ఒవైసీ సభ వెలుపల శివసేన ఆందోళన | Sakshi
Sakshi News home page

ఒవైసీ సభ వెలుపల శివసేన ఆందోళన

Published Wed, Feb 4 2015 6:27 PM

అసదుద్దీన్ ఒవైసీ(ఫైల్)

పుణే: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కొంధ్వాలోని కౌసర్ బాగ్ లో ముస్లిం రిజర్వేషన్ల కోసం ఏర్పాటు సభలో బుధవారం ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం వెలుపల శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒవైసీ ప్రసంగం మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని, మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు. 

కాగా ఒవైసీ సభకు అంతకుముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే కొన్ని షరతులతో సమావేశానికి నేడు అనుమతినిచ్చారు. సభకు 2 వేల మందికి మించి రాకూడదని, నేతల ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.

Advertisement
Advertisement