రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Thu, Oct 15 2015 6:20 PM

two dies in road accident in mahabubnagar district

బాలానగర్(మహబూబ్‌నగర్ జిల్లా): బాలానగర్ మండలం గౌతపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. బాలానగర్ నుంచి తొమ్మిదిరేకుల వైపు వెళ్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతిచెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
మృతులు రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం బేదపూర్ గ్రామానికి చెందిన విస్లావత్ మంగ్యానాయక్, అదే మండలం వెంకటాపూర్‌కు చెందిన సంతోష్‌లుగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement