-
ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు
అడ్డగుట్ట, బన్సీలాల్పేట్, నాంపల్లి: లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు బీఆర్ఎస్కు వస్తే ఏడాది లోపే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్లో, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బన్సీలాల్పేట్ కమాన్ వద్ద, నాంపల్లి నియోజకవర్గం నోబుల్ టాకీస్ చౌరస్తాలో జరిగిన రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిందేమీ లేదని, ఇక చేసేది కూడా ఏమీ లేదని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. ఇక పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజారిటీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ చక్రం తిప్పుతారన్నారు.తెలంగాణకు మోదీ ఏం చేశారుమాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జన్ధన్ ఖాతాలు తెరిస్తే ప్రతీ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని, ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని, నల్లధ నం వెలికితీస్తామని చెప్పిన మోదీని.. ఇప్పుడు అడిగితే తెల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్ చేసిందేంటి?ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఒకటే ఒక్క పని కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేయడమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు రూపాయి పని కూడా చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కరకు రాని చుట్టమని నిందించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలను కష్టాల్లోకి తోసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇవి తప్పనికిషన్ రెడ్డి రుజువుచేస్తే రేపటికల్లా నా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.గ్రేటర్ ప్రజలు గ్రేట్గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో తెలివిని ప్రదర్శించి బీఆర్ఎస్కు 16 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని, ఆ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ప్రజలు అప్పుడే కరెంట్ కోతలు...నీటి కష్టాలతో బాధపడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల తరువాత కచ్చితంగా రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ ఆరోపించారు. ’’రాహుల్ గాంధీ ఏమో మోదీని చౌకీదార్ చోర్ అంటే మోదీ బడే భాయ్ అని రేవంత్రెడ్డి అంటున్నారు.రాహుల్ ఏమో గౌతమ్ అదానీ ఫ్రాడ్ హై అని అంటే... గౌతమ్ అదానీ హమారా ఫ్రెండ్ హై అని రేవంత్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ లేదనీ. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం సరికాదని రాహుల్ గాంధీ అంటే... కేసీఆర్ కూతురును అరెస్టు చేయడం కరెక్టేనని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఈ మాటలను బట్టి రేవంత్ తీరు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు’’ అని కేటీఆర్ అన్నారు. -
ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చెయ్.. రాజీనామా ఇస్తా..!
సాక్షి,సిద్దిపేట/చండూరు/అక్కన్నపేట(హుస్నాబాద్): ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేస్తారా?’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ చేశారు. రేవంత్రెడ్డి రాజీనామా పత్రాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి పంపించాలని... పది నిమిషాల్లో నేనూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపిస్తానని..ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో, నల్లగొండలో, అదే జిల్లా చండూరులో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోగానే రైతులకు రుణమాఫీ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రుణమాఫీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు.వారిది ఢిల్లీకి గులాంగిరీ!రేవంత్రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. ఏం చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. తోడు పెళ్లికొడుకులా ఉప ముఖ్యమంత్రిని వెంట తీసుకుని ఇప్పటివరకు 20 ట్రిప్పులు పోయారు. అదే కేసీఆర్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా సేవలు అందించారు. స్వార్థం కోసం కొందరు నాయకులు పార్టీ మారొచ్చు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్తో ఉన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను పాతాళానికి తొక్కాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి’’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు.కేసీఆర్ యాత్రను చూసి వణుకుకేసీఆర్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. చీకటి ఒప్పందంతో చెరో 8 సీట్లు పంచుకున్నాయి. ఒకరేమో దేవుడిని చూపించి, మరొకరు దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ప్రధాని ఆరోపిస్తున్నారు. బీజేపీతో రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్రెడ్డి అంటున్నారు. అవేమీ జరగబోవు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. మేం వాళ్ల ఆటలు సాగనివ్వబోం. -
స్పీడందుకున్న కారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త వెనుకంజగా కనిపించిన కారు పార్టీలో తిరిగి కొత్త జోరు కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పార్టీకి పునరై్వభవం వస్తుందన్న ధీమా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా.. కొందరు నేతలు పార్టీని వీడటం, ఎంపీలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల తరఫున లోక్సభ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందని అంటున్నాయి. కానీ కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, తన ప్రసంగాల్లో కాంగ్రెస్, బీజేపీలపై సంధిస్తున్న విమర్శనా్రస్తాలు.. ఉద్యమకాలం నాటి సభలను తలపిస్తున్నాయని నేతలు చెప్తున్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా.. మళ్లీ మీరే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ గణనీయమైన స్థాయిలోనే లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందన్న నమ్మకం వస్తోందని కార్యకర్తలు ఆశావహంగా ఉన్నారు. జనం నుంచి మంచి స్పందనతో.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలకు బదులు క్షేత్రస్థాయి కార్యక్రమాలకే కేసీఆర్ మొగ్గుచూపారు. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజులపాటు బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.కేసీఆర్కు మహిళలు మంగళ హారతులు, డప్పులు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతున్నారని.. బస్సుయాత్ర సాగే మార్గంలో రైతులు, యువకులు కేసీఆర్ను చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల కోసం పార్టీపరంగా జన సమీకరణ చేస్తున్నా.. అంచనాలకు మించి జనం కూడా వస్తున్నారని అంటున్నాయి. స్థానికులతో మమేకం.. రాత్రి బసతోనూ.. బస్సుయాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులతో, వివిధ వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రోడ్డు పక్కన హోటళ్ల వద్ద ఆగి చాయ్ తాగుతూ, స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. రైతులతో ముచ్చటిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. తాను చేస్తున్న పోరాటంలో కలసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రోడ్ షోలు ముగిసిన తర్వాత కేసీఆర్ స్థానికంగా బస చేస్తున్నారు.ఆ సమయంలో, మరుసటి రోజు ఉదయం.. స్థానిక నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ముఖ్య నేతల నివాసానికి వెళ్లి కలుస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలను మరింతగా ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీలో సమన్వయం.. ప్రచార వ్యూహాలు కూడారాత్రి బస వద్ద సంబంధిత లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ప్రచార తీరుతెన్నులపై సమీక్షిస్తున్నారు. బూత్ స్థాయి వరకు ప్రచారంతోపాటు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ నేరుగా కలసి చేస్తున్న సూచనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకం కనిపిస్తోందని అంటున్నారు.ఈ క్రమంలోనే బస్సుయాత్ర, రోడ్ షోలను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని.. నియోజకవర్గాల్లో తమ సత్తా చూపాలని ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు భావిస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శనా్రస్తాలతో.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం.. తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటోందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ, రైతుబంధు, వరికి రూ.500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ.. బీఆర్ఎస్ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ.. కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు జోష్ నింపుతున్నాయని అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పడం ప్రభావం చూపుతోందని చెప్తున్నాయి. ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తామనే ధీమా! లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదంటూ కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా ప్రచార ఆరంభంలో విమర్శలు చేశాయి. కానీ కేసీఆర్ బస్సుయాత్ర, ప్రజా స్పందనతో ఆ అభిప్రాయాన్ని మార్చేశారన్న వాదన వినిపిస్తోంది. మొదట్లో బీఆర్ఎస్కు 8 సీట్లలో సానుకూలత ఉందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 12 సీట్ల వరకు వస్తాయని చెప్తుండటం గమనార్హం. ఈసారి కేంద్రంలో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్ఎస్కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తామని కూడా అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్తున్నాయని ఉదహరిస్తున్నారు. ఈసీ నిషేధంతో కాస్త లాభమే! కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. ఈసీ నిషేధంతో కాస్త లాభమే! కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. -
ప్రశ్నిస్తే.. గొంతు నొక్కారు!
సాక్షి, పెద్దపల్లి: చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాను మాట్లాడితే, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే.. తన గొంతు నొక్కేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం పెట్టించారని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదేమని నిలదీశారు.బీజేపీ, కాంగ్రెస్లలో ఎవరికి ఓటేసినా.. సింగరేణిని ముంచేసి, కార్మికుల నోట్లో మట్టికొడతాయని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ఈసీ పెట్టిన 48 గంటల నిషేధం అనంతరం శుక్రవారం రాత్రి రామగుండం పట్టణంలో తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నిషేధించిన నా గొంతు 48 గంటల తర్వాత మాట్లాడుతోంది. నేను ఏం చేశానని నా గొంతును నొక్కేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు రూ.375 కోట్లు విడుదల చేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు.. ‘ఇన్ని రోజులు దొబ్బితిన్నది చాలలేదా? పొయి నిరో«ద్లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నడు. మీకు చేనేత కార్మికులు అంత చులకనగా కనపడుతున్నారా? అధికారంలో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా.. అని కోపంలో ఒక్కమాట మాట్లాడిన. వాళ్ల మాటలు ఈసీకి కనిపించవు కేసీఆర్ బస్సుయాత్ర చేపడితే కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. వాళ్లు కుమ్మకై నన్ను ఆగబట్టేందుకు నాపై నిషేధం పెట్టారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కేంద్ర మంత్రి అమిత్ షా రోజూ దేవుడి బొమ్మను చేతిలో, నెత్తిన పెట్టుకుని మాట్లాడితే ఎన్నికల సంఘానికి కనిపించదు. డైరెక్టుగానే హిందువులు, ముస్లింలని దేశ ప్రధాని మోదీ మాట్లాడినా కనిపించదు.రాష్ట్ర సీఎంని ప్రజ లకు ఇచ్చిన వాగ్ధానాల అమలు ఏదని మేం అడిగితే.. గుడ్లు పీకి గోళీలు ఆడుతం, పేగులు తీసి మెడలో వేసుకుంటం, పండబెట్టి తొక్కుతం అంటే సభ్యతగా ఉందా? కానీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నేను మాట్లాడితే.. నా గొంతు నొక్కేశారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు. పంటలు ఎందుకు ఎండాయి? ఐదు నెలల కింద రాష్ట్రం ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవరి చేతకానితనం దీనికి కారణం? ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 50వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడైనా పంటలు ఎండాయా? గత తొమ్మిదేళ్లు కడుపు నిండా కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంట్ కోతలు మొదలయ్యాయి.ఈ కోతలు ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి. గతంలో గోదావరిలో పైసలు వేయాలంటే నీళ్లు వెతికేలా ఉండేది. అలాంటి గోదావరిని సజీవంగా చేశా. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. ఇప్పుడు ఎందుకు రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. హామీల అమలు ఏది? కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోంది. రైతు రుణమాఫీ అయిందా? రైతు కూలీలకు రూ.15 వేలు ఎక్కడ? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నాయా? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. సంతోషమే. మరి ఆటో కార్మికులు నష్టపో యి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆదుకోరా? ఆటోకార్మికులకు న్యాయం జరగాల్సిందే. వారి తరఫున బీఆర్ఎస్ పో రాడుతుంది. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒ ట్టేస్తున్నారు. పనిచేసేటోడు ఎవడైనా ఒట్టు పెట్టుకుంటడా? పెద్ద ప్రమాదం రాబోతున్నా.. సీఎం మాట్లాడట్లేదు.. ఇప్పుడున్న సీఎం కృష్ణా నదిని తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతా, తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తానని ప్రధాని మోదీ అంటుంటే.. చప్పుడు చేయడం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన తెస్తే.. నా ప్రాణం ఉన్నంత వరకు నీళ్లు తీసుకుపోనివ్వనని చెప్పిన. మరి ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక మతలబేంటో ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. దేశం అప్పుల పాలైంది. రూపాయి విలువ పడిపోయింది. మోదీ కంటే ముందున్న 14 మంది ప్రధానుల కాలంలో ఎన్నడూ ఇంత తక్కువకు పడిపోలేదు. పబ్లిక్ సెక్టార్ నాశనమైంది. అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. తెలంగాణలో 14 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. మన హక్కులను, మన సింగరేణిని కాపాడుకోవచ్చు.అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు కర్రువాల్చి వాత పెట్టాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి 100శాతం మన దగ్గరే ఉండే. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అది తీర్చలేక 49శాతం వాటాను అప్పజెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే. మేం సింగరేణికి లాభాలు తేవడానికి, కార్మికుల కోసం ఎన్నో మంచి పనులు చేశాం. సీపీఐ, సీపీఎం నాయకులను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా.. ధైర్యముంటే సమాధానం చెప్పాలి, సీఎంతో సమాధానం చెప్పించాలి.నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది మేం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 19వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కలి్పంచాం. సింగరేణిని లాభాల్లోకి తెచ్చేందుకు డైరెక్టర్లను ఆ్రస్టేలియా, ఇండోనేషియాలకు పంపి.. అక్కడ బొగ్గు గనులు తీసుకుని వెలికితీయాలనే ప్రయత్నం చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అదానీకి అప్పజెప్పి మన కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్లలో ఎవరిని గెలిపించినా సింగరేణి ప్రాంతాలు బొగ్గు అయ్యే పరిస్థితి. మీరు లేని లోటు కనిపిస్తోందిసారూ మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచిగుండె. ఇప్పుడు మీరు లేని లోటు కనిపిస్తోంది. పచ్చగా ఉండే పల్లెలు మళ్లీ ఎండిపోతున్నాయి. మాకు దిక్కు, దిశ మీరే.. మీరు మళ్లీ వస్తేనే మా బతుకులు మారుతాయి. – రేణుక, గృహిణిమళ్లీ కరువు వచ్చిందిమీ పాలనలో పచ్చని పొలాలు చూసినం. ఇప్పుడు ఎండిపోయిన పంటలు కనిపిస్తు న్నాయి. మీ పాలన లేని లోటు కనిపిస్తోంది. రైతుబంధు రాలే దు. నీళ్ల కరువు వచ్చింది. మీరు రావాలె. మునుపటిలా కావాలె.. – బొల్లెడ సడవలి, భూపాలజిల్లామాకు అండగా నిలవాలికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు కరువు ప్రారంభమైంది. మీ పాలనలో కల్యాణలక్ష్మి, దళి త బంధు పథకాలు వచ్చినయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం జరి గింది. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మాకు అండగా ఉండాలి.– కృష్ణప్రసాద్, యువకుడు -
కేంద్రంలో కాంగ్రెస్ రావడం అనివార్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనివార్యమని, జనాభాలో అధిక శాతం ఉన్న పేద వర్గాలకు సామాజిక న్యాయం కలి్పంచేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పోరాటం కొనసాగిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను అమ్మడమే తప్ప.. మోదీ సర్కార్ కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థలేమీ లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో మధుయాష్కీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోదీ ప్రజలను కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ ధ్వజమెత్తారు. విదేశాలనుంచి నల్లదనం తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాను ఓబీసీ అని చెప్పుకునే మోదీ.. ఓబీసీలకు ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. కేసీఆర్ అప్పుల్లో ముంచారు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, అవినీతి.. అక్రమాలతో తెలంగాణను సర్వనాశనం చేశారని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేస్తాం, పడగొడతామంటూ ఒకదిక్కు బీఆర్ఎస్, మరోదిక్కు బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయని, అందుకే తాము ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చా రు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement