సాక్షి జియో బీ విజేత ఆనంద్ | Sakshi
Sakshi News home page

సాక్షి జియో బీ విజేత ఆనంద్

Published Mon, Mar 2 2015 2:19 AM

Sakshi India Geo Bee-2015 winner T. anand

సాక్షి, హైదరాబాద్: సాక్షి ఇండియా జియో బీ - 2015 ఘనంగా ముగిసింది. సాక్షి టీవీ స్టూడియోలో జరిగిన ఈ తొలి ఎడిషన్ ఫైనల్స్‌లో 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ విద్యా భవన్‌కు చెందిన టి.ఆనంద్ (తొమ్మిదో తరగతి) విజేతగా నిలిచి స్వర్ణపతకం అందుకున్నాడు. మెరీడియన్ స్కూల్ విద్యార్థి రోహిత్ రాఘవన్ (తొమ్మిదో తరగతి)కు రజతం, గీతాంజలీ దేవ్‌శాల విద్యార్థి ఆర్.ఎం. సుదర్శన్ (ఏడో తరగతి)కు కాంస్యం దక్కాయి.

ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గచ్చిబౌలి న్యూటన్ క్యాంపస్ ప్రిన్సిపల్ గుస్తావ్ జె.గ్రోప్ విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సాక్షి టీవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రధాన స్పాన్సరర్‌గా వ్యవహరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement