-
ఏటా 10 వాటర్ ప్యూరిఫయర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ ప్యూరిఫయర్ల విపణిలోకి ఇటీవలే ప్రవేశించిన బ్లూ స్టార్ అత్యాధునిక ఫీచర్లతో పోటీ పడుతోంది. హాట్, కోల్డ్ వాటర్ను సైతం అందించే ఆర్వో, యూవీ ప్యూరిఫయర్ను భారత్లో తొలిసారిగా ఆవిష్కరించింది. కంపెనీ ప్రవేశపెట్టిన 21 మోడళ్లలో దేనికదే ప్రత్యేకమని బ్లూ స్టార్ ప్రొడక్ట్స్ బిజినెస్ సేల్స్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. వీటి తయారీలో దీర్ఘకాలం మన్నే విడిభాగాలను వాడామని చెప్పారు. తద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని వివరించారు. ఉత్పత్తుల అభివృద్ధిలో 100 మందికిపైగా నిపుణులు నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. మోడళ్ల ధర రూ.7,900 నుంచి రూ.44,900 వరకు ఉంది. ఏప్రిల్కల్లా 30 మోడళ్లు.. వచ్చే ఏప్రిల్ నాటికి మరో 9 మోడళ్లను కంపెనీ విడుదల చేయనుంది. ఏటా 8–10 కొత్త మోడళ్లు ప్రవేశపెడతామని బ్లూ స్టార్ వాటర్ ప్యూరిఫయర్స్ విభాగం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ హింగోరాణి వెల్లడించారు. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9 నెలల దాకా సమయం పడుతోందని చెప్పారు. 70 ఏళ్లుగా వాటర్ కూలర్ల వ్యాపారంలో ఉన్న బ్లూ స్టార్కు బ్రాండ్ ఇమేజ్ ఉపయోగపడుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా 100 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి. మూడేళ్లలో తయారీ.. కంపెనీ ప్రస్తుతం రెండు మోడళ్లను కొరియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మిగిలిన మోడళ్లను భారత్లో తయారు చేస్తోంది. థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. బ్లూ స్టార్ స్వయంగా తయారీని పర్యవేక్షిస్తోందని ముకుందన్ తెలిపారు. ‘వాటర్ ప్యూరిఫయర్ల విక్రయం ద్వారా 2017–18లో రూ.60 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం. 2020–21 నాటికి టర్నోవర్ రూ.500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. ఆ సమయానికి సొంత తయారీ ప్లాంటు పెడతాం. మూడేళ్లలో 10 శాతం వాటాను చేజిక్కించుకుంటాం’ అని వెల్లడించారు. -
ప్రోత్సహిస్తే హైదరాబాద్లోనే ఏసీల తయారీ ప్లాంటు
పరిశీలనలో నెల్లూరు జిల్లా తడ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ సంస్థ బ్లూ స్టార్ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇస్తే హైదరాబాద్లోనే ప్లాంటు స్థాపిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పటాన్చెరు సమీపంలో ప్లాంటు నెలకొల్పాలని పదేళ్ల క్రితమే సంస్థ భావించింది. అయితే సంస్థ పరిశీలనలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా తడ, మహారాష్ట్రలోని నాగ్పూర్తోపాటు గుజరాత్ రాష్ట్రం కూడా ఉంది. పన్ను ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నామని, ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసేదీ సెప్టెంబర్కల్లా నిర్ణయమవుతుందన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఉన్న 7 ప్లాంట్లు కూడా ఉత్తరాదికే పరిమితమయ్యాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల యూనిట్లు. కొత్త ప్లాంటు రూ.150 కోట్ల పెట్టుబడితో, 5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో రానుంది. స్మార్ట్ఫోన్లతో ఏసీలకు సెగ..: పెరుగుతున్న స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఏసీల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. ఖర్చు చేయదగ్గ ఆదాయాన్ని గ్యాడ్జెట్లకు వెచ్చిస్తున్నారని అన్నారు. ఇంట్లో చివరి ఉపకరణంగా ఏసీ వచ్చి చేరుతోందని చెప్పారు. ‘చైనాలో ఏటా 5 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. మొత్తం గృహాల్లో వ్యాప్తి రేటు 25 శాతముంది. అదే భారత్లో 2014లో 37.5 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ఇక్కడ అపార అవకాశాలున్నాయి. 2015లో పరిశ్రమ 40 లక్షలకుపైగా యూనిట్లకు చేరుతుందని అంచనా’ అని చెప్పారు. 5 స్టార్ ఏసీల వాటా ప్రస్తుతం 25% ఉంది. వీటిపై సెంట్రల్ వ్యాట్ తగ్గించాలని అన్నారు. వోల్టాస్, ఎల్జీ, శాంసంగ్ల తర్వాతి స్థానం కోసం బ్లూ స్టార్, హిటాచీ, ప్యానాసోనిక్ పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్జీ, బ్లూ స్టార్, శాంసంగ్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.15 చెల్లిస్తే చాలు..: ఏసీ కోసం రూ.15 చెల్లిస్తే సరిపోతుందని బ్లూస్టార్ అంటోంది. మిగిలిన మొత్తాన్ని వడ్డీ లేకుండా 10 వాయిదాల్లో చెల్లించొచ్చని ముకుందన్ మీనన్ తెలిపారు. ఏసీ కొనాలని ఉన్నా ఒకేసారి చెల్లించే స్తోమత లేనివారు చాలా మంది ఉన్నారు. వారి కోసం బజాజ్ ఫైనాన్స్తో కలిసి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. 18 వాయిదాలతో కూడిన స్కీం కూడా ఉందన్నారు. కాగా, కంపెనీ ఈ ఏడాది 82 మోడళ్లను విడుదల చేస్తోంది. ఇన్వర్టర్ ఏసీల విభాగంలో ప్రస్తుతం 5 మోడళ్లను విక్రయిస్తోం ది. ఈ ఏడాది మరో 20 మోడళ్లను తీసుకొస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement