-
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం: సజ్జల రామకృష్ణారెడ్డి
-
దళిత జన జీవననాదం బాబూజీ
ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర దుర్భిక్షం కోరల నుంచి తప్పించి, మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించి ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధం అయ్యేలా చేసింది జగ్జీవన్రామ్. స్వాతంత్య్ర భారతం లో దేశవ్యాప్తంగా ఎక్కు వ ప్రజాదరణను చూర గొన్న దళితనేత బహుశా బాబూ జగ్జీవన్రామ్ ఒక్కరే. 1936లో మొదటి సారి బిహార్ విధాన సభకు ఎన్నికైనప్పటి నుంచీ, కన్ను మూయ డానికి రెండేళ్ల ముందు, 1984లో పార్లమెంటేరియ న్గా కొనసాగే వరకూ ప్రతి ఎన్నికలలోనూ ఆయన గెలుపొందారు. అయితే దళితులకు రాజకీయ సాధి కారత కల్పించే కృషిని ఆయన ఇంకా ముందే, 1935 లోనే ప్రారంభించారు. ఆ సంవత్సరంలోనే ఆయన హమ్మండ్ కమిషన్ ముందు హాజరై, 1936-37 ఎన్ని కలలో దళితులు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని నొక్కి చెప్పారు. ఒక వ్యక్తికి ఒక ఓటు, ప్రతి ఒక్కరి ఓటుకూ ఒకే విలువ అనే సూత్రం కింద దళి తులు ఓటు హక్కును పొందడం అప్పటి నుంచే మొదలైంది. స్వాతంత్య్రానంతర భారతదేశ నిర్మా ణంపై బాబూజీ తనదైన చెరగని ముద్రవేశారు. కేం ద్రంలో కార్మిక శాఖ, రైల్వేలు, రవాణా- కమ్యూనికే షన్లు, ఆహారం-వ్యవసాయం, సేద్యపు నీరు- రక్షణ వంటి అనేక కీలక శాఖలు నిర్వహించారు. కార్మిక సంక్షేమం కోసం కాలపరీక్షకు నిలిచే విధానాలను, చట్టాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుం ది. పారిశ్రామిక వివాదాల చట్టం-1947, కనీస వేతనాల చట్టం-1948, భారత కార్మిక సంఘాల సవ రణ చట్టం-1960, బోనస్ చెల్లింపు చట్టం-1965 వంటి చరిత్రాత్మక చట్టాలను తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అంతేకాదు, ఎంపా ్లయీ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం-1948, ప్రొవిడెంట్ ఫండ్ చట్టం-1952 తీసుకురావడం ద్వారా ఆయన ఆనాడే సాంఘిక భద్రతా చర్యలకు పునాదులు వేశా రు. రైల్వేమంత్రిగా ఉన్నపుడు బ్రహ్మపుత్ర మీద వం తెనను నిర్మింపచేయడంలో ఆయన ఎంతో దూర దృ ష్టిని కనబరిచారు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న వ్యూహా త్మకమైన ప్రాముఖ్యం దృష్ట్యా కూడా ఆయన ఆ నిర్ణ యం తీసుకున్నారు. అందువల్ల అసోం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంతో అనుసంధానం చేయడానికి సాధ్యమైంది. 1957లో రైల్వే మంత్రిగా ఉండి బాబూజీ తీసు కున్న చొరవ ఫలితంగానే ఎస్సీ, ఎస్టీలకు ప్రమోష న్లలో రిజర్వేషన్ మొదటిసారి అమలులోకి వచ్చింది. ఆయన నిర్ణయంపై నిరసన, వ్యతిరేకత ఎదురవడం తో విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కోర్టు ఆయన నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు జరుగు తోంది. రక్షణ మంత్రిగా బాబూజీ ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరింది. ఇందిరా గాంధీ అందించిన స్ఫూర్తిదాయక మైన నాయకత్వంలో బంగ్లాదేశ్ విముక్తి ఘట్టాన్ని ఆయనే పర్యవేక్షించారు. 1971, డిసెంబర్ 16న స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరించినట్టు ఆయన చరిత్రా త్మక ప్రకటన చేస్తూ, ‘‘బంగ్లాదేశ్లోని పశ్చిమ పాకి స్తాన్ దళాలు బేషరతుగా లొంగిపోయాయి... డక్కా (నేడు ఢాకా అంటున్నాం) ఇప్పుడు ఒక స్వతంత్ర దేశానికి ఒక స్వతంత్ర రాజధాని’’ అన్నారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాలకే, తొమ్మిది మాసాల యుద్ధం తర్వాత భారత-బంగ్లా సంయుక్త దళాల చేతిలో పాకిస్తాన్ దళాలు ఓటమిని అంగీకరించాయి. ‘‘ఇంతవరకు అత్యుత్తమ రక్షణమంత్రి బహుశా ఆయనే. సైనిక వ్యూహంపైన కూడా ఆయనకు అద్భు తమైన అవగాహన ఉంది. ఆయన గొప్ప పాలనా దక్షుడు. త్రివిధ దశాలకు కావలసిన మానవ వన రులు, ఆయుధ సామగ్రి, మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత మేరకు అందేలా చూడడంలో ఆయన తీసుకున్న శ్రద్ధ ఎంతో ఉంది’’ అన్నారు అప్పటి ఈస్ట్రన్ కమాండ్ ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జె.ఎఫ్.ఆర్. జాకబ్. ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర దుర్భిక్షం కోరల నుంచి తప్పించి, మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించి ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధం అయ్యేలా చేసింది జగ్జీవన్రామ్. పి.ఎల్. 480 అనే అవమానకరమైన షరతు మీద అమెరికా నుంచి గోధుమల దిగుమతిని ఆయన ఆపించారు. జన సామాన్యానికి ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందేలా పౌర పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దారు. బాబూ జగ్జీవన్రామ్ సామాజిక న్యాయాన్ని గట్టిగా కాంక్షించిన నాయకుడు. సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా న్యాయం అందాలని నిరం తరం తపించేవారు. 1945లో కాంగ్రెస్, ముస్లింలీగ్ల మధ్య సిమ్లాలో జరిగిన చర్చలలో (ఇవే కేబినెట్ మిషన్ ప్లాన్కు దారితీయించాయి) దళితుల ప్రయో జనాలను దృష్టిలో ఉంచుకోలేదని ఆయన భావిం చారు. కేబినెట్ మిషన్ దళితుల పట్ల న్యాయంగా వ్యవహరించలేదన్న డా. అంబేద్కర్ అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తూ; ‘‘రాజ్యాంగ శాసనసభలోనూ, ఆయా పరగణాల శాసనసభలలోనూ జనాభా దామాషాను బట్టి ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇవ్వా’’ లన్న డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ డిమాండ్ను నొక్కి చెప్పారు. 1940ల వరకూ దళితుల అభివృద్ధికి పెద్దగా జరి గింది ఏమీలేదని గ్రహించి జగ్జీవన్రామ్ తన వైఖరిపై పునరాలోచించుకున్నారు. కాంగ్రెస్ అగ్రవర్ణ హిందువుల పార్టీ అని 1944లో వేవెల్ చేసిన చిత్రీక రణను ఆమోదించడానికి కూడా ఇది ఆయనను పురి గొల్పింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఎస్సీ అధికారులు కొద్దిమందే ఉండేవారు. ముఖ్యమంత్రులుగా అగ్రకులాల వారే ఉండేవారు. ఈ పరిస్థితిలో బాబూజీకి గల రాజకీయ ప్రాబల్యం, ఆయనకు గల ప్రజాబలమే డా. అంబేద్కర్ తర్వాత ఎస్సీ, ఎస్టీల ప్రగతికి ప్రధాన చోదకశక్తిగా ఆయనను వీరంతా గుర్తించేలా చేశాయి. వీరు రిజర్వేషన్లను అమలు చేసేలా, ఎస్సీ, ఎస్టీలకు ఇతర పథకాలు ప్రారంభించేలా, హాస్టళ్లను ఏర్పాటు చేసేలా, అంట రానితనానికి వ్యతిరేకంగా పనిచేసేలా బాబూజీ చేయగలిగారు. అస్పృశ్యతా నిర్మూలన చట్టాన్ని తేవ డంలోనూ ఆయనదే కీలకపాత్ర. 1967లో దీనినే సవ రించి పౌరహక్కుల చట్టం-1955 అని పేరుపెట్టారు. (కొప్పుల రాజు, వ్యాసకర్త చైర్మన్, ఎస్సీ విభాగం, ఏఐసీసీ, న్యూఢిల్లీ)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement