-
ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..!
Riyan Parag: ఐపీఎల్-2023లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ (2022) నుంచే చెత్తగా ఆడుతున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. గుజరాత్తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్లో 6 బంతుల్లో 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన రియాన్ ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగుల స్కోర్ను దాటలేకపోయాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో 7 (6), పంజాబ్పై 20 (12), ఢిల్లీపై 7 (11), గుజరాత్పై 5 (7), లక్నోపై 15 నాటౌట్ (12) పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో రియాన్ 6 మ్యాచ్ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పైగా గుజరాత్తో ఇవాల్టి మ్యాచ్లో రాజస్థాన్ యాజమాన్యం ఇతగాడిని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించింది. ఈ మ్యాచ్లో రియాన్ విఫలం కావడంతో రాజస్థాన్ అభిమానులు ఏకీ పారేస్తున్నారు. ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ అట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. ఏదో పొడుస్తాడని రాజస్థాన్ యాజమాన్యం ఇతనిపై 3.8 కోట్లు పెట్టుబడి పెట్టిందని, వెంటనే ఇతన్ని జట్టు నుంచి తీసిపారేయలని డిమండ్ చేస్తున్నారు. రియాన్ కంటే గల్లీలో ఆడుకునే చిన్న పిల్లలు నయమంటూ ఉతికి ఆరేస్తున్నారు. ఓ పక్క జట్టు మొత్తం విఫలమైన నెటిజన్లు రియాన్నే ఎక్కువగా టార్గెట్ చేశారు. కాగా, సొంత మైదానంలో (జైపూర్) గుజరాత్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఐపీఎల్.. వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వాళ్లకు మాత్రం కోట్లు!
IPL 2023- Debutants: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్లన్నింటిలో రారాజుగా వెలుగొందుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కలలు కంటారనడంలో సందేహం లేదు. ఒక్కసారి ఐపీఎల్లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. దశ తిరిగిపోతుందని ఇప్పటికే ఎంతో మంది ప్లేయర్లు నిరూపించారు కూడా! ఇక మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదహారవ సీజన్తో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం! కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్. ఐపీఎల్ మినీ వేలం-2023లో ముంబై ఇండియన్స్ అతడి కోసం ఏకంగా 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసింది. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆసీస్ తరఫున ఆడిన 8 టీ20 మ్యాచ్లలో 173.75 స్ట్రైక్రేటుతో 139 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా గ్రీన్కు ఇదే తొలి ఐపీఎల్. గతేడాది దారుణ వైఫల్యంతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఆల్రౌండర్పై గంపెడాశలు పెట్టుకుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ పవర్ హిట్టర్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 20 టీ20లు ఆడి 372 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్తో టెస్టు సిరీస్లో విశ్వరూపం ప్రదర్శించిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ మూడు మ్యాచ్లలో 468 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి తనని కొనుగోలు చేసిన సన్రైజర్స్కు మరి ఏ మేరకు ‘తిరిగి చెల్లిస్తాడో’ ఈ యువ బ్యాటర్. సికందర్ రజా పాకిస్తాన్ మూలాలున్న జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అతడి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆడిన ఎనిమిది మ్యాచ్లలో 147.97 స్ట్రైక్రేటుతో 219 పరుగులు సాధించాడీ ఆల్రౌండర్. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను తిప్పలు పెడుతూ 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వే తరఫున ఇప్పటి వరకు 66 టీ20లు ఆడి.. 1259 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో గతేడాది మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రజాను 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 36 ఏళ్ల ఈ వెటరన్ ఆల్రౌండర్ తన తొలి ఐపీఎల్ ఎడిషన్లో ఎలా రాణిస్తాడో చూడాలి! ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్. 29 ఏళ్ల ముకేశ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఆడిన 35 మ్యాచ్లలో 134 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 7.20 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రంజీ ట్రోఫీ-2021-22 సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో 20 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్బౌలర్.. విజయ్ హజారే ట్రోఫీ-2022లో ఆరు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన ముకేశ్ కుమార్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. తొలి సీజన్లోనే భారీ మొత్తం పలికిన ముకేశ్ కుమార్ ఢిల్లీ యాజమాన్యం నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో మరి! జాషువా లిటిల్ ఐరిష్ పేసర్ జాషువా లిటిల్ అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. తన పదునైన పేస్తో బ్యాటర్లకు చుక్కలు చూపించే లిటిల్ తొలిసారి ఐపీఎల్లో పాల్గొనబోతున్నాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఐర్లాండ్ తరఫున ఆడిన 26 టీ20లలో 39 వికెట్లు తీశాడు. గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్పై ఐర్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో హ్యాట్రిక్తో మెరిశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా ఏడు మ్యాచ్లలో 7 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్న 23 ఏళ్ల లిటిల్ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వీరు సైతం ఇక ఈ ఐదుగురితో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి, అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం కలిగిన 32 ఏళ్ల జో రూట్(రాజస్తాన్ రాయల్స్- ధర. కోటి), న్యూజిలాండ్ బ్యాటర్, 32 ఏళ్ల మైకేల్ బ్రేస్వెల్(ఆర్సీబీ- ధర కోటి) కూడా ఐపీఎల్ పదహారో ఎడిషన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: Cristiano Ronaldo: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్గా వచ్చిందా? రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్రైజర్స్ బ్యాటర్కే! కచ్చితంగా అతడే.. -
IPL 2023: నా ఫేవరెట్ జట్టు అదే! అతడు చుక్కలు చూపించాడు..
India Vs Australia 2023: అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నాడు. కోహ్లితో కలిసి వికెట్ల మధ్య పరిగెత్తడం బాగుంటుందంటూ తమ మనసులో మాట బయటపెట్టాడు. ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో లబుషేన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 244 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడీ రైట్హ్యాండ్ బ్యాటర్. ఇక వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్వదేశానికి పయనమైన లబుషేన్.. భారత్కు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ట్విటర్లో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. క్వశ్చన్ & ఆన్సర్స్ సెషన్లో భాగంగా అరగంట పాటు వారికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన వివిధ ప్రశ్నలకు లబుషేన్ జవాబులు చెప్పాడు. స్టీవ్ స్మిత్తో కాకుండా వేరెవరితో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావని అడుగగా.. విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. ఇక ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరని ప్రశ్నించగా.. రవిచంద్రన్ అశ్విన్ అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. ఇటీవల ముగిసిన బీజీటీ-2023 సిరీస్లో తనకు ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ చుక్కలు చూపించాడని ఈ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ను ఆస్వాదిస్తానన్న మార్నస్ లబుషేన్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ఫేవరెట్ టీమ్ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో అన్సోల్డ్గా మిగిలిపోయిన ఈ స్పిన్ ఆల్రౌండర్ ఈసారి తన పేరును మినీ వేలంలో నమోదు చేసుకోలేదు. చదవండి: Sanju Samson: టీమిండియాలో చోటు దక్కకపోతేనేం.. బంపర్ ఆఫర్ కొట్టేశాడుగా..! Steve Smith- IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో.. -
ముంబై ఇండియన్స్కు అతి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్..!
గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విధితమే. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తాజాగా కొట్టిపారేశాయి. బుమ్రా గాయం గతంలో డాక్టర్లు నిర్ధారించిన దాని కంటే తీవ్రంగా మారిందని, అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో బుమ్రా.. ఐపీఎల్-2023 సీజన్తో పాటు జూన్లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా అందుబాటులో ఉండడం అనుమానమేనని సూచనప్రాయంగా వెల్లడించాయి. దీంతో బుమ్రాను ఆసియా కప్ సమయానికి కంతా జట్టులోకి తీసుకురావాలని భావించిన టీమిండియా ఆశలు అడియాశలుగా మిగిలిపోనున్నాయి. అలాగే బుమ్రా గాయంపై తాజా సమాచారం అతని ఐపీఎల్ జట్టైన ముంబై ఇండియన్స్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిలిటేషన్లో ఉన బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఫిట్నెస్ సాధించేందుకు శతవిధాల శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తి కాగా.. రెండిటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ సిరీస్ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడతాయి. తొలుత వన్డే సిరీస్ సమయానికి కంతా బుమ్రా ఫిట్గా ఉంటాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ బుమ్రా.. టీమిండియా, ముంబై ఇండియన్స్లకు భారీ షాకిచ్చాడు. -
IPL 2023: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో..
Dasun Shanaka- Gautam Gambhir: ‘‘నా దగ్గర తనను కొనుగోలు చేసేంత డబ్బు లేదు. తన బ్యాటింగ్ అద్భుతం. ఒకవేళ ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటే అతడు.. ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో! నా అభిప్రాయం ప్రకారం ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర అతడిని కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదు’’.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. టీమిండియాతో భారత గడ్డపై జరిగిన టీ20 సిరీస్లో షనక అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆసియా టీ20 కప్ టీ20 టోర్నీలో లంకను విజేతగా నిలిపిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో భారత్తో సిరీస్లోనూ అదరగొట్టాడు. అదరగొట్టాడు తొలి టీ20 లో 27 బంతుల్లో 45, రెండో మ్యాచ్లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేగాక.. మ్యాచ్ను టీమిండియా వైపు తిప్పేలా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ను అవుట్ చేసి రెండో టీ20లో జట్టుకు విజయం అందించాడు. ఇక మూడో మ్యాచ్లో 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఏదైమైనా సిరీస్ ఓడినప్పటికీ ఆటగాడిగా మాత్రం షనక సఫలమయ్యాడని చెప్పొచ్చు. అయినా పాపం! ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణిస్తున్న షనక.. ఐపీఎల్-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 50 లక్షల కనీస ధరతో ఆక్షన్లోకి వచ్చిన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్లో అతడి ప్రదర్శన సందర్భంగా గంభీర్ ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు. నేనేం బాధపడటం లేదు ఈ వ్యాఖ్యలపై దసున్ షనక తాజాగా స్పందించాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా పిచ్లు బ్యాటింగ్కు అనుకూలిస్తాయి. అందుకే నేను అక్కడ ఆడటాన్ని ఆస్వాదిస్తా. నాలోని దూకుడైనా ఆటగాడు బయటకు వస్తాడు.. నాదైన శైలిని అక్కడ ప్రదర్శించగలను. అయితే, ఐపీఎల్ వేలంలో నన్ను ఎవరూ కొననంత మాత్రాన నేనేమీ బాధపడను. భవిష్యత్తులో నాకోసం భారత్లో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నా. అప్పుడు కచ్చితంగా ఐపీఎల్లో ఆడతాను’’ అని షనక తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా షనక ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్20లో ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన క్యాపిటల్స్ జట్టు ముంబై ఎమిరేట్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: IND Vs AUS: ఈజీ క్యాచ్ ఇచ్చిన రాహుల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్ Ravindra jadeja: రోహిత్, జడేజా చెప్పే చేశారు! అదేదో అంపైర్ ముందు చేయొచ్చు కదా! క్లీన్చిట్ ఇచ్చాక..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement