-
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
కరీనా కపూర్ హీరోయిన్గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్రస్తావన సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన నటి మీనాక్షి థాపర్ గురించి! ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇదే చివరి సినిమా! చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్రత్యేక కథనం..సినిమా ఛాన్స్కు ముందు1984 అక్టోబర్ 4న మీనాక్షి థాపర్ జన్మించింది. డెహ్రాడూన్లో తన విద్యాభ్యాసం జరిగింది. సినిమాల మీద ఆసక్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావడానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2011లో 404 అనే హారర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవలేదు.సెట్స్లో అదృశ్యంతర్వాత మధుర్ భండార్కర్ సినిమా 'హీరోయిన్'లో ఛాన్స్ వచ్చింది. కరీనా కపూర్తో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని సంబరపడిపోయింది. త్వరలోనే నటిగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని భావించింది. అంతలోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్కి రాగా అక్కడే ఆమె అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న నటి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు డిమాండ్అందులో మీనాక్షి మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సురిన్తో కలిసి అలహాబాద్కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మూడు రోజుల తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 లక్షలు పంపండి.. మూడు రోజులు మాత్రమే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే తను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. రోజులు గడుస్తున్నాఈ బెదిరింపులకు నటి తల్లి లొంగలేదు. ఆర్మీలో పని చేస్తున్న తన కుమారుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. రోజులు గడుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొరకలేదు. ఒకరోజు అమిత్, ప్రీతి(వీరిద్దరూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్కు చేరుకున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీనాక్షిని హత్య చేసినట్లు అంగీకరించాడు.శరీరాన్ని ముక్కలుగాఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన తర్వా ఆమె తల, మొండెం వేరు చేశారు. అలహాబాద్లో ప్రీతి ఇంటికి దగ్గర్లో ఓ సెప్టిక్ ట్యాంక్లో తన శరీరాన్ని ముక్కలుగా కోసి పడేశారు. తలను అలహాబాద్ నుంచి లక్నోకు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో నుంచి అడవిలో విసిరేశారు. 2018లో న్యాయస్థానంలో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.స్నేహితుల అత్యాశ వల్ల 27 ఏళ్ల వయసుకే నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక తల్లికి తీరని కడుపుకోత మిగిలింది.చదవండి: సింగర్పై బాటిల్ విసిరిన ఆకతాయి.. అయినా సహనం కోల్పోకుండా.. -
అమెరికాలో కిడ్నాపైన నాచారం విద్యార్థి అర్ఫాత్ మృతి
మల్లాపూర్ (హైదరాబాద్): అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్లోని నాచారానికి చెందిన విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) ఓహాయోలోని క్లీవ్ల్యాండ్లో మృతి చెందాడు. అక్కడి సరస్సులో లభ్యమైన మృతదేహం నడుము చుట్టూ పాస్పోర్ట్, మొబైల్ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అర్ఫాత్గా గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ‘ఎక్స్’లో వెల్లడించింది. అర్ఫాత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. అర్ఫాత్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. మార్చి 7న కిడ్నాప్: నాచారానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ గత మార్చి 7న అదృశ్యమయ్యాడు, ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన అర్ఫాత్ క్లీవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయి తే కిడ్నాప్నకు కొద్ది రోజుల ముందు తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని అర్ఫాత్ తన తండ్రి మహమ్మద్ సలీంకు ఫోన్ చేసి చెప్పాడు, దీంతో వారు ఆందోళన చెందారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అర్ఫాత్ కిడ్నాప్ అయ్యాడు. 1200 డాలర్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారని, లేకుంటే అర్ఫాత్ కిడ్నీలు విక్రయిస్తామని కిడ్నాప్ చేసినవారు సలీంను ఫోన్లో బెదిరించారు. అయితే అర్ఫాత్ను రక్షించుకునేందుకు తండ్రి సలీం అంగీకరించి,...అర్ఫాత్ మీ దగ్గర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. దీంతో కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ పెట్టేశారని, వారి నుంచి మళ్లీ కాల్ రాలేదని సలీం తెలిపారు. కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్లో ఎవరిదో ఏడుపు వినిపించిందని..అదే చివరి గొంతు అన్నారు. కిడ్నాపర్ల ఫోన్నంబరు అమెరికాలోని తమ బంధువులకు పంపి క్లీవ్ల్యాండ్ పోలీసులకు అందజేయాలని సలీం చెప్పారు. అర్ఫాత్ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8న క్లీవ్ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఇది జరిగిన దాదాపు నెలరోజుల తర్వాత విషాదవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు రోదిస్తూ చెప్పారు. -
HYD: కిడ్నాప్నకు గురైన పాప సేఫ్..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్నకు గురైన తొమ్మిది నెలల పాప సురక్షితమని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్లో జహీరాబాద్లో బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అయితే, కిడ్నాప్ చేసిన మహిళను సహనాజ్ఖాన్గా గుర్తించారు. బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ మహిళ జహీరాబాద్లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ పోలీస్ స్టేషన్కు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు చేరుకున్నారు. అనంతరం పాపను పేరెంట్స్కు అప్పగించారు. -
పాతబస్తీలో 9నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం
-
ఎయిర్ పోర్ట్ నుండి నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారు
-
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
కథ..స్క్రీన్ ప్లే..డైరెక్షన్..అంత చెల్లె
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
-
టీచర్ను కిడ్నాప్.. తలపై తుపాకీతో బెదిరించి కూతురితో పెళ్లి
బిహార్లో వింత పెళ్లి జరిగింది. ఓ టీచర్ను కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కుతురితో వివాహం జరిపించాడు కిడ్నాపర్. బీహార్లోని వైశాలి జిల్లాలో ఈ ఉదాంతం వెలుగుచూసింది. వివరాలు.. గౌతమ్ కుమార్ ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పటేపూర్లోని రేపురాలోని పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తునాడు. . బుధవారం అతను పాఠశాలలో ఉండగా.. ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో బలవంతంగా వివాహం చేశారు. వివాహానికి నిరాకరించింనందుకు బాధితుడిపై దాడి కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన ఉపాధ్యాయుడిని గాలించే పనిలో పడ్డారు. గౌతమ్ కుమార్ కుటుంబ సభ్యులు రాజేష్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి రాయ్ కుమార్తె చాందినితో వివాహం చేసి ఉంటారని ఆరోపించారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బిహార్లో పకడ్వా వివాహం(ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం) ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గతేడాది అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేసేందుకు వచ్చిన పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెగుసరాయ్లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్లో ఓ ఇంజనీర్కు సంబంధించిన ఇలాంటి ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్లో జూనియర్ మేనేజర్గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. -
కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్, డేటింగ్ వల: అదే కొంపముంచింది!
సోషల్ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్ డేటింగ్ టిండర్లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. 2018లో జైపూర్లో షాకింగ్ సంఘటన జరిగింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు 27 ఏళ్ల ప్రియా సేథ్తో టిండర్ యాప్ ద్వారా పరిచయమైంది. దుష్యంత్ తను అసలు పేరు కాకుండా వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని, ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్మేన్ అని గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి ప్రొఫైల్ చూసిన ప్రియా పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం నటించింది. దీంతో దుష్యంత్ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు కొనసాగింది. చివరికి కలవాలని ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. ఇక్కడే అతడిని కిడ్నాప్ చేసిన పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలన్న తన ప్లాన్ను ప్రియా అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్ రిలేషన్ షిప్లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్ చే చేసి జైపూర్లోని అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్ను అమలు చేశారు. దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసిన 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ దగ్గరనున్న ఏటీఎం కార్డునుంచి రూ.20వేలు లాగేసుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్ మృతదేహాన్ని పోలీసులు అదే ఏడాది మే 4న గుర్తించారు. ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో డేటింగ్ ద్వారా ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ. -
గుంటూరు జీజీహెచ్ లో శిశువు కిడ్నాప్
-
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని చెన్నై ప్లాట్ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్ బ్రిడ్జి కింద బాలుడిని గుర్తించారు. బ్రిడ్జి కింద చిన్నారిని పడుకోబెట్టి బిక్షాటన చేసిన కిడ్నాపర్.. పోలీసులను చూసి పొదల్లోకి వదిలి పారిపోయాడు. ఆరు గంటలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెగ్గింగ్ కోసమే కిడ్నాపన్ చేసినట్లు తేలింది. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యిదేళ్ల బాలుడు కిడ్నప్కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన దుర్గేశ్.. అలిసిపోయి ఉండటంతో స్టేషన్లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. దీంతో స్టేషన్లో ఉన్న జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు. చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! -
నిలోఫర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. తీవ్రంగా శ్రమించి ఈ కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలుడ్ని సురక్షితంగా తీసుకొచ్చారు.సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు మమతకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లైనా పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. తమ కుమారుడి ఆరోగ్యం బాలేదంటూ నిలోఫర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఎవరైనా బిడ్డను అదను చూసి ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. ఆస్పత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుంటూ.. ఫైసల్ఖాన్ అనే చిన్నారి మీద కన్నేశారు. నాలుగు రోజుల కిందట.. ఫైసల్ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పరారయ్యారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఈ జంటకు సహకరించారు. బిడ్డ కనిపించకపోయే సరికి తల్లి విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది పోలీసులకు. చివరకి.. ఆస్పత్రి సమీపంలోనే సీసీ ఫుటేజీల ద్వారా కేసు చేధించగలిగారు. జేబీఎస్ అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డి ఇలా సాగింది కిడ్నాపర్ల ప్రయాణం. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జంటను పట్టుకుని.. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. వింత వ్యాధి.. నవ్వాడనే ఉద్దేశంతోనే.. ! ఈ నెల 14తేదీన నిలోఫర్ లో కిడ్నాప్ గురైన ఆరు నెలల బాబు కిడ్నాప్ కేసును ఛేదించాం. చికిత్స కోసం ఫారీదా బేగం తన కొడుకు ఫైసల్ఖాన్ను తీసుకొని వచ్చింది. భోజనం కోసం బయటకి తల్లి వెళ్ళింది. బాలుడు తల్లి భోజనం కోసం వెళ్లగా, వెంటనే బాలుడి ని కిడ్నాప్ చేశారు. శ్రీను , మమత అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. గత కాలంగా వీళ్లిద్దరికీ పిల్లలు పుట్టి చనిపోతున్నారు. 15 రోజులు క్రితం కూడా దంపతులకు బాలుడు పుట్టారు. అనారోగ్యంతో నిలోఫర్లొనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ జంట.. అధిక రక్త స్నిగ్థత వ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది. దీని ప్రకారం.. మగ పిల్లలు పుడితే వెంటనే చనిపోతారు. కేవలం ఆడ పిల్ల పుడితేనే బతుకుతారు. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు మృతి చెందారు, మూడో పిల్లోడు కూడా చనిపోతాడని భావించారు. అందుకే నిలోఫర్లో ఓ పక్క కొడుకు చికిత్స తీసుకుంటుండగానే.. ప్లాన్ ప్రకారం ఫైసల్ను ఎత్తుకెళ్లారు. ఈ జంట బాన్సువాడ టౌన్లో కిరాయికి ఇల్లు తీసుకుని ఆ ఎత్తుకొచ్చిన బిడ్డతో ఉన్నారు. నిలోఫర్ ఆస్పత్రి నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి కేసును చేధించారు. ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని ఫైసల్ కిడ్నాప్గురించి మమత చెబుతోంది. బాలుడుకి రెండు రోజులు నిందితురాలు మమతనే పాలు ఇచ్చింది అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్కు గురైంది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వివరాలు.. ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఆటోలో వెళ్తున్న దంపతులను కారులో ఛేజ్ చేసిన దుండగులు..భర్తపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. భార్యను ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి కారణాలతోనే తనపై దాడి చేసి, భార్యను కిడ్నాప్ చేశారని భర్త సన్నీ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..? -
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
అమరావతి: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని సాక్ష్యాధారాలతో సహా మరోసారి నిరూపితమైంది. నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యధాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 867గా ఉంది. శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6 గా ఉంది. రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 14714 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. 10680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ 10252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 18వ స్థానంలో ఉంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సరైన అవగాహన లేకుండా పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరైనా తెలివిగల్లోళ్లు పవన్ పక్కన ఉంటే నివేదికను చక్కగా వివరించే అవకాశమైనా ఉండేది. విషయ సంగ్రాహక శక్తి తక్కువగా ఉన్నందునో, వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కొరవడినందునో.. ప్రతి విషయాన్ని వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తూ పవన్ ఎప్పటికప్పుడు జనం ముందు నవ్వులపాలవుతున్నారు. -
ఘట్ కేసర్ లో కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి సురక్షితం
-
GST అధికారుల కిడ్నాప్ కేసులో కీలక విషయాలు
-
మేడ్చల్ జిల్లాలో నాలుగేళ్ల కృష్ణవేణి కిడ్నాప్
-
హైదరాబాద్ లో GST ఆఫీసర్ల కిడ్నాప్ కేసులో టీడీపీ నేత ముజీబ్
-
జీఎస్టీ అధికారుల కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్.. పోలీసులు ఆ కేసును చేధించిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్.. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్లను ఫోన్లో కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్నగర్లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణా నగర్లో ఫేక్ జీఎస్టీ నంబర్తో gst కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు..GST ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మణి శర్మ , ఆనంద్ లు వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు , మరో ముగ్గురు కలిసి... ఫార్చ్యూనర్ కార్ లో కిడ్నాప్ చేశారు. GST అధికారుల ఐడీ కార్డు లు చింపి..వారి పై దాడి చేశారు. మాకు సమాచారం అందగానే... దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నాము. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్.. నిందితులు టీడీపీ నేత అనుచరులు? -
హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచార యత్నం
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- ఈసీ ద్వంద్వ వైఖరి
- ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
- నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
- Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
Advertisement