-
భూమి పూజ తరువాత పనుల్లో జాప్యం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఎక్కడైనా, ఏ పనైనా భూమి పూజ (శంకుస్థాపన) చేసిన తరువాత వీలైనంత త్వరగా పనులు ప్రారంభం కావాలని, ఏమాత్రం జాప్యం జరగకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా)పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం.. సాగు నీటి కింద మంజూరైన వివిధ పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ వేగంగా పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి. ముద్దనూరు–కొడికొండ చెక్పోస్టు రహదారి చాలా కీలకం. నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాతీయ రహదారి మాదిరిగా ముద్దనూరు–కొడికొండ చెక్పోస్టు రహదారిని నిర్మించాలి. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్, సిటీ సెంటర్, సెంట్రల్ బోలీవార్డు, స్లాటర్ హౌస్ల నిర్మాణం జరగాలి. అన్ని లేఅవుట్లలో నీటి సరఫరాతో పాటు సీవరేజ్ పనులు చేపట్టాలి. రింగ్ రోడ్ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. చేపట్టిన ఏ పని అయినా దీర్ఘకాలం ఉండేలా చేయాలి. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు ► వేంపల్లిలో రూ.92 కోట్లతో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులకు ఆమోదం ► పనులు మొత్తం ఒకేసారి మొదలు పెట్టకుండా దశల వారీగా చేయాలి. అంతటా ఒకేసారి గుంతలు తవ్వి పనులు చేపడితే పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. ► ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక దగ్గర పని ప్రారంభించి అది పూర్తయ్యాక మరో దశకు వెళ్లాలి. ఆలయాలు–అభివృద్ధి ► గండి వీరాంజనేయస్వామి ఆలయంలో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలి. ► 24 దేవాలయాల పునర్నిర్మాణంతో పాటు కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 26 ఆలయాల నిర్మాణం చేపట్టాలి. తొండూరులో బాలికల బీసీ గురుకుల పాఠశాల, పులివెందుల, వేంపల్లెలో రైతు బజార్లు, పులివెందులలో క్రికెట్ స్టేడియం నిర్మాణం, కడప క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైటింగ్ పనులకు శ్రీకారం చుట్టాలి. కడప రైల్వే స్టేషన్, రిమ్స్ రోడ్ల అభివృద్ధితోపాటు నగరంలో అత్యంత ప్రధానమైన నాలుగు రహదారులను రూ.217 కోట్లతో తొలి దశలో అభివృద్ధి చేయాలి. కడప విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేలా రన్వే విస్తరణకు 47 ఎకరాలను సేకరించి ఎయిర్పోర్టు అథారిటీకి అప్పగించాలి. బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్ పూర్తి కావాలి.. బుగ్గవంక ప్రాంతంలో 10 కి.మీ ప్రొటెక్షన్ వాల్కుగానూ వైఎస్సార్ హయాంలో 7 కి.మీ పూర్తి చేశారు. మిగిలిన 3 కి.మీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. పులివెందులలోని ఏపీ–కార్ల్ సంస్థలో ఇర్మా–ఏపీ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్–ఏపీ) ఏర్పాటుకు ఈనెల 24న శిలా ఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. పులివెందులను మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలి.. పులివెందుల, మైదుకూరు, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాలతో పాటు కడపలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి సమావేశంలో అధికారులు వివరించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో తొలిసారిగా పూర్తిస్థాయిలో 10.14 టీఎంసీల నీరు నిల్వ చేసినట్లు తెలిపారు. ‘ఈఏపీ’ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.184 కోట్లతో 76 రహదారులకు టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. అన్ని రంగాలలో పనులు చేపడుతూ దశలవారీగా పులివెందులను మోడల్ టౌన్గా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. -
కడా ఎక్కడ?
=ఉనికి కోల్పోయిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ =మంజూరు చేసిన రూ.కోట్ల నిధులు ఏమైనట్లో =‘కడా’ వివరాలు కలెక్టరేట్లోనూ లేవు =మదనపల్లె సబ్కలెక్టర్కూ తెలియవు =ఏనాడూ ‘కడా’ గురించి ప్రశ్నించని చంద్రబాబు సాక్షి, చిత్తూరు: కుప్పం అభివృద్ధి సంస్థ (కడా) ఆనవాళ్లు మాయ మయ్యాయి. అభివృద్ధి పేరుతో కుమ్మరించిన రూ.కోట్లు ఏమయ్యూయో ఎవరికీ తెలియదు. ఈ సంస్థ వివరాలు కలెక్టర్ కార్యాలయంలోనూ లేవు. దీనిని ఏర్పాటుచేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలులేవు. ప్రస్తుతం కడా భవనాల్లో ఐటీఐ, పాలసేకరణ కేంద్రాలు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం చంద్రబాబు హయంలో ఏర్పాటు చేసిన కడా ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైంది. ప్రస్తుతం ఈ భవనాల్లో ప్రభుత్వ ఐటీఐ, పాలసేకరణ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేశారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు కుప్పం, శాంతిపురం, వి.కోట, రామకుప్పం, గుడుపల్ల్లె మండలాల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా డెప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఒక ఓఎస్డీని నియమించి, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని 1998లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో ప్రభుత్వం కడా పరిధిలో రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, కమ్యూనిటీభవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది. అప్పట్లో ఈ నిధులు ఏం చేశారు.. ఎక్కడెక్కడ ఖర్చుచేశారు.. ఎంత ఖర్చు చేశారనే వివరాలు లేవు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత కడా(కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఉనికి కోల్పోయింది. డీఆర్డీఎ నిధులతో కడా కోసం శాంతిపురం మండలం తుంసీ వద్ద ప్రత్యేకంగా ఒక కార్యాలయం నిర్మించారు. ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ పేషీ కూడా ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గ పరిపాలన అంతా ఇక్కడి నుంచే సాగేవిధంగా జిల్లా నుంచి డెప్యూటేషన్ పై పర్యవేక్షకులను, సీనియర్అసిస్టెంట్లను, గుమాస్తాలను చాలా మందిని నియమించారు. ఆ తరువాత వీరందర్నీ వెనక్కి పిలిపించారు. కడా ఉనికి అధికారులకే తెలియదు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేశారా, ఇందుకేమైన జీ.వో ఉందా.. ఏ కారణాలతో కడా ఉనికిని కోల్పోయిందనేది తెలుసుకునే అంత తీరిక, ఓపిక కుప్పం శాసన సభ్యుడుగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదు. ఈ విషయంగా ఏనాడూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలూ లేవు. 12 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కడా కార్యాలయ భవనాలు నేడు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ఆవరణలోనే ఒకపక్కగా ప్రభుత్వ ఐటీఐ నిర్వహిస్తున్నారు. మరొక గదిని పాలసేకరణ కోసం, ఇంకో గదిని మహిళా సంఘాల కార్యాలయం కోసం కేటాయించారు. చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కడా పరిస్థితి ఏమిటనేది జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు తెలియదు. దీనికి సంబంధించిన ఫైల్ కలెక్టరేట్లోనూ లేదు. అలాగని సంబంధిత రెవెన్యూడివిజన్ మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలోనూ కడా వివరాలు లేవు. కడాకు సంబంధించిన ఫైళ్లు, అప్పుడు చేసిన నిధుల వ్యయం ఏమైందనేది సమాధానం చెప్పేవారు లేరు. డీఆర్డీఏ అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులు మొత్తం మదనపల్లె సబ్కలెక్టర్కు స్వాధీనపరిచినట్లు చెబుతున్నారు. వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తే కడా చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ఉండే ది.. ఇప్పుడు ఏమైందనేది మాకు తెలియదు అంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారు. శాంతిపురం తహశీల్దార్కూ వివరాలు పూర్తిగా తెలియవు. కుప్పం ప్రజాప్రతినిధిగా చంద్రబాబు కూడా కడా గురించి అధికారులను ప్రశ్నించిన దాఖలాలు లేవు. అంతే మరి అధికారంలో ఉంటేనే హడావుడి అన్నట్లు కుప్పం నియోజకవర్గపరిస్థితి మారింది. అప్పట్లో లక్షలు పోసి కడా కోసం కట్టిన కార్యాలయ భవనాలు ఎందుకూ పనికిరాకుండా నిరర్థకంగా ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement