-
చాంపియన్ రామకృష్ణ
ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఫిడే మాస్టర్ జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్) సత్తా చాటాడు. గోవాలో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ను కై వసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఫైనల్ రౌండ్లో రామకృష్ణ (8, ఆంధ్రాబ్యాంక్)... ఇంటర్నేషనల్ మాస్టర్ కులకర్ణి విక్రమాదిత్య (7, వెస్ట్రన్ రైల్వేస్)పై గెలుపొందగా... హిమాన్షు శర్మ (8, హరియాణా)... ఆర్ . బాలసుబ్రహ్మణ్యం (7, తమిళనాడు)పై విజయం సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అరుుతే మెరుగైన టైట్రేక్ స్కోరు ఆధారంగా రామకృష్ణ విజేతగా నిలవగా... హిమాన్షు వర్మ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఇతర మ్యాచ్ల్లో ఎం. శ్రీనివాసరావు (7, ఆంధ్రప్రదేశ్)... పూబాలన్ (7, తమిళనాడు)పై విజయం సాధించారు. డి. గుకేశ్ (7, తమిళనాడు), ఆది ఆమేయా (7, గోవా) మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. విజేతగా నిలిచిన రామకృష్ణను తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఎత్తుకు పైఎత్తులు వేస్తూ..
బోట్క్లబ్(కాకినాడ) : లయన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక చల్లా ఫంక్షన్ హాలులో జరుగుతున్న ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ మూడో రోజుపోటీలను శుక్రవారం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ డీఎస్ఆర్కే సాయిబాబు ప్రారంభించారు. చెస్ ద్వారా తెలివితేటలు పెరుగుతాయని, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎస్ రామన్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. పోటీల్లో స్థానిక కేకేఆర్ గీతమ్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి కేవీ సుభాష్ కొత్త రికార్డును నమోదు చేసుకుని ఆంధ్రాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. పశ్చిమ బెంగాళ్కు చెందిన ఇన్కమ్టాక్స్ అధికారి రేటింగ్ ప్లేస్ ఉన్న క్రీడాకారుడు 2050 పాయింట్లో ఉన్న మజుందార్ శంకర్ను సుభాష్ ఓడించాడు. ఎన్నో అవార్డులు కేవలం 13 ఏళ్ల వయస్సులో సొంతం చేసుకోవడం గొప్ప విషయమని, ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వైడీ రామారావు కొనియాడారు. క్లబ్ సభ్యులు కెఆర్సీ రావు, చల్లా నిరంజన్రావు, శ్రీరామరాజు, సాయిరామ్, కామరాజు, లింగమల్లు, కృష్ణమూర్తి, చీఫ్ కుమార్తోపాటు పలువురు పాల్గొన్నారు. మూడో రోజు స్కోర్ వివరాలు ఇలా... రామకృష్ణ(తమిళనాడు) నాలుగు పాయింట్లు- అరవింద్బాబు.ఎల్(ఆంధ్రప్రదేశ్) మూడు పాయింట్లు సాధించారు. అర్జున్తివారి(రైల్వేస్) 3.5 - శ్రీవత్సవ ప్రత్యూష్ 3.5 పాయింట్లు సాధించగా డ్రాగా ముగిసింది. హేమచంద్రమౌళి(ఆంధ్రప్రదేశ్) 3- మల్లేశ్వరరావు నాలుగుపాయింట్లు సాధించారు. అనిల్కుమార్(కేరళ) 3.5, తుషాలి(ఆంధ్రప్రదేశ్) 3.5 పాయింట్లు సాధించగా, కె.శశిధర్కార్తీక్(ఆంధ్రప్రదేశ్) 3.5-సాయిఅగ్ని(తెలంగాణా) 3.5 పాయింట్లు సాధించగా డ్రాగా ముగిసింది. ప్రతీక్శ్రీవాత్సవ్(తెలంగాణా) మూడు పాయింట్లు - డి.లక్ష్మణరావు(ఆంధ్రప్రదేశ్) నాలుగు పాయింట్లు సాధించారు. తేజకీర్తి(ఆంధ్రప్రదేశ్) 3.5- ఎస్.ఆదిత్య(తమిళనాడు) 3.5 పాయింట్లు సాధించడంతో డ్రాగా ముగిసింది. బీఎన్బీ పవన్(ఆంధ్రప్రదేశ్) నాలుగు - సూర్యధనుష్(ఆంధ్రప్రదేశ్)మూడు పాయింట్లు సాధించారు. కె.వి.సుభాష్(ఆంధ్ర) నాలుగు - జె.నాగరాజు మూడు పాయింట్లు, అన్కన్రాయ్(వెస్ట్బెంగాళ్) 3.5- బోనురవికుమార్(3.5) పాయింట్లు సాధించగా డ్రాగా ముగిసింది. అర్జున్కల్యాణ్(తమిళనాడు) నాలుగు పాయింట్లు-జడికృష్ణ మూడు పాయింట్లు సాధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement