ఢిల్లీకి రానున్న ఫేస్బుక్ స్థాపకుడు | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి రానున్న ఫేస్బుక్ స్థాపకుడు

Published Fri, Oct 16 2015 3:03 PM

ఢిల్లీకి రానున్న ఫేస్బుక్ స్థాపకుడు - Sakshi

వాషింగ్టన్: ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జూకర్బెర్గ్ ఈ నెలాఖరులో భారత్ రానున్నారు. ఈ నెల 28న ఢిల్లీ ఐఐటీలో జరుగనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా కొనసాగుతున్న భారతీయులతో అనుసంధానం కావడానికి ఈ సదస్సులో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. ' భారత్లో 13 కోట్లకుపైగా ప్రజలు ఫేస్బుక్ను వినియోగిస్తున్నారు. అత్యంత చురుగ్గా మన సముహాల్లో ఒక్కటైన వారి అభిప్రాయాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను' అని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ ఐఐటీలో టౌన్హాల్ క్వషన్-ఆన్సర్ సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

'మీరేమైనా అడుగాలనుకుంటే దిగువన ఉన్న కామెంట్స్లో అడుగండి. ఏదైనా ప్రశ్నకు మీరు ఓట్ చేయాలనుకుంటే దానిని లైక్ చేయండి. ఫేస్బుక్ నుంచి వచ్చే ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం ఇస్తాను. అదేవిధంగా ఢిల్లీ ఐఐటీలో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానం ఇస్తాను'  జూకర్బెర్గ్ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement