బీజింగ్: కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాన్ని ఉల్లంఘించి ఏడుగురు పిలల్ని కన్నందుకు ఓ చైనా కుటుంబం పడరాని కష్టాలు పడుతున్నది. చైనాలో ఒకే బిడ్డను కనాలనే వివాదాస్పదమైన విధానం చాలాకాలంగా అమల్లో ఉంది. ఈ పాలసీని ఉల్లంఘించి ఏడుగురు పిల్లల్ని కన్నందుకు ఆ కుటుంబంపై ప్రభుత్వం భారీమొత్తంలో 1,10,180 డాలర్లు (రూ. 71.35 లక్షలు) జరిమానా విధించింది. బీజింగ్లోని టాంగ్ఝౌ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబానికి 1984 నుంచి జనాభా నమోదు సందర్భంగా నివాస అనుమతిగా ఇచ్చే 'హుకావ్' అనుమతి లేదు. దీంతో ఈ కుటుంబంపై స్థానిక జనాభా, కుటుంబ నియంత్రణ కమిషన్ 7 లక్షల యువాన్ల జరిమానా విధించింది. ఇటీవల కుటుంబ నియంత్రణ విధానం అమలును సరళతరం చేసినప్పటికీ, ఇలా ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తుండటంతో చైనాలో ఆందోళన వ్యక్తమవుతున్నది.
'హుకావ్' అనుమతి ఉంటేనే చైనా పౌరులకు ప్రభుత్వం నుంచి ఉచిత విద్య, ఆరోగ్యరక్షణ, ఇతర సామాజిక సంక్షేమ ఫలాలు అందుతాయి. "హుకావ్' అనుమతి లేకపోవడంతో తన తోబుట్టువులు నలుగురిని ఉన్నత పాఠశాల నుంచి తొలగించారని, ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నవారిని కూడా ఉన్నత పాఠశాలకు వస్తే తొలగించే అవకాశముందని జాంగ్ జెలాంగ్ తెలిపారు. తనకు ఇటీవలే "హుకావ్' అనుమతి వచ్చిందని, అయినా సరైన విద్య లేకపోవడంతో తనకు మంచి ఉద్యోగం దొరకడం కష్టమేనని పేర్కొన్నారు.
ఏడుగురిని కన్నందుకు 70 లక్షల జరిమానా!
Published Fri, Oct 9 2015 5:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement