1980-81లో ఇందిర ఆలోచన.. సీఐఏ రహస్య నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్ అణ్వస్త్ర సామర్థ్యం సమకూర్చుకోకుండా నిరోధించేందుకు 1980-1981లో ఆ దేశంలోని అణు పరిశ్రమలపై సైనిక చర్య చేపట్టాలని నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆలోచించినట్లు అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సీఐఏ రహస్య నివేదిక చెప్తోంది. 1981 సెప్టెంబర్ 8వ తేదీతో ఉన్న 12 పేజీల ఆ పత్రాన్ని ఈ ఏడాది జూన్లో సీఐఏ వెబ్సైట్లో బహిర్గతం చేశారు.
‘పాకిస్తాన్లో అణు పరిణామాలపై భారత్ ప్రతిస్పందన’ అనే శీర్షికతో ఉన్న ఆ పత్రం సారాంశమేమిటంటే... ‘‘భారత్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్కు అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేస్తోంది. అదే సమయంలో పాక్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకుంటోందని భారత్ విశ్వసించింది. అణ్వస్త్రాల్లో వినియోగించే ప్లుటోనియం, అమితంగా శుద్ధిచేసిన యురేనియంను ఉత్పత్తి చేసే చివరి దశలో పాక్ ఉంది. దీంతో పాక్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోకుండా నిరోధించేందుకు సైనిక చర్య చేపట్టాలని ఇందిర సర్కారు ఆలోచించింది.
అదే సమయంలో భారత్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సైన్యానికి నిర్దేశించింది. థార్ ఎడారిలో భూగర్భ పేలుడు చేపట్టేందుకు 1981 ఫిబ్రవరిలో తవ్వకం కూడా మొదలైంది. 40 కిలోటన్నుల అణ్వస్త్ర పరీక్ష నిర్వహించేందుకు మే నాటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిన వారం రోజుల తర్వాత భారత్ కూడా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించనుంది.
అయితే.. పాక్ నిర్వహించబోయే అణ్వస్త్ర పరీక్ష భారత్కు జాతీయ ముప్పు కాబోదని భారత ప్రభుత్వం అంచనా వేసినట్లు కనిపిస్తోంది. భారత్ ముందుగా దాడి చేస్తే ఈ ప్రాంతంలో భారత్కు జరిగే నష్టాన్ని.. శాంతియుత అణు విస్ఫోటన కార్యక్రమాన్ని పునరుద్ధరించటం ద్వారా తగ్గించవచ్చని తలచినట్లు కనిపిస్తోంది. బహుశా ఈ ఆలోచనతో ఇందిరాగాంధీ పాక్పై ముందస్తు సైనిక చర్యకు అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు.’’
పాక్పై సైనిక చర్యకు యోచన!
Published Tue, Sep 1 2015 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
No Headline
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement