-
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కిషన్రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. అబద్ధాల ప్రచారం సరికాదు..‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్రెడ్డి తెలిపారు. -
ఎంఎఫ్ ఆస్తులు రూ. 53.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో 35% జంప్ చేశాయి. రూ. 53.4 లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా రూ. 14 లక్షల కోట్లమేర ఎగశాయి. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, లాభాల పరుగు తీస్తున్న ఈక్విటీ మార్కెట్లు ప్రభావం చూపాయి. వెరసి 2020–21 ఏడాది(41 శాతం వృద్ధి) తదుపరి గరిష్టస్థాయిలో ఎంఎఫ్ ఆస్తులు బలపడినట్లు వార్షిక నివేదికలో ఫండ్స్ దేశీ అసోసియేషన్(యాంఫి) వెల్లడించింది. ఎంఎఫ్ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) పురోగతి.. ఫండ్స్ పరిశ్రమలో పెరుగుతున్న ఇన్వెస్టర్లను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా మార్చి చివరికల్లా ఫోలియోల సంఖ్య 17.78 కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.. ఇన్వెస్టర్ల బేస్ 4.46 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో మహిళల వాటా 23 శాతంకావడం గమనార్హం! సిప్ దన్ను క్రమబద్ధ పెట్టుబడుల(సిప్) పథకాలను ఇన్వెస్టర్లు ఆదరిస్తుండటంతో వీటి సంఖ్య బలపడుతోంది. దీంతో నెలవారీ నికర పెట్టుబడులు మార్చిలో రూ. 19,300 కోట్లకు చేరాయి. పూర్తి ఏడాదిలో సిప్ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు లభించాయి. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని పట్టిచూపుతోంది. అంతేకాకుండా క్రమశిక్షణతోకూడిన పెట్టుబడులను ప్రతిబింబిస్తోంది. దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు గతేడాది మైలురాయివంటిదని యాంఫి నివేదిక పేర్కొంది. ఏయూఎం చెప్పుకోదగ్గవిధంగా రూ. 14 లక్షల కోట్లమేర పెరిగి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 53.4 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది. 2022–23లో ఫండ్స్ ఏయూఎం విలువ రూ. 39.42 లక్షల కోట్లుమాత్రమేనని ప్రస్తావించింది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఆధారిత పథకాలు తదితరాలలో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. పరిశ్రమ ఆస్తుల్లో వీటి వాటా 58 శాతంకాగా.. ఫోలియో సంఖ్యలో 80 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఎంఎఫ్ల ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న కుటుంబ మదుపును ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ఈక్విటీకే ఓటు గతేడాది పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత పథకాలు 55 శాతం వృద్ధిని అందుకుని ఆస్తులలో రూ. 23.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు పెట్టుబడులతోపాటు.. మార్క్టు మార్కెట్(ఎంటుఎం) లాభాలు సహకరించాయి. అయితే మరోవైపు రుణ పథకాల ఫండ్స్ 7 శాతమే బలపడ్డాయి. ఏయూఎంలో రూ. 12.62 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ అంతక్రితం రెండేళ్లలో ఆస్తులు తగ్గుతూ వచ్చిన అంశంతో పోలిస్తే మెరుగేనని నివేదిక తెలియజేసింది. -
రూ. వేయి కోట్లు ఇస్తేనే ‘గృహ’ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో నిర్మించని తరహాలో నిరుపేదల కోసం రూపుదిద్దుకున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మూడొంతులు సిద్ధమైనా ఇప్పటికిప్పుడు ప్రజలు నివాసం ఉండే పరిస్థితి కనిపించటం లేదు. ఆ కాలనీలకు మంచినీళ్లు, కరెంటు, మురిగునీటి పారుదల, రోడ్లు.. లాంటి అతి ముఖ్య ప్రాథమిక వసతులు కూడా లేవు. ఇవన్నీ సిద్ధం కావాలంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.వేయి కోట్లు కావాలి. కనీస వసతుల కల్పనకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున, సొంత జాగా లేనివారికి ముందుగా భూమి ఇచ్చి ఇంటి నిర్మాణ యూనిట్ కాస్ట్ నిధులు ఇస్తామని ఈ ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ ఏడాది సొంత జాగా లేని వారిని పక్కన పెట్టేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 66 లక్షలను మించి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం కాలేదు. 1.49 లక్షల ఇళ్లు సిద్ధమైనా.. రాష్ట్రవ్యాప్తంగా 2.29 లక్షల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 1.49 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి. మరో 80 వేలు తుది దశలో, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల కిందనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తాజాగా ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మాత్రం వాటిల్లో ఉండే పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదు. ఆయా కాలనీల్లో ఇళ్లనైతే నిర్మించారు గానీ, వాటిల్లో మంచినీళ్లు, విద్యుత్ కనెక్షన్లు లేవు. వాననీళ్లు, మురుగునీళ్లు వెళ్లే వ్యవస్థ లేదు. రోడ్లతో అనుసంధానం కాలేదు. చాలా కాలనీలు ప్రస్తుత జనావాసాలకు దూరంగా ఉన్నందున.. చాలా వసతులు కల్పించాల్సి ఉంది. ఇటీవల అధికారులు వాటిపై సమీక్షించి లెక్కలు వేసి రూ.వేయి కోట్లకుపైగా నిధులు ఉంటే తప్ప ఆ ఏర్పాట్లు చేయటం సాధ్యం కాదని తేల్చారు. వాటి నిర్మాణం ప్రారంభించిన సమయంలో నాటి ప్రభుత్వం వేసిన అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. దీంతో వాటిని సవరించాల్సి ఉంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం, దాని శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్లను నిర్మించారు. వీటిల్లో కొన్నింటిలో లబ్ధిదారులు ఉంటుండగా, మిగ తా కాలనీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆయా కాలనీల్లో మంచినీటి, మరుగునీటి పారుదలకు కావా ల్సిన ట్రంక్లైన్లు, విద్యుత్ అనుసంధాన వ్యవస్థ, వరదనీటి కాలువల కోసం దాదాపు రూ.650 కోట్లు కావాలి. పోలీసు స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాపులు, రేషన్ దుకాణాలు లాంటి వాటిని కూడా సమకూర్చాల్సి ఉంది. అందుకు మరికొన్ని నిధులు కా వాల్సి ఉంటుంది. ఇక జీహెచ్ఎంసీ వెలుపల.. జిల్లా ల్లో నిర్మించిన కాలనీల్లో మంచినీరులాంటి కనీస వస తులు కూడా లేవు. కాలనీలను నివాసయోగ్యంగా మార్చాలంటే రూ.456 కోట్లు కావాల్సి ఉంది. మిగిలిన నిధులు ఏమయ్యాయో? గత ప్రభుత్వం రూ.201 కోట్లను విడుదల చేసింది. వాటిల్లో రూ.39 కోట్లు మాత్రమే ఖర్చ య్యాయి. మిగతా నిధులేమయ్యాయో తేలాల్సి ఉంది. గత ప్రభుత్వం విడుదల చేయగా పోనూ మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు విడుదల చేయాల్సి ఉంది. అంచనా వ్యయాలు పెరిగినందున అదనంగా వాటి అవసరం ఏర్పడింది. నిధులు ఇవ్వటంలో జాప్యం జరిగే కొద్దీ.. ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండాల్సిందే. మరింత ఆలస్యమైతే.. నిర్మాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. -
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్లో పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
సైకిల్పై ‘డాలర్’ సవారీ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అతనో ఎన్ఆర్ఐ.. మారుపేరు డాలర్ రాజా.. వృత్తి రీత్యా డాక్టర్.. అయితే పూర్తిగా టీడీపీ కోసమే పని చేస్తుంటాడు. అతను పుట్టింది గుంటూరులో.. ఉండేది అమెరికాలో.. ఎక్కువగా వచ్చేది కోవెలకుంట్లకు.. ఇతని తండ్రి గతంలో ఇక్కడ ఎంఈవోగా పని చేయడంతో పరిచయాలు ఎక్కువ. అతనికి కోవెలకుంట్లలో ఓ మిత్ర మండలి ఉంది. సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రతీ ఎన్నికకు టీడీపీకి భారీగా నిధులు సమకూరుస్తుంటారు. ప్రతిగా తనకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. చంద్రబాబు, లోకేశ్ అమెరికా వెళితే ఆయన ఇంట్లోనే బస చేస్తారు. ఈసారి రూ.250 కోట్లకు పైగా ఫండింగ్ సమకూర్చడమే కాకుండా టికెట్ల కేటాయింపులోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఆశావహులు అధిష్టానాన్ని కాకుండా ‘డాలర్ రాజా’ను సంప్రదించడం వరకు ఈ జోక్యం వెళ్లిందంటే ఈ ‘రాజా’ మాటే చంద్రబాబుకు శాసనం అని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. రాజా మాటే బాబు మాటట! నంద్యాల జిల్లా టీడీపీలో బీసీ జనార్ధనరెడ్డి అంతా తానై నడిపిస్తున్నాడని, ఇతనివల్ల పార్టీ నష్టపోతోందనే అంచనాకు ఈ ఎన్ఆర్ఐ వచ్చినట్లు సమాచారం. నంద్యాల, డోన్ టికెట్లు ఫరూక్, ధర్మవరం సుబ్బారెడ్డికి తొలుత ప్రకటించడం వెనుక జనార్ధన్రెడ్డి ఉన్నారని ఇతని భావన. దీంతోనే డోన్ టికెట్ సుబ్బారెడ్డికి తప్పించి, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి దక్కేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జనార్దనరెడ్డి వ్యతిరేకులను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఈ ‘రాజా’ తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. ఆదోని టికెట్ కోసం జనసేన పట్టుబట్టినా, చివరకు దాన్ని బీజేపీకి ఇవ్వాలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘రాజా’ మాత్రం తన సామాజికవర్గ నేత మీనాక్షినాయుడుకో లేక ఆయన కుమారుడికి ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కోడుమూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చి, ఆదోనిలో టీడీపీ తరఫున మీనాక్షినాయుడు కుమారుడు భూపాల్నాయుడును బరిలోకి దింపాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. ఈ దెబ్బతో కోడుమూరు టీడీపీ అభ్యర్థి దస్తగిరితోపాటు నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డికి కూడా చెక్ పెట్టొచ్చన్నది ఈ ‘రాజా’ ఆలోచనట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని సురేంద్రబాబుకు రావడం వెనుక కూడా ఇతని హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సీటు కూడా రాప్తాడు మాజీ మండలాధ్యక్షుడు దగ్గుబాటి ప్రసాద్కు ఖరారు చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతను పార్టీకి రూ.50 కోట్లు ఫండ్ ఇస్తానని చెప్పడంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీని వెనుక కూడా ఈ ఎన్ఆర్ఐ పావులు కదిపినట్లు చర్చ జరుగుతోంది. -
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్హౌస్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
జగనన్న విద్యా దీవెన విడుదల
-
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా ఐదో విడత నిధుల విడుదల
-
స్మార్ట్ సిప్ అంటే ఏంటి?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను తాకుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని సూచిస్తారా..? డి. వెంకట రమణ స్మార్ట్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (స్మార్ట్ సిప్) అనేది రెగ్యులర్ సిప్తో పోలిస్తే వినూత్నమైనది. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే మొత్తం అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్ గా మారిపోతుంది. కొన్ని పారామీటర్ల ఆధారంగా మార్కెట్ల విలువలు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌక గా ఉన్నాయా అన్నది ఆల్గోరిథమ్ నిర్ణయిస్తుంది. మార్కెట్లు పూర్తి విలువ మేర ట్రేడ్ అవుతున్నాయని ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) భావిస్తే, అప్పుడు సిప్లో కొంత భాగమే ఈక్విటీ పెట్టుబడిగా వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్కు తరలిస్తుంది. ఒకవేళ స్టాక్ విలువలు చౌకగా ఉన్నాయని భావిస్తే అప్పుడు పెట్టుబడిలో అధిక భాగం స్టాక్స్కే కేటాయిస్తుంది. లిక్విడ్ ఫండ్కు పరిమితంగానే వెళుతుంది. స్మార్ట్ సిప్ ఇదే మాదిరిగా పనిచేస్తుంది. ఈ విధానం ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తమే పెట్టుబడిగా వెళుతుంది. అదే ఈక్విటీ వ్యాల్యూషన్ చౌకగా మారినప్పుడు సిప్లో అధిక భాగం ఈక్విటీలకు వెళుతుంటుంది. మార్కెట్లో అనుకూల సమయాన్ని ఎవరూ అంచనా వేయ లేరు. ఓ పద్ధతి ప్రకారం, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే కీలకం. ఇందుకు స్మార్ట్సిప్ వీలు కల్పిస్తుంది. నిజానికి సాధారణ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉద్దేశం కూడా పెట్టుబడులకు సంబంధించి రిస్్కను తగ్గించడమే. మార్కెట్లు ఎప్పుడు దిద్దుబాటుకు గురవుతాయి? ఎప్పటి వరకు ర్యాలీ చేస్తాయి? అని ఎవరూ చెప్పలేదు. అటు ర్యాలీల్లోనూ, ఇటు పతనాల్లోనూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సిప్ ద్వారా సాధ్యపడుతుంది. మార్కెట్లు ఖరీదుగా మారా యా? చౌకగా ఉన్నాయా? అని చూడక్కర్లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. స్టాక్స్ ధరలు దిద్దుబాటుకు గురైనప్పుడు సిప్ పెట్టుబడితో ఎక్కువ ఫండ్ యూనిట్లు సమకూరుతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కావాల్సినది క్రమశిక్షణ. అందుకు సిప్ వీలు కల్పిస్తుంది. కనుక మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నాయని చెప్పి స్మార్ట్సిప్ను పరిశీలించక్కర్లేదు. మీరు రెగ్యులర్ సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా పెట్టుబడుల్లో సింహ భాగం ఈక్విటీల్లోనే ఉన్నా యి. రిటైర్మెంట్కు మూడేళ్లు మిగిలి ఉంది. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడులను డెట్ ఫండ్స్లోకి మళ్లించుకోవచ్చా? నా లాభం రూ.లక్షకు మించే ఉంటుంది. కనుక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా డెట్లోకి మళ్లించిన త ర్వాత ప్రతి నెలా ఇంత చొప్పున సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ద్వారా తీసుకుందామని అనుకుంటున్నాను. డెట్ ఫండ్ నుంచి ప్రతి నెలా బ్యాంక్ ఖాతాకు జమ అయ్యే మొత్తంపైనా పన్ను పడుతుందా? త్యాగన్ నరేంద్రన్ అవును. రెండు సందర్భాల్లోనూ మూలధన లాభంపై పన్ను పడుతుంది. అయినప్పటికీ రెండింతల పన్ను చెల్లించినట్టు కాదు. పెట్టుబడిపై వచ్చే రాబడిపైనే పన్ను అమలవుతుంది. దీర్ఘకాల లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో మూడేళ్ల ముందుగానే ఈక్విటీ పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి మళ్లించుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు పెట్టుబడులు తక్కువ అస్థిరతలతో కూడిన సాధనాల్లో ఉండడం ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అక్కరకు వస్తుంది. ఈక్విటీ ఫండ్స్ నుంచి మీ పెట్టుబడులను ఎస్డబ్ల్యూపీ ద్వారా డెట్ ఫండ్స్లోకి మళ్లించుకోవడం వల్ల మార్కెట్ కనిష్టంలో ఉన్నప్పుడు వైదొలిగే రిస్క్ను తప్పిస్తుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఉక్రెయిన్కు మరోసారి గూగుల్ సపోర్ట్ ఫండ్.. ఈసారి ఎంతంటే?
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ భారీగా దెబ్బతినింది. ఉక్రెయిన్ను ఆదుకోవడానికి టెక్ దిగ్గజం గూగుల్ 10 మిలియన్ డాలర్ల (రూ. 83 కోట్ల కంటే ఎక్కువ) విలువైన స్టార్టప్ సపోర్ట్ ఫండ్ను ప్రకటించింది. చాలా మంది ప్రజలు దేశాన్ని దాటి వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోని వ్యాపారాలను నిర్వహించుకోవడానికి గూగుల్ ఈ సపోర్ట్ ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలో పెద్దపెద్ద భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటివి కూడా బాగా దెబ్బతిన్నాయి. నిత్యావరాలకే కష్టమైన ఉక్రెయిన్ను ఆదుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ 2022 మార్చిలో ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ను గూగుల్ ఇప్పటికి కూడా తన మద్దతు అందిస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సహాయక చర్యలకు మద్దతుగా 45 మిలియన్ డాలర్ల నగదు అందించినట్లు సమాచారం. గూగుల్ ఫండింగ్ను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ ఫండ్ సపోర్ట్తో స్టార్టప్లు 15.8 మిలియన్ ఫాలో ఆన్ ఫండింగ్ను పొందాయి. దీంతో ఆ దేశంలో ఉపాధి గణనీయంగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదీ చదవండి: విల్లాగా మారిన విమానం.. ఫిదా అవుతున్న జనం - వీడియో -
కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల సర్వేలాంటి కొత్తవాటి జోలికి కేంద్రప్రభుత్వం పోలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోనే సరిపెట్టింది. ఆర్మూరు–ఆదిలాబాద్, వికారాబాద్–కృష్ణా లైన్లు సహా సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్లాంటి వాటి ఊసే లేకుండా రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. తేడాది బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.4418 కోట్లు కేటాయించగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం మధ్యంతర బడ్జెట్లో రూ.5,071 కోట్లను ప్రతిపాదించింది. ఇది అంతకుముందు బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ కావటం విశేషం. 2022–23లో రూ.2,038 కోట్లు కేటాయించారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా... కాజీపేట–విజయవాడ మూడో లైను: రూ.310 కోట్లు. ఇది 2012–13లో మంజూరైంది. పూర్తి నిడివి 219 కి.మీ.. దీని అంచనా వ్యయం రూ.1857 కోట్లు. విజయవాడ–కొండపల్లి వైపు పని పూర్తి కాగా, ఇప్పుడు విజయవాడ–ఖమ్మం మధ్య నిర్వహిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించారు. కాజీపేట–బల్లార్షా మూడో లైను: రూ.300 కోట్లు. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. కాజీపేట హసన్పర్తి మధ్య పనులు జరగాల్సి ఉండగా, ఎగువ భాగంలో దాదాపు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.350 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరు కాగా, నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ.. అంచ నా వ్యయం రూ.1160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భ రించనుండగా, రాష్ట్రప్రభుత్వం ఒకవంతుతో పాటు భూసేకరణ వ్యయాన్ని భరిస్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తి కా వటంతో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సర్విసులు మొ దలయ్యాయి. సికింద్రాబాద్–సిరిసిల్ల మధ్య భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు డిపాజిట్ చేయకపోవటంతో పనులు ఆగాయి. గత బడ్జెట్లో రూ.185 కోట్లు కేటాయించారు. భద్రాచలం–సత్తుపల్లి:రూ.6 కోట్లు ఇది 2010–11లో మంజూరైంది. నిడివి 54 కి.మీ. అంచనా వ్యయం రూ.704 కోట్లు. సింగరేణితో కలిపి రైల్వే ఈ సంయుక్త ప్రాజెక్టును చేపట్టింది. బొగ్గు తరలింపు ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ: రూ.50 కోట్లు నగర ట్రాఫిక్కు ఊరటనిచ్చే ఈ ప్రాజెక్టును 2012–13లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.817 కోట్లు. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.450 కోట్లు. కానీ రాష్ట్రప్రభుత్వం రూ.130 కోట్లతోనే సరిపుచ్చింది. గత బడ్జెట్లో భారీగా నిధులు విడుదల కావటంతో పనులు వేగంగా సాగాయి. దీంతో ప్రాజెక్టు సిద్ధమైంది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్: రూ.10 కోట్లు రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 10 లక్షలతో సరిపెట్టింది. కానీ ఈసారి రూ.10 కోట్లు కేటాయించటంతో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్లపల్లి శాటిలైట్ టెర్మి నల్:రూ.46 కోట్లు సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో టెర్మి నల్ నిర్మించారు. ఇందులో 6 ప్లాట్ఫామ్స్, 5 పిట్ లైన్లు ఉంటాయి. రైల్వే కోరినంత భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించలేదన్న విమర్శ ఉంది. దీంతో దీన్ని ఆశించినస్థాయిలో కాకుండా చిన్నదిగానే నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. భద్రాచలం–కొవ్వూరు: రూ.10 లక్షలు ఇది కీలకప్రాజెక్టు అయినప్పటికీ నిధుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గత బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించగా ఈసారి నామమాత్రపు నిధులతోనే సరిపెట్టారు. మణుగూరు–రామగుండం: రూ.5 కోట్లు కీలక ప్రాజెక్టుకు తొలిసారి భారీ నిధులు కాజీపేట మీదుగా సికింద్రాబాద్–విజయవాడ మార్గం ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయ లైను అవసరం ఏర్పడింది. నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. 248 కి.మీ. మేర రెండోలైన్ నిర్మించాల్సి ఉంది. రూ.2853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండు లైన్లు పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచుతారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. గత బడ్జెట్లో రూ.60 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.10 కోట్లకు కుదించారు. అవి కూడా విడుదల కాలేదు. తొలిసారిగా ఆ ప్రాజెక్టుకు రూ.200 కోట్లను తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.140 కోట్లు ప్రతిపాదించారు. తొలుత వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాలింగ్ వర్క్షాపుగా మంజూరు చేసిన దీన్ని.. గత బడ్జెట్లో వ్యాగన్ తయారీ యూనిట్గా అప్గ్రేడ్ చేశారు. అంచనా వ్యయాన్ని రూ.521 కోట్లకు పెంచారు. గతేడాది నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చదును చేయటం, కొన్ని షెడ్లు నిర్మించటం, ఒక ఆర్యూబీని సిద్ధం చేయటం.. తదితరాలు పూర్తి చేశారు. ఇప్పుడు మెరుగ్గానే నిధులు వచ్చినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు వేగంగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి సంవత్సరం నాటికి అది పూర్తయి పని ప్రారంభించనుంది. -
రూ. 37 వేల కోట్లు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరం (2024–25)లో నీటిపారుదల రంగానికి రూ.37 వేల కోట్లను కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. మంగళవారం నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. 2024– 25లో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల నిమిత్తం రూ.14,462.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాక రూ.3000 కోట్లను తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ కింద తీసుకున్న రుణాలకు చెల్లింపులున్నాయని అధికారులు నివేదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సృష్టించేలా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్సాగర్, నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), మొడికుంటవాగు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, పెద్దవాగు (జగన్నాధపూర్), చనాకా కొరాటా, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) మురళీధర్ రావు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. విద్యుత్ సంస్థల్లో మరో ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆంధ్రప్రదేశ్కు తక్కువ నిధులెందుకు?
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు వెచ్చిస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఆ స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కొరతతో ప్రాథమిక దశలోనే పలు నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించిన 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద ఇవ్వాల్సిన రూ. 394 కోట్లను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని సూచించింది. రాష్ట్ర విభజన తరువాత న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసింది. నిధుల విడుదల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు అడిషనల్ జనరల్ (ఏఎస్జీ) బి.నరసింహ శర్మ హై కోర్టుకు తెలిపారు. ఇందుకు కొంత గడువునిస్తే కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియచేస్తానన్నారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 4.82 కోట్లు మాత్రమే విడుదల కృష్ణాజిల్లా గన్నవరంలో పలు కోర్టుల కోసం భవన నిర్మాణాలను చేపట్టడం లేదని, పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడం లేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్రెడ్డి 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ, నిధుల కొరత వల్ల కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. 19 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం రూ. 656 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్రం వాటా రూ. 394 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 83.33 కోట్లు కోసం హైకోర్టు కేంద్రానికి లేఖ రాసిందన్నారు. కేంద్రం తరఫున ఏఎస్జీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ, ఈ విషయాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కేటాయించిన సొమ్ములో ఇంకా రూ. 14.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ మొత్తం విడుదల చేసినా కూడా ఇప్పటికే నిలిచిపోయిన 19 ప్రాజెక్టులు పూర్తి కావని తెలిపింది. అందువల్ల పూర్తిస్థాయి నిధుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏఎస్జీకి స్పష్టం చేసింది. -
పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఫండ్స్
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. అయితే, ప్రతి నెలా ప్రణాణళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా, ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా సాధనాల్లో ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అలాంటి వారు ఈ తరుణంలో ఈక్విటీ పెట్టుబడులతోపాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఒకటి. మూడేళ్ల లాకిన్ ఉండే ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపులు సొంతం చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా 18.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గడిచిన ఆరు నెలల కాలంలో రాబడులు 14.51 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడి 17.30 శాతంగా ఉంది. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 19.21 శాతం, ఏడేళ్లలో ఏటా 18.55 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 500 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్)తో పోలిస్తే ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ పథకంలో రెండు శాతం అధిక రాబడులు ఉన్నాయి. ఈక్విటీ ఎల్ఎస్ఎస్ విభాగం కంటే కూడా ఇవే కాలాల్లో ఈ పథకమే మెరుగ్గా పనిచేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 20431 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పెట్టుబడిపై ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఎక్స్పెన్స్ రేషియో 1.58 శాతంగా ఉంది. 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తన నిర్వహణలోని ఆస్తుల్లో 98.35 శాతం ఈక్విటీలకు కేటాయించింది. మిగిలిన 1.65 శాతం నగదు నిల్వల రూపంలో ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 67 శాతం లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీలకు 25 శాతం కేటాయించగా, స్మాల్క్యాప్ కంపెనీల్లో 8.41 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్ద పీట వేసింది. 30.50 శాతం మేర పెట్టుబడులు ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. మొదటి నుంచి ఈ పథకం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సేవల రంగ కంపెనీలకు 10 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.57 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 6.40 శాతం చొప్పు పెట్టుబడుల్లో కేటాయింపులు చేసింది. -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది?
తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. సవాళ్ళను అధిగమించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోంది? పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది. నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి, మంత్రులను సీఎం కలిసారట. ఇదే కాకుండా ఆర్దిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రజా పాలనలో స్వీకరించిన ధరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుపై దృష్టి సారించారట. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. ప్రజా పాలనలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అమలు చేయాలంటే 60 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం అవుతుంది. వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండడంతో పథకాల అమలుచేయడం అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య.. దీంతో ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు. చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో? చదవండి: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ? -
ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక
సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
మరో 68,990 మందికి సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి : జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ► అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ► అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. ► సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ► ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. ► సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. ► లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. ► నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది. -
తెరపైకి తెలంగాణ పార్కు
జిల్లా కేంద్రంలో తెలంగాణ పార్కు నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మళ్లించడంతో పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవలే నిధులు విడుదల చేసిన నూతన ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం వికారాబాద్కు ముక్కుపుడక లాంటి తెలంగాణ పార్కు ఏర్పాటు ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు స్థలం గుర్తించి వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రం అభివృద్ధికి తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల నుంచి పార్కు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ స్పీకర్ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్కు సూచించారని వినికిడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున స్పీకర్ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల అనంతరం పార్కు నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. నిధుల మల్లింపుతో నిలిచిన పనులు 2019 జనవరి 29న అప్పటి కలెక్టర్ ఉమర్ జలీల్ తెలంగాణ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో 13 ఎకరాల స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2020లో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లభించింది. ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద వికారాబాద్ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 25 శాతం పార్కు అభివృద్ధికే కేటాయించినట్లు ప్రచారం సాగింది. 2021 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికే పార్కు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇట్టి నిధులు అప్పటి పాలకులు, అధికారులు ఇతర అభివృద్ధి పనులకు మల్లించడంతో పార్కు నిర్మాణం పనులు ప్రారంభించలేదనే ప్రచారం ఉంది. పర్యాటకులు పెరిగే అవకాశం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్ వచ్చే ప్రధాన రోడ్డు పక్కనే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో ఈ పార్కు నిర్మిస్తే పర్యాటకులు పెరగడంతో పాటుగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. చెరువులో ఎప్పుడు నీరు ఉండటంతో పాటు, పట్టణానికి కొంత దూరంగా ఉండటం, హైదరాబాద్ ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అనంతగిరికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పర్యాటకులు వచ్చే ప్రధాన రహదారి వెంటే పార్కు నిర్మిస్తే జిల్లా కేంద్రానికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. పార్కును ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై ఓ ప్రైవేటు కంపెనీ నమూనా గ్రాఫ్ తయారు చేసింది. ఈ తెలంగాణ పార్కులో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆటస్థలం వారు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి ఏర్పాటు, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశారు. ఆకట్టుకునే విధంగా గ్రీనరీ ఏర్పాటు, సుమారు వంద రకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో మెరిసేలా ఏర్పాటు చేయాలని గ్రాఫ్లో పొందుపరిచారు. పార్కు నుంచి చెరువు అందాలు వీక్షించేందుకు కొంత ఎత్తులో నిచ్చెనలతో కూడిన ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కేంద్రానికి ముక్కుపుడక లాంటి ఈ పార్కు నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తొలి ప్రాధాన్యత పట్టణానికి అందాన్ని తీసుకొచ్చే తెలంగాణ పార్కు నిర్మాణం పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు నిర్మాణం పూర్తయితే మున్సిపల్కు ఆదాయంతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వచ్చిన టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి పార్కుకు నిర్మాణానికి ఎక్కువ శాతం కేటాయించాలని స్పీకర్ను కోరాం. – మంజుల, మున్సిపల్ చైర్పర్సన్, వికారాబాద్ -
విదేశీ విద్యా దీవెన స్కాలర్షిప్ తో మా కల నెరవేరింది: విద్యార్థులు
-
తక్కువ రిస్క్.. స్థిరమైన రాబడికి బెస్ట్ ఆప్షన్..
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు సర్వ సాధారణం. ఆటుపోట్లతో చలిస్తూ ఉంటాయి. కానీ, దీర్ఘకాలానికి నికర ప్రతిఫలం సానుకూలంగానే ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం అందరు ఇన్వెస్టర్లలోనూ ఉండాలని లేదు. కొందరు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఈక్విటీ, డెట్తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారు ఈ పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిన ఏడాది కాలంలో ఈ పథకం 9 శాతం రాబడులను అందింంది. మూడేళ్ల కాలంలో రాబడి ఏటా 13.56 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలంలో చూసుకుంటే 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ మధ్య వర్గీకరిస్తాయి. ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు మార్కెట్లలోని ప్రయోజనాలను ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్న సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీలు అధిక రాబడులకు, డెట్ పెట్టుబడులు రక్షణకు సాయపడతాయి. పైగా అచ్చం డెట్ పథకాల్లో చేసే దీర్ఘకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం పరంగా ఉన్న పన్ను ప్రయోజనాన్ని ఇటీవల ఎత్తివేశారు. దీంతో హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈక్విటీకి ఉండే పన్ను మినహాయింపు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్కు కేటాయిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపుల్లో మార్పులు చేస్తుంటుంది. ఈక్విటీల్లోనూ 50 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్కే కేటాయిస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు కొంత తక్కువగా ఉంటాయి. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ర.59,302 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీలకు 76.76 శాతం కేటాయింంది. డెట్ పెట్టుబడులు 20.32 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో 0.91 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీలకు 75 శాతం మిం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు. డెట్ కంటే ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ర్యాలీకి అవకాశం ఉన్నప్పుడు అధికంగా కేటాయింపులు చేయడం ద్వారా రాబడులు పెంచుకునే విధంగా ఫండ్ మేనేజ్మెంట్ బృందం పనిచేస్తుంటుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోన 85 శాతం మేర ప్రస్తుతం లార్జ్క్యాప్ కంపెనీలోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 14.56 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయింపులు 0.68 శాతంగానే ఉన్నాయి. డెట్లో రక్షణ ఎక్కువగా ఉండే ఎస్వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే అధిక పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 35 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 24 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. సేవల రంగ కంపెనీలకు 7.45 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 6.23 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 6.12 శాతం, కమ్యూనికేషన్ కంపెనీలకు 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
యాక్సిస్ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘యాక్సిస్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 15 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. నూతన పథకం ద్వారారూ.2,500 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. దేశ తయారీ రంగంలోని అవకాశాలపై ఈ పథకం పెట్టుబడులు పెడుతుందని తెలిపింది. నిఫ్టీ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ను ఈ పథకం ట్రాక్ చేస్తుంది. శ్రేయాష్ దేవాల్కర్, నితిన్ అరోరా ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో చేసిన పెట్టుబడిని 12 నెలల్లోపు ఉపసంహరించుకుంటే 10 శాతంపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ విధించరు. మిగిలిన మొత్తంపై 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోప్కుమార్ తెలిపారు. -
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement