తెలంగాణకు కొత్త సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కొత్త సివిల్ సప్లయిస్ కార్పొరేషన్

Published Sun, May 18 2014 3:21 AM

New civil supplies corporation for telangana

సాక్షి, హైదరాబాద్: జూన్ రెండో తేదీ(అపాయింటెడ్ డే) నుంచి తెలంగాణలో ప్రజాపంపిణీ వ్యవహారాల కోసం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణకు ప్రత్యేకంగా రూ. 5 కోట్లతో కార్పొరేషన్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్ శర్మ, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్, పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.రవిబాబు డెరైక్టర్లుగా తెలంగాణకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారు.
 

Advertisement
Advertisement