఆస్పత్రుల యాజమాన్యాలు బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి. కార్డియాలజీ, ట్రామా కేసులు ఎక్కువ పెండింగ్లో ఉన్నాయి. దశలవారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తాం. తద్వారా సేవలకు విఘాతం కలగకుండా చూస్తాం. – డా.ఎన్.సుబ్బారావు, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి సీఈవో -
వెలగని విద్యాజ్యోతి
♦ గిరిజన విద్యార్థులకు అందని ఉపకార వేతనాలు ♦ 3వేల మందికి పైగా ఎదురుచూపులే ♦ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ గిరిజన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ఎన్టీఆర్ విద్యాజ్యోతి పథకం. ఇందులో భాగంగా గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాల్ని అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. ప్రీమెట్రిక్ అంటే 9, 10 తరగతి చదివే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.350 ఇస్తారు. పదినెలలకు రూ.3500, అదనంగా మరో రూ.1000 పుస్తకాలు ఇతర ఖర్చులకు చెల్లిస్తారు. డేస్కాలర్స్కు నెలకు రూ.150 చొప్పున పదినెలలకు రూ.1500, మరో రూ.750 అదనంగా పుస్తకాల కోసం చెల్లించాలి. 5 నుంచి పదోతరగతి వరకు చదివే బాలురకు వంద రూపాయిలు చొప్పున నెలకు రూ. వెయ్యి, అలాగే బాలికలకు రూ.150 నెలకు మొత్తం పది నెలలకు రూ.1500లు చెల్లించాలి. ఎటువంటి ఉపకార వేతనాలు ఏడాదిగా అందడం లేదని గిరిజన విద్యార్థులు వాపోతున్నారు. మూడు నెలలు గడిచినా.. ఈ విద్యాసంవత్సరం ఆరంభమై మూడు నెలలు గడుస్తున్నా గత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు ఇంతవరకూ చెల్లించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో సుమారు 30 వేల మంది ఉపకార వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ మండలాల్లో గిరిజన ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న 3 వేల మందికి పైగా ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు కోటి రూపాయలకు పైగా నిధులు విడుదల కావాల్సింది. డిప్యూటీ డీఈవో ఏమన్నారంటే.. ఈ విషయమై డిప్యూటీడీఈవో జి.రామ్మోహన్రావు మాట్లాడుతూ.. బడ్జెట్ విడుదల అయ్యిందని, ట్రెజరీలో పెండింగ్ ఉందని త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్కాలర్షిప్ చెల్లింపుల్లో జాప్యమెందుకు? విద్యార్థుల ఉపకార వేతనాల చెల్లింపుల్లో జాప్యం తగదు. ఇప్పటికే గతేడాది స్కాలర్ షిప్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద విద్యార్థులు వారికి అవసరమైన పుస్తకాలు, ఇతర ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు అవసరం ఉంటుంది. వెంటనే చెల్లించాలి. – విశ్వాసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement